Telangana Mazdoor Union
-
‘తెలంగాణ నుంచి స్పందన లేదు..’
సాక్షి, హైదరాబాద్ : అంతరాష్ట్ర సర్వీసులపై ఇప్పటి వరకు 3సార్లు చర్చలు, సమావేశాలు జరిగాయని తెలంగాణ మజ్ధూర్ యూనియన్ (టీజేఎమ్యూ) ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. అయినా టీఎస్ఆర్టీసీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుకోమన్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి స్పందన లేదన్నారు. బస్సులు లేకపోతే కొనేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే టీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ బస్సులను ప్రొత్సహించే విధంగా ఉందని అర్ధమవుతోందన్నారు. (తెలంగాణకు బస్సులపై నేడు మరోసారి భేటీ) ‘ఆర్టీసిని రక్షించుకుంటాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుకుంటే బస్సులు కొనడం ఇబ్బంది ఏం కాదు. కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. ఓ వైపు ఇరు రాష్ట్రాల మధ్య ప్రైవేట్ బస్సులు నడుస్తూ లాభాలు గడిస్తుంటే ఆర్టీసీ బస్సులు మాత్రం డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీకి రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని’ హనుమంతు డిమాండ్ చేశారు. -
జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. యాజమాన్యంతో శనివారం జరిగిన ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంయూ జెండా రంగు మార్చుకుంది. గులాబీ రంగులో ఉన్న జెండాలు తొలగించి.. తెల్లరంగు జెండాలు వాడాలని టీఎంయూ నిర్ణయించింది. తెల్లరంగు జెండాపై ధనస్సు గుర్తుతో టీఎంయూ జెండా కొత్త రూపు సంతరించుకుంది. రేపు కొత్త జెండాతో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం జరపుకోనుంది. (చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్ ఫోన్లు లాక్కున్నారు’) (చదవండి : ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’) -
సీసీఎస్లో టీఎంయూ హవా
ఆదిలాబాద్ కల్చరల్ : ఆర్టీసీ సీసీఎస్(క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ డెలిగేట్ల హవా కనిపించింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నుంచి ట్రాఫికల్ నుంచి ఎస్.విలాస్, జీఆర్ మౌళీ, రవీందర్ పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా మనోహన్ పోటీ చేశారు. ఎస్డబ్ల్యూఎఫ్ నుంచి ఎస్.ఊశన్న, ఈయూ నుంచి సత్యనారాయణ, హిరాజీ, సురేందర్, మెరుుంటనెన్స్కు టీఎంయూ నుంచి ఊరే ఆశన్న, ఈయూ నుంచి గట్టయ్య పోటీ చేశారు. కాగా 543 ఓట్లు ట్రాఫికల్కు ఉండగా, మెంటనెన్స్ ఓట్లు 98 ఉన్నాయి. ఈ ఎన్నిలను ఆర్టీసీ డీఎం సాయన్న ప్రొసిడింగ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ రాజెందర్, ట్రాఫికల్ ఆఫీసర్ జానాబాయిలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సీసీఎస్లో ట్రాఫికల్ హవా... ఆర్టీసీ సీసీఎస్ ప్రతినిధుల ఎన్నికల్లో టీఎంయూ మరోసారి హవా నిరూపించుకుంది. టీఎంయూ నుంచి ట్రాఫికల్లో ముగ్గురు పోటీ చేయగా టీఎంయూ నుంచి ఎస్.విలాస్ 390 ఓట్లు, జీఆర్ మౌళీ 382 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి 286 ఓట్లతో విజేతలుగా నిలిచారు. టీఎంయూ అభ్యర్థి 235 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈయూ అభ్యర్థి నారాయణ 133 ఓట్లతో పరాజయం పాలయ్యారు. కాగా ఎస్డబ్ల్యూఎఫ్కు ఊశన్నకు 71 ఓట్లు, ఈయూ నాయకుడు హిరాజీకి 11 ఓట్లు, సురేందర్కు 9 ఓట్లు పొలయ్యాయి. గ్యారెజ్ సెక్షన్ మెరుుంటనెన్స్ విభాగంలో టీఎంయూ అభ్యర్థి ఊరే ఆశన్న 82 ఓట్ల మెజార్జీతో ఘనవిజయం సాదించారు. కాగా పోటీ అభ్యర్థులు ఇద్దరు కె.గట్టయ్య(ఈయూ) 13 ఓట్లు, బి.నాందేవ్(ఎస్డబ్ల్యూఎఫ్) 0 ఓట్లతో పరాజయం పాలయ్యారు. దీంతో టీఎంయూ విజయకేతనం ఎగురవేసింది. స్వతంత్ర అభ్యర్థి గెలుపు ఉట్నూర్ : ఉట్నూర్ ఆర్టీసీ బస్సు డిపో సహకారం సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బుధవారం డిపో ఆవరణలో సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా సంతోష్కుమార్, సి.సతీష్, విద్యాసాగర్, సాయబ్రావ్, ధర్మేందర్, నాందెవ్ బరిలోకి దిగారు. డిపోలో మొత్తం 158 ఓట్లు ఉండగా 150 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సి.సతీష్ 64 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి తెలంగాణ మజ్దూర్ యూనియన్కు చెందిన సంతోష్కుమార్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ బస్సు డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంపై దృషి సారిస్తానన్నారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
టీఎంయూ ధూంధాం..
♦ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఘనవిజయం ♦ 27 డిపోల్లో విజయకేతనం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఘన విజయం సాధించింది. నగరంలోని అన్ని డిపోల్లో సమీప ప్రత్యర్థి కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో ఆర్టీసీ టీఎంయూ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వీఎస్టీ వద్ద ఉన్న సంఘం కార్యాలయం వద్ద కార్మికులు, యూనియన్ నాయకులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. బాణాసంచా పేల్చారు. మిఠాయీలు పంచుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలు ప్రతిష్టాత్మకంగానే భావించాయి. మొత్తం 10 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీఎంయూకే ఆర్టీసీ కార్మికులు పట్టం కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లోని 28 డిపోల్లో మెజారిటీ డిపోలను టీఎంయూ కైవసం చేసుకొంది. అన్ని డిపోలు, ఆర్టీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న సుమారు 21 వేల మందికి పైగా కార్మికుల్లో 97 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం తదితర పది కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీకి నిలిచాయి. 27 డిపోల్లో టీఎంయూ గెలుపు గ్రేటర్ హైదరాబాద్లో 28 డిపోల్లో 27 డిపోలను టీఎంయూ దక్కించుకుంది. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) డిపో మాత్రమే ఎంప్లాయీస్ యూనియన్ గెలుచుకుంది. మిగతా ముషీరాబాద్–1, ముషీరాబాద్–2, మహేశ్వరం, చెంగిచెర్ల, హయత్నగర్, కంటోన్మెంట్, బర్కత్పురా, బండ్లగూడ, బీహెచ్ఈఎల్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, కంటోన్మెంట్, హకీంపేట్, కుషాయిగూడ, ఫలక్నుమా, మెహదీపట్నం, రాజేంద్రనగర్, రాణిగంజ్–1, రాణిగంజ్–2,ఇబ్రహీంపట్నం, మిధాని, జీడిమెట్ల, మియాపూర్–1, మియాపూర్–2, మేడ్చల్, కూకట్పల్లి, పటాన్చెరు డిపోల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలిచింది. అన్ని చోట్ల ఎంప్లాయీస్ యూనియన్పైన విజయం సాధించింది. అప్పుడు స్నేహితులు...ఇప్పుడు ప్రత్యర్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కలిసి పనిచేసిన టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. తమ ప్రత్యర్థి అయిన ఎన్ఎంయూపైన ఉమ్మడిగా విజయం సాధించాయి. గుర్తింపు సంఘం ప్రతినిధులుగా రెండు సంఘాల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు సంఘాలు విడిపోయి ప్రత్యర్థులుగా నిలిచాయి. టీఎంయూ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పొటీ చేయగా, ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం ఎస్డబ్ల్యూఎఫ్, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఎన్నికల్లో నిలిచింది. అయినప్పటికీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎన్నికల్లో ఒక్క డిపోకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూవైపే కార్మికులు మొగ్గు చూపారు. -
ఆర్టీసీ డిపోలో రిలే నిరాహార దీక్షలు
ఆర్టీసీ యాజమన్యం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా.. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో.. కార్మికుల పనిగంటలను తగ్గించడంతో పాటు.. వేధింపులను ఆపాలను కోరుతూ.. ఆదివారం నుంచి రిలే దీక్షలను ప్రారంభించారు. డిపో మేనెజర్ వివరణ ఇచ్చే వరకు తాము దీక్షలు కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు. ఈ దీక్షలకు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సంఘీభావం తెలిపారు. -
కార్మికులతో చర్చల్లో ప్రతిష్టంభన
వేతన సవరణపై హామీ ఇవ్వని ఆర్టీసీ ఎండీ ఉద్యమబాట తప్పదన్న కార్మికులు సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ విషయంలో కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. బుధవారం గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ అధికారులు చర్చిం చారు. దాదాపు 274 అంశాలతో కూడిన సర్వీస్ కండిషన్స్పై సమగ్రంగా చర్చించినప్పటికీ వేతన సవరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేస్తే ఆర్టీసీపై రూ.1,800 కోట్ల భారం పడుతుందని, దాన్ని మోసే శక్తి ఆర్టీసీకి లేనందున ప్రభుత్వంతో చర్చిస్తానని సంస్థ ఎండీ సాంబశివరావు కార్మిక సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇందుకు కనీసం ఏప్రిల్ చివరి నాటికి గడువు అవసరమవుతుందన్నారు. ఇప్పటికే వేతన సవరణ గడువు దాటి రెండేళ్లు అయ్యిందని, ఇంకా జాప్యం సరికాదని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే తప్ప ఇందులో స్పష్టత రాదని ఎండీ తేల్చిచెప్పారు. దీంతో ముందుగా ప్రకటించిన విధంగా గురువారం నాటి బస్భవన్ ముట్టడిని కొనసాగించి తీరుతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. -
మంత్రిలా కాదు.. కార్మికునిలా పనిచేస్తా
మెదక్టౌన్: తాను మంత్రిలా కాకుండా కార్మికునిలా పనిచేస్తానని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ మజ్దూర్ యూనియన్(ఆర్టీసీ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.హరీష్రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్లో టీఎంయూ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న తీరు చరిత్రపుటల్లో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు. కార్మికుల హక్కులను కాపాడుతూ, ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీసీ విభజన జరిగాక, కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం తక్షణ సాయం కింద ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం నిబద్ధతో పనిచేసిన ఆర్టీసీ కార్మికుల రుణం తీర్చుకుంటామన్నారు. ఈనెల 13న జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి అభినందనీయమని, పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, 3 నెలల పాలనలో ఆర్టీసీ కార్మికులకు టీఆర్ఎస్ సర్కార్ ఎంతో చేసిందన్నారు. కొత్త డిపోల ఏర్పాటు, కార్మికుల సంక్షేమం, కొత్త బస్సుల కొనుగోలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు థామస్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరయ్య, శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.ఆర్.కె.రావు, మారయ్య, కె.ఎన్.రెడ్డి, జోనల్ కార్యదర్శులు ఆర్.ఎస్.రెడ్డి, శాఖయ్య, మెదక్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీరాజ్, ఆరీఫ్, శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
టీ-ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం
శామీర్పేట్ రూరల్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని హకీంపేట్ ఆర్టీసీ డిపో వద్ద టీఎంయూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తెలంగాణ సాధించుకున్న కార్మికులు కష్టించి పనిచేసి సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. కార్మికులు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. 15 రోజుల్లో ఉద్యోగుల్లో విభజన జరుగుతుందని ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా డిపోనకు చెందిన దాదాపు 350 మంది ఎన్ఎంయూ సంఘం నాయకులు, కార్మికులు టీఎంయూలో చేరారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ థమస్రెడ్డి, టీఎంయూ డిపో గౌరవ అధ్యక్షుడు వంగ పెంటారెడ్డి, టీఎంయూ నాయకులు ఎం.వి.రెడ్డి, కమలాకర్గౌడ్, ప్రసాద్, కృష్ణ, పి.ఆర్.రెడ్డి, రాజిరెడ్డి, చెన్నయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో చర్చలు విఫలం
-
ఆర్టీసీలో చర్చలు విఫలం
* 27 నుంచి కార్మిక సంఘాల నిరవధిక సమ్మె * ఐఆర్ చెల్లింపునకు గడువు కోరిన యాజమాన్యం * తిరస్కరించిన ఈయూ, టీఎంయూలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు 46 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లించాలనే డిమాండ్పై గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమితో యాజమాన్యం శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐఆర్ మంజూరుపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, మరికొంత సమయం కావాలని యాజమాన్యం కోరింది. దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. ‘ఈనెల 27న ఉదయం తొలి షెడ్యూలు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, సూపర్వైజర్స్ అసోసియేషన్లను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతాం’ అని ఈయూ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన చర్చల్లో ఈయూ తరఫున ఎం.హనుమంతరావు, ఎస్.బాబు, రాజేంద్రప్రసాద్, కె.రాజిరెడ్డి, దామోదరరావు, టీఎంయూ నుంచి తిరుపతి, థామస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. 2011కు ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడానికి వీలుగా అనుమతి మంజూరు చేసింది. 2011 నుంచి దాదాపు 1400 మంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్లు హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. పలు డిమాండ్లకు సంబంధించి కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయకుండా జాప్యం చేస్తుండటంతో కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు ఇక అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం సంయుక్తంగా ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లపై వెంటనే సానుకూలంగా స్పందించి అమలు చేయని పక్షంలో జనవరి 3 నుంచి సమ్మె ప్రారంభిస్తామని అందులో హెచ్చరించాయి. మరోవైపు మరో ముఖ్య కార్మిక సంఘం అయిన ఎన్ఎంయూ కూడా ప్రభుత్వానికి 21 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఆ గడువులోపు ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 24న సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. వెరసి ప్రధాన కార్మిక సంఘాలన్నీ సమ్మెకు సై అంటుండటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కార్మికుల ప్రధాన డిమాండ్లకు కచ్చితంగా తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. విచిత్రమైన విషయం ఏంటంటే... కార్మికులు డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలపై స్వయంగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదివరకే సానుకూల ప్రకటన చేసినా, ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకపోవటంతో అవి అమలుకు నోచుకోలేదు. డిమాండ్లపై ఒప్పందం చేసుకున్నాక కూడా అమలు చేయకపోవటంతో ప్రభుత్వంపై నమ్మకం సడలిందని, దీంతో గత్యంతరం లేక సమ్మెకు సిద్ధమయ్యామని కార్మిక సంఘాల నేతలు పద్మాకర్, అశ్వద్ధామరెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఎండీగా పూర్ణచంద్రరావు ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సమ్మె నోటీసు ఇవ్వటం బాధగా ఉన్నా, తమకు తప్పని పరిస్థితి అని వారు పేర్కొన్నారు. తమ సమ్మె ప్రతిపాదనకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు మద్దతు పలకాలని వారు కోరారు.