breaking news
terrorism camps
-
ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?
కనానాస్కిస్: తమ పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపై స్పందించకుండా కళ్లు మూసుకొని ఉంటే మానవత్వానికి ద్రోహం చేయడమే అవుతుందని తేలి్చచెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం కెనడాలో జీ7 కూటమి సదస్సులో ‘ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ముష్కర మూకలను అంతం చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండొద్దని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పోషకులను, ఉగ్రవాద బాధితులను ఒకే గాటన కట్టడం, ఒకేలా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ‘‘ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. ప్రజాస్వామ్య విలువలు పాటించే అన్ని దేశాలనూ ఉగ్రవాదం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. దురదృష్టవశాత్తూ మా పొరుగుదేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం.. ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను శిక్షించాలి. అలాంటి దేశాలను జవాబుదారీగా మార్చాలి. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు, రుణాలు ఇచ్చి సత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మనం నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ఉగ్రవాదం మన ఇంటి తలుపు తట్టినప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటామా? ఉగ్రవాదులను ఎగదోస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడడం ఏమిటి? మన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నిర్ణయాత్మక చర్యలు అవసరం. ఇంధన భద్రత మన బాధ్యత భవిష్యత్తు తరాల కోసం ఇంధన భద్రత సాధించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. ఇంధన భద్రత సాధించడం కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు.. పౌరుల పట్ల మన బాధ్యత కూడా. ఇంధనం రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. కలిసి పనిచేయాలి. ‘నేనొక్కడినే కాదు.. మనమంతా’ అనే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు, అనిశి్చత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంధన సరఫరా లేక గ్లోబల్ సౌత్ దేశాలు నష్టపోవాల్సి వస్తోంది. వాటిపై అధిక భారం పడుతోంది. ఆయా దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువులతోపాటు ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. తయారీ, రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచ సౌభాగ్యం కోసం ఒక శక్తిగా మార్చాలి. డీప్ఫేక్స్ పెద్ద ముప్పుగా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఏఐతో సృష్టించే కంటెంట్లో వాటర్మార్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. జీ7 దేశాల అధినేతలతో మోదీ చర్చలు కెనడాలో జీ7 సదస్సు సందర్భంగా కూటమి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాదంపై పోరాటంతోపాటు ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యూంగ్, ఫ్రాన్స్ అధినేత ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ పార్దో, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డసిల్వా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ. యూరోపియన్ కౌన్నిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులతో మోదీ భేటీ అయ్యారు. క్రొయేషియా ప్రధాని ప్లెంకోవిచ్తో చర్చలు ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగించుకొని బుధవారం క్రొయేషియా చేరుకున్నారు. జాగ్రెబ్ ఎయిర్పోర్టులో క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్ ప్లెంకోవిచ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్రొయేషియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోదీయే కావడం విశేషం. ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? కెనడాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘ఈరోజుల్లో మీరు ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? ట్విట్టర్లో మీరు చాలా చురుగ్గా ఉంటున్నారు’’ అని మాక్రాన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మాక్రాన్, మోదీ సైతం బిగ్గరగా నవ్వేశారు. ఇటీవల వియత్నాం పర్యటనకు వెళ్లినప్పుడు విమానం దిగే సమయంలో మాక్రాన్ను ఆయన భార్య బ్రిగెట్టా నెట్టివేసినట్లు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇలాంటివి జరిగేటప్పుడు తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి అని మాక్రాన్కు సలహా ఇచ్చారు. ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. మోదీ–మాక్రాన్ సంభాషణ పట్ల సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మోదీ నవ్వుతూ మాట్లాతూనే మాక్రాన్కు గట్టిగా చురక అంటించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. -
పాక్లో ఉగ్రవాద శిక్షణకు సకల సౌకర్యాలు
పాకిస్తాన్లో వేలాది మంది యువకులను బలవంతంగా ఉగ్రవాదులు 'డీరాడికలైజేషన్ క్యాంప్స్' కేంద్రాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పాకిస్తాన్లోని పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలలో డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మందికి శిక్షణ అందించే విధంగా రూపొందించినట్లు ఉపగ్రహ చాయా చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తూనే వారి అవసరాల మేరకు అత్యున్నత మౌళిక సదుపాయాలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ప్రార్థనలు చేసేందుకు మసీదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశారు. (కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు) ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శిక్షణ పొందుతున్న వారిలో 92శాతం 35 కన్నా తక్కువ వయసువారే కావడం, మరో 12 శాతం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తెలిసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి వారు శిక్షణ అందిస్తున్న హైటెక్ శిబిరాలే చెబుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆపేందుకు ఉక్కు కంచె నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాక్ డీరాడికలైజేషన్ శిబిరాలు చర్చనీయాంశంగా మారాయి. -
వారు సరిహద్దు దాటాలని చూస్తున్నారు : ఆర్మీ అధికారి
జమ్ము కశ్మీర్ : ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని వేర్వేరు శిబిరాల్లో దాదాపు 500 వందల మంది ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నారని నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ తెలిపారు. అంతేకాక, ఆంక్షలు సడలిస్తే అశాంతి రేపడానికి రెండు నుంచి మూడొందల మంది తీవ్రవాదులు కశ్మీర్లోనే ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం మీడియాతోమాట్లాడుతూ ఆయన ఈ విషయాలు ధృవపరిచారు. సరిహద్దు అవతల ఉన్నవారికి పాక్ సైన్యమే ఆయుధాలను, నిధులను సమకూర్చుతూ లాంచ్పాడ్ శిక్షణను కూడా ఇస్తున్నట్టు తమకు గట్టి సమాచారం ఉందని రణబీర్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల పాక్ నుంచి పంజాబ్లోకి డ్రోన్లు రావడంపైనా ఆయన స్పందించారు. ఎలాగైనా జమ్ము కశ్మీర్లో అలజడులు సృష్టించాలనే లక్ష్యంతో దాయాది దేశం వేస్తున్న కొత్త తరహా ఎత్తుగడలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను ధ్వంసం చేసే శక్తితో పాటు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్ధ్యం మన సైన్యానికుందని వెల్లడించారు. పాకిస్తాన్ ఎలాంటి కుట్ర పన్నినా, ఎంతగా ప్రయత్నించినా వారి ఆటలు సాగనివ్వమని సింగ్ స్పష్టం చేశారు. -
జై జవాన్!
నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కొంతకాలంగా పాకిస్తాన్ వైపు నుంచి సాగుతున్న అరాచకానికి తొలిసారి భారత సైన్యం నుంచి దీటైన జవాబు వెళ్లింది. 1971నాటి యుద్ధం తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారి ఎల్ఓసీని దాటి పాకిస్తాన్ భూభాగంలో మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి ఏడు చోట్ల గుర్తించిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురువారం వేకువజామున మన సైన్యం మెరుపు దాడుల్ని నిర్వహించింది. 38మందిని మట్టుబెట్టి మరి కొందర్ని అదుపులోకి తీసుకున్నారంటే... ఆ సంగతి మనం వెల్లడించేవరకూ ఇతర దేశాలతోపాటు పాకిస్తాన్కు కూడా తెలియదంటే ఈ మొత్తం ఆపరేషన్ ఎంత పకడ్బందీగా నిర్వహించారో అర్ధమవుతుంది. ఎంచుకున్న ప్రాంతంలో, అనుకున్న సమయానికి, ముందుగా నిర్ణయించిన విధంగా దాడులు జరపడం... ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించడం... అదే సమయంలో ఇటువైపు ఎలాంటి ప్రాణ నష్టమూ లేకుండా చూసుకోవడం మన సైనిక కమాండోల తిరుగులేని సామర్ధ్యాన్ని వెల్లడిస్తుంది. 250 కిలోమీటర్ల విస్తృతిలో ఎల్ఓసీ ఆవల హెలికాప్టర్లలో బలగాలను దించి ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. దీన్నంతటినీ ద్రోన్ కెమెరాలతో చిత్రించారు. వారం రోజులుగా ఎల్ఓసీలో పకడ్బందీ నిఘా పెట్టి, ఉగ్రవాద స్థావరాలను నిర్దిష్టంగా గుర్తించి ఈ దాడులు నిర్వహించారు. ఈ మాదిరి దాడులకు ఎంతో నైపుణ్యం, సమర్ధత కావాలి. అక్కడి సైనికుల జోలికెళ్తే మొత్తం ఆపరేషన్ను వక్రీకరించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ విషయంలో మన కమాండోలు అభినందనీయులు. ఏ దేశానికైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, అందుకు భంగం కలిగించే శక్తులపై దాడులు చేయడానికి సర్వహక్కులూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనా మన దేశం నిగ్రహం పాటిస్తూ వచ్చింది. సరిహద్దు ఆవలినుంచి వచ్చిన ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో ఎన్నిసార్లు, ఎంత విధ్వంసం సృష్టించినా... దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై నగరాన్ని నాలుగు రోజులపాటు గడగడలాడించి 164మందిని పొట్టన బెట్టుకున్నా ఓర్పుతో వ్యవహరించింది. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాదినుంచి సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేసి కారకుల్ని పట్టి బంధించి అప్పగిం చాలని కోరింది. మొన్నటి పఠాన్కోట్ దాడి వరకూ ఇలా ఎప్పటికప్పుడు చెబు తున్నా బుకాయించడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. భారత్లో సాగు తున్న ఉగ్ర దాడులతో తమకు సంబంధమే లేదన్న బలహీనమైన వాదనను వినిపిం చడాన్ని అది రివాజుగా మార్చుకుంది. అయితే ఉడీ ఉగ్రవాద దాడిలో 18మంది జవాన్ల ప్రాణాలు తీసినప్పటినుంచీ దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెడితే ఇవి మున్ముందు మరింత మితిమీరడం ఖాయమన్న వాదనలు వచ్చాయి. ఏదో చేస్తామన్నారు... ఏం చేస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వంపై వివిధ పక్షాలు విమర్శలు కురిపించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మరోపక్క పాకిస్తాన్ ఎప్పటిలానే ఉడీ దాడి ఉదంతాన్ని వక్రీకరించడం మొదలుపెట్టింది. దాంతో తమకు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిం చింది. పెపైచ్చు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్పై ఎదురుదాడికి దిగారు. వీటన్నిటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అన్నివిధాలా ఆలోచించింది. పర్యవ సానంగా మన వైఖరిలో గుణాత్మకమైన మార్పు కనబడింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించారు. మనకు హాని తలపెట్టినవారికి నొప్పి తెలిసేలా చేస్తామని రక్షణ మంత్రి పరీకర్ హెచ్చరించారు. ఉడీ ఉగ్రవాద దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను మరువబోమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘నీళ్లూ, నెత్తురూ కలిసి ప్రవహించలేవ’ని అంటూ సింధు నదీ జలాల ఒప్పందం పునఃసమీక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) సమావేశాలకు గైర్హాజరవుతున్నట్టు మన దేశం ప్రకటించింది. బంగ్లా, భూటాన్, అఫ్ఘాన్లు తాము సైతం హాజరుకాబోమని తెలిపి ప్రపంచం ముందు పాక్ను దోషిగా నిలిపాయి. కానీ పాకిస్తాన్ దీన్నంతటినీ తేలిగ్గా తీసుకుంది. మా దగ్గర అణ్వాయుధాలు న్నాయి... ప్రయోగించడానికి వెనకాడబోమని హెచ్చరించడం మొదలెట్టింది. ఎన్ని కలకు ముందూ, అధికారంలోకొచ్చాక కొన్నాళ్లు సొంతంగా ఆలోచించినట్టు కనిపిం చిన నవాజ్ షరీఫ్ అక్కడి సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారారు. తనకు తిరుగు లేని ప్రజామోదం ఉన్నా మునుపటి ప్రధానుల మాదిరే బలహీనంగా వ్యవహరిం చడం మొదలుపెట్టారు. అసాధారణ రీతిలో తన పుట్టినరోజునాడు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ వ్యవహార శైలి చూశాకైనా ఆయన మారలేకపోయారు. పాకిస్తాన్ సైన్యం, దాని ఆధ్వర్యంలోని గూఢచార సంస్థ ఐఎస్ఐలు పెంచి పోషించిన ఉగ్రవాద మూకలు తమ దేశానికే ముప్పుగా పరిణ మించినా అక్కడి పౌర సమాజం మద్దతును కూడగట్టి సైన్యం చేష్టలను నియం త్రించడానికి షరీఫ్ ఏమాత్రం ప్రయత్నించలేదు. అమెరికా కూడా ఈ ధోరణుల విషయంలో చూసీచూడనట్టే వ్యవహరించింది. ఈ పరిణామాలపై కళ్లుమూసు కుంది. ఉడీ దాడిని ఖండించడం తప్ప బాధ్యులు మీరేనని పాక్కు చెప్పడంలో అది విఫలమైంది. మన దేశం కూడా ఎల్లకాలమూ చూస్తూ ఊరుకుంటుందనుకోవడం తెలివితక్కువతనం. ఇప్పుడు నిర్వహించిన దాడుల్ని ‘ప్రతీకార చర్య’గా కాక ఉగ్ర వాద చర్యలను నిరోధించడంలో భాగంగా సాగించినవేనని చెప్పడం ద్వారా మన దేశం ఎంతో పరిణతితో వ్యవహరించింది. దీన్ని పాకిస్తాన్ ఎలా చూస్తుందన్నది దాని ఇష్టం. దాడులు నిజంకాదని, ఆవలినుంచి కాల్పులు జరిగాయని తన పౌరు లను నమ్మింపజూస్తున్నది. అయితే అటునుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామా లనైనా ఎదుర్కొనడానికి మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అది తప్పనిసరి. ఈ దశలోనైనా పాకిస్తాన్కు వాస్తవ పరిస్థితులు అవగాహనకొచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకూ, మరీ ముఖ్యంగా అమెరికా తదితర అగ్రరాజ్యాలకూ ఉంది.