breaking news
Telangana IT Minister K.T.R
-
కేంద్రం 'పైసా'చికం.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘‘ఆర్థిక ఆంక్షలు సృష్టించి తెలంగాణను దెబ్బతీయడం ద్వారా పైశాచికానందం పొందాలని కేంద్రం చూస్తోంది. రాష్ట్ర సొంత ఆదాయం వేతనాలు, సంక్షేమ పథకాలకు సరిపోతుంది. అభివృద్ధి కోసం అప్పులు చేయక తప్పదు. రాష్ట్రం అప్పులు చేయకుండా అడ్డంకులు సృష్టించి.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అవినీతి జరుగుతోందని స్వయంగా ప్రధాని మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనం. దమ్ముంటే ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలి. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తారు. లక్షల పరిశ్రమలు మూతపడతాయి. కానీ ఒక్క అదానీ మాత్రం ప్రపంచ కుబేరుల టాప్ టెన్లో ఉంటారు. ఇదెలా? దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివీ.. సాక్షి: ఎనిమిదేళ్లలో రాష్ట్ర పురోగతి ఎలా ఉంది? కేటీఆర్: నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో ఈ మూడింటినీ సాధించాం. ఐటీ సహా ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వపరంగా 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించాం. మరో 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ప్రతిష్టాత్మక కాళేశ్వరాన్ని పూర్తిచేశాం. మిషన్ భగీరథతో తాగునీరిచ్చాం. 40వేల చెరువులు బాగు చేశాం. ఒక్క అసంతృప్తి ఉంది. కేంద్రం కృష్ణా, గోదావరి జలాల పంపిణీ చేయకపోవడంతో అనుకున్న ప్రాజెక్టులు పూర్తికాలేదు. కేంద్ర నిర్లిప్తత, నిర్లక్ష్యమే దీనికి కారణం. రాష్ట్రానికి 575 టీఎంసీల నీటివాటా కావాలన్నాం. ట్రిబ్యునల్కు సిఫారసు చేయాలని కోరాం. కానీ కేంద్రం పట్టించుకోలేదు. దీనితో ఇటు తెలంగాణకు అటు ఏపీకి అన్యాయం జరుగుతోంది. అయినా తెలంగాణలో 120 శాతం వ్యవసాయ విస్తరణ జరిగింది. ధాన్యాన్ని కొనలేక కేంద్రం చేతులెత్తేసింది. నిధుల విషయంలో ఆర్బీఐ చెప్పినట్లే దేశానికి తెలంగాణ నాలుగో ఆర్థిక చోదకశక్తి. కేంద్రానికి రాష్ట్రం 100 రూపాయలిస్తే.. తిరిగి వచ్చేది 46 రూపాయలే. తద్వారా దేశంలోని ఇతర వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణ ఆదుకుంటోంది. గత 8 ఏళ్లలో ఏదైనా అసంతృప్తి ఉందా? – తెలంగాణ అద్భుతంగా పురోగతిస్తున్న తరుణంలో నోట్ల రద్దు, కోవిడ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. నోట్ల రద్దు సమయంలో కేంద్రం చెప్పిన వాటిని నమ్మాం. కానీ తాజా ఆర్బీఐ లెక్కల ప్రకారం రూ.500, రూ.2000 నకిలీ నోట్లు పెరిగాయి. కేంద్రం అస్తవ్యస్థ, అనాలోచిత ఆర్థిక విధానాలు, లాక్డౌన్తో రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పైగా ఇప్పుడు కేంద్రం కక్షగట్టి, సహాయ నిరాకరణ చేస్తోంది. రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. అయినా సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తున్నాం. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల విషయంగా ప్రజల్లో అసంతృప్తి లేదా? – అసంతృప్తి లేదంటే అది తప్పు అవుతుంది. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇళ్లు, రుణమాఫీ హామీలు ఇచ్చాం. రుణమాఫీకి ఇప్పటికే 22వేల కోట్లు ఇచ్చాం. ప్రజలు అర్థం చేసుకోవాలి. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఆదాయం తగ్గిపోయి.. ఇబ్బంది, జాప్యం జరుగుతోంది. పెన్షన్లు, ఇళ్లు ఇస్తాం. 95 శాతం హామీలు అమలు చేసినట్టు అవుతుంది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చినట్టుంది – రాహుల్గాంధీ వచ్చి వరంగల్లో మాట్లాడింది చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. 50ఏళ్లు వారే అధికారంలో ఉన్నారు కదా.. ఏం చేశారు. మళ్లీ ఒకసారి చాన్స్ అంటే ఏంటి? ఇంకో పార్టీ నేతలు తామొస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటారు. ఎవరు వద్దన్నారు? దేశవ్యాప్తంగా ఇప్పుడే ఇవ్వండి. మేం పార్లమెంట్లో పూర్తి మద్దతిస్తాం. సన్మానాలు చేస్తాం. అలాకాకుండా మసీదులు తవ్వుదాం శవాలు వస్తే మీవి.. లింగాలు వస్తే మావి.. అంటూ మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ఏమిటి? ఒకటి కులపిచ్చి, మరొకటి మతపిచ్చి పార్టీలు. మేం ప్రజలను నమ్ముకుని వెళ్తున్నాం. ఢిల్లీని, గుజరాత్ను నమ్ముకుని కాదు. మా బాసులు తెలంగాణ ప్రజలే. వారిపై నమ్మకం ఉంది. చిన్నచిన్న లుకలుకలు, అసంతృప్తి ఉంటే.. తప్పకుండా సరిచేసుకుంటాం. కేసీఆర్ను మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రధాని మోదీ, అమిత్షా, నడ్డా కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవినీతి, మూఢ నమ్మకాలు అంటున్నారు. మీ స్పందన? – మూఢ నమ్మకాల విషయానికొస్తే బీజేపీని మించినోళ్లు మరెవరూ లేరు. వారు రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా? ఒక విద్యాసంస్థగానీ, ప్రాజెక్టుకు జాతీయ హోదాగానీ ఇచ్చారా? ప్రజలకు చెప్పడానికి ఏమి లేకనే అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నా. గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్.. ఏదీ ఇవ్వలేదు. అరుపులు పెడబొబ్బలు పెడతారు. కుటుంబ పాలన అంటారు. పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య, అమిత్షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి.. వారిది కుటుంబ పాలన కాదా? మోదీ హయాంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సిలిండర్, గ్యాస్ ధరలు పెరిగాయి.. ఎన్నడూ లేనంత ద్వేషం, అసహనం నెలకొంది.. ఆయన సాధించినది ఇదే. కర్ణాటకలో బిల్లులు ఇవ్వాలంటే 40 శాతం కమీషన్ అడుగుతున్నారు. సీఎం పదవి కోసం అధిష్టానం రూ.2,500 కోట్లు అడిగిందని బీజేపీ ఎమ్మెల్యేనే చెప్పారు. అలాంటిది అవినీతి అని మాట్లాడడానికి మోదీకి సిగ్గు, ఇంగిత జ్ఞానం ఉండాలి. రుణాలకు కేంద్రం అనుమతించకుంటే ఎలా? – ఇక్కడ రెండు విషయాలు. 2014లో భారతదేశ అప్పు రూ.56లక్షల కోట్లు. 2023 నాటికి అది రూ.కోటీ 56 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ఎనిమిదేళ్లలో రూ.కోటి లక్షల కోట్ల అప్పు చేశారు మోదీ. తెలంగాణ రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసింది. జీడీపీలో కేంద్ర అప్పుల వాటా 65 శాతం ఉంటే... తెలంగాణ జీఎస్డీపీలో అప్పుల వాటా 25 శాతమే. అంటే ఎవరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారో దీనిని చూస్తే అర్థమవుతోంది. ఆర్థిక క్రమశిక్షణ బాగుంది కాబట్టే మాకు రుణాలు ఇస్తున్నారు. మేం చేసిన అప్పుతో విద్యుత్ప్లాంట్లు, నీటి ప్రాజెక్టులు కట్టాం. మిషన్ భగీరథ, పారిశ్రామిక ప్రాంతాలు నిర్మించాం. రూపాయి ఖర్చు చేసి.. రూపాయిన్నర ఆదాయం చూపెడితే అది ఉత్పాదక పెట్టుబడి అవుతుంది. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టి, ప్రజల్లో అభాసుపాలు చేసి రాజకీయంగా లబ్ధిపొందాలను భావిస్తోంది. దేశంలో రాజకీయ, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. అవసరమైతే వాటిని ఆశ్రయిస్తాం. కేసీఆర్ రెండు మూడు నెలల్లో సంచలనం అన్నారు. ఏమై ఉంటుంది? – తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఏమిటనేది సీఎం చెప్తారు. ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రం అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుందట. ధన్యవాదాలు. ఆ సమావేశానికి వచ్చే అమిత్షా ఉత్త ప్రసంగం కాకుండా రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలి. లేదంటే ఈ ఎనిమిదేళ్లు గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని వారిని అడగక తప్పదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి చేయబోతున్నారు? – రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చేది లేదు. మా నాయకుడు కేసీఆర్ జాతీయస్థాయిలో పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏం చేయాలో ఆయన నిర్ణయిస్తారు. ఏపీతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? – ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో కేసీఆర్కు, మాకు సత్సంబంధాలే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత చిన్న సమస్యలు వచ్చినా దానికి కారణం కేంద్రమే. మేం పొరుగు రాష్ట్రాలతో మితృత్వమే కోరుకుంటున్నాం. మీరు ప్రధాని స్థాయికి ఎదుగుతారని దావోస్లో ప్రశంసలు వచ్చాయి. మీ అభిప్రాయం? – నేను మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు. అయ్యాను. ఇంతకు మించి మరే ఆశ నాకు లేదు. భవిష్యత్తుపై ఆత్రుత లేదు. విద్యుత్ కేంద్రాలకు విదేశీ బొగ్గుపై స్పందన? – ఆదానీ విదేశాల్లో బొగ్గు గనులు కొంటారు. ఇక్కడ పాలసీలో మార్పు వస్తుంది. అప్పటివరకు నష్టాల్లో ఉన్న ఆయనకు మేలు చేయడానికి విదేశీ బొగ్గు కొనాలంటున్నారు. ఇది అవినీతి కిందికి రాదా? లాభాలు వచ్చే పరిశ్రమలను తెగనమ్మేస్తున్న మోదీ.. మరీ వోడాఫోన్లో ఎందుకు కేంద్రంతో వాటా కొనుగోలు చేయించారు? మంత్రి మల్లారెడ్డిపై దాడి ప్రజల ఆగ్రహమా? – కాదు. అది రేవంత్రెడ్డి మనుషులు చేసిన చిల్లర ప్రయత్నం. మాది అన్నివర్గాల ప్రభుత్వం. మాకు రెడ్లు ఓట్లు వేయకుండానే గెలిచామా? మంత్రివర్గంలో ఆరుగురు, మండలి, శాసనసభ అధిపతులు రెడ్లే. ఎమ్మెల్యేల్లో 30 మంది వరకు రెడ్లు, నామినేటెడ్ పదవుల్లోనూ వారు యాభై శాతం. వారికి ఇవ్వనప్పుడు కదా ఆగ్రహం ఉండేది. రేవంత్ మనుషులు, రౌడీ మూకలు మంత్రిపై దాడికి పాల్పడ్డారు. అది ప్రభుత్వంపై ఆగ్రహం ఎలా అవుతుంది? రామగుండం ఎరువుల పరిశ్రమను ఆపుతున్నారని అభియోగం? – ఏ పరిశ్రమ అయినా పర్యావరణహితంగా ఉండాలి. గోదావరిలో కాలుష్యాన్ని వదులుతున్నారని, స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడం లేదని మా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. నోటీసులు ఇచ్చారు. ఉత్పత్తి ఎక్కడా ఆపలేదు. పరిశ్రమ పర్యావరణహితంగా ఉండాల్సిందే. తెలంగాణకు ఏమీ ఇవ్వని ప్రధానికి గౌరవం ఎందుకివ్వాలి? ఉత్త చేతులతో వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో భారత్ బయోటెక్ సంస్థకు ప్రధాని వచ్చినప్పుడు సీఎం రావాల్సిన అవసరం లేదన్నారు. మరిప్పుడు ఎందుకు రావాలి? ఎనిమిది సార్లు ప్రధాని వచ్చారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని ప్రధానికి తెలంగాణ ఎందుకు గౌరవం ఇవ్వాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ తెరవగానే.. మోదీ శిఖండి మాదిరి గుజరాత్లో మరో కేంద్రాన్ని మంజూరు చేశారు. ఇదెక్కడి న్యాయం? ఇంత కుసంస్కారం ఉండే ప్రధాని హైదరాబాద్కు వస్తే ఎంత? రాకపోతే ఎంత? -
టీ హబ్కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్ని మెచ్చుకున్న ఫ్రైర్బ్రాండ్
THubHyd: స్టార్టప్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ హబ్ని పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. మంత్రి కేటీఆర్కు ప్రశంసలు తెలంగాణ ఐటీ హబ్ పనితీరును పశ్చిమ బెంగాల్కి చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్బ్రాండ్ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ సెంటర్ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ఫుల్ జాబ్ ఆల్ అరౌండ్ కేటీఆర్టీఆర్ఎస్ అంటూ ప్రశంసించారు. — KTR (@KTRTRS) September 8, 2021 థ్యాంక్యూ మహువా మోయిత్రా ప్రశంసల ట్వీట్కి మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ మహువా జీ అంటూ ట్వీట్ చేశారు. తమిళనాడుకి అవసరం మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. టీ హబ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్షియేటివ్ అంటూ ట్వీట్ చేశారు. చదవండి : ఆన్లైన్లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు! -
టీ-యాప్ ఫోలియో, ప్రత్యేకతలివే!
సాక్షి, హైదరాబాద్ : మొబైల్ గవర్నెన్స్ లో దేశంలో రెండో రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, తన సొంత యాప్ ఫోలియోను విడుదల చేసింది. టీ-యాప్ ఫోలియో పేరుతో సొంత యాప్ ఫోలియోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం లాంచ్ చేశారు. అన్ని మొబైల్ ఆధారిత సేవలకు ఒకే ప్లాట్ఫామ్ టీ-యాప్ ఫోలియోను విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. టీ-యాప్ ఫోలియో అనే యాప్ సాధారణమైనది కాదని, దీని ద్వారా ప్రస్తుతం 150 మేర ప్రజా సేవలు అందిస్తామన్నారు. అనంతరం ఏడాది లోపు వెయ్యి సర్వీసులను ఈ యాప్లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖల యాప్స్ని ఈ టీ-యాప్ ఫోలియోకు ఇంటిగ్రేట్ చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఎం వాలెట్, టీ వాలెట్, హ్యాక్ ఐ లాంటి యాప్స్ను కూడా టీ-యాప్ ఫోలియోలో ఇంటిగ్రేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న టీ ఫైబర్తో 15జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ అందిస్తామని కేటీఆర్ తెలిపారు. టీ వాలెట్ ద్వారా 120 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. టెక్నాలజీ ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.టీ-యాప్ ఫోలియో లాంచింగ్ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, సివిల్ సప్లయ్ కమిషనర్ సీ వీ ఆనంద్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. -
దావోస్లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్
-
దావోస్లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్
దావోస్ : పెట్టుబడులను పెద్దఎత్తున తెలంగాణకి రప్పించేందుకు దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడ బిజిబిజీగా వున్నారు. రెండు రోజుల మంత్రి పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఫెర్నాండెస్తో పాటు, ఇండోరామ, మిత్సుబిషి, కేకేఆర్, కల్యాణి గ్రూప్, నోవార్టిస్, డెలాయిట్ వంటి కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. నోవార్టిస్.. ల్యాబోరేటరీ వ్యవస్థను, సిబ్బందిని రెట్టింపు చేయనుంది. కంపెనీ విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ది చెందుతుందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో టెక్ సెంటర్ ఏర్పాటుచేసేందుకు, ఇతర పెట్టుబడుల గురించి కేటీఆర్, దుబాయ్ పెట్టుబడుల కార్పొరేషన్ సీఈవో మహమ్మద్ ఏఐ షాబానితో కూడా చర్చించారు. హెచ్పీ కంపెనీ మేనేజ్మెంట్ను కూడా హైదరాబాద్ను సందర్శించాలని ఆహ్వానించారు. టీహబ్తో సహకారం ఏర్పరుచుకునేందుకు అన్వేషించాలని, హెచ్పీ తన కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించాలని కోరారు. జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
‘ఆర్సీఎస్’లోకి తెలంగాణ
► కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు విమానయానాన్ని చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)లో తెలంగాణ ప్రభుత్వం చేరింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఐటీ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ పథకంలో చేరడం వల్ల సమీప భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ప్రధాన ప్రాంతీయ ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. ప్రజలకు విమాన సేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన ప్రాంతీయ అనుసంధాన పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడం అభినందనీ యమన్నారు. దేశీయంగా రూ. 5 వేల కోట్ల విలువైన విమానయాన సేవలను అందించా లని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో కొత్తగా 50 విమానా శ్రయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు సమకూర్చడానికి అంగీకరించిం దన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రాంతీయ విమానయాన అనుసంధానం దేశానికి చాలా అవసరమని, ప్రజలకు విమాన సేవలు చేరువ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతోనే ఈ పథకంలో చేరామన్నారు. కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతికపరమైన అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీని ఏర్పాటు చేయడానికి వీలుగా బేగంపేట ఎయిర్పోర్టులో ఉన్న నాలుగు హ్యాంగర్స్ను లీజుకు ఇవ్వాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ను తెరిపించండి ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంటును తెరిపించేందుకు కృషి చేయాలని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి‡ అనంత్ గీతేను మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే బాపురావు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్లాంటు మూతపడటం వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. ప్లాంటును పునరుద్ధరించి కార్మికులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. అలాగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని, ఫ్యాక్టరీకి నిధులు సమకూర్చేం దుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి వివరించారు. మార్చిలో టెక్స్టైల్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా మార్చిలో నేషనల్ టెక్స్టైల్ సమ్మిట్ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయిన కేటీఆర్ ఈ సదస్సు ఏర్పాటుపై చర్చించారు. దీనికి పూర్తి మద్దతు ఇవ్వడంతోపాటు సదస్సుకు హాజరవుతానని స్మృతి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టడానికి పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు. వరంగల్లో నెలకొల్పనున్న టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరినట్టు ఆయన తెలిపారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటును రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రవేశ పెట్టాల్సిందిగా ఆర్థిక శాఖకు ప్రతిపాదిం చాలని కేటీఆర్ కోరారు. చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును స్మృతి ఇరానీ మెచ్చుకున్నట్టు వివరించారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసాతోనూ భేటీ అయిన కేటీఆర్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. -
కేంద్రమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు
కొత్తగూడెం ఎయిర్పోర్టుకు అనుమతి ఇచ్చినందుకు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గణపతిరాజుకు తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్రమంత్రి అశోక్ గణపతి రాజుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ఏవియేషన్ స్కిలింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తీసుకున్న చొరవకు కేంద్రం సపోర్టివ్వాలని కేటీఆర్ కోరారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఏఏఐతో తెలంగాణ జాయిన్ అయ్యేందుకు త్రైపాక్షిత ఒప్పందంలోకి ప్రవేశించామని కేటీఆర్ తెలిపారు.