ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్రమంత్రి అశోక్ గణపతి రాజుతో భేటీ అయ్యారు.
కేంద్రమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు
Jan 11 2017 1:30 PM | Updated on Sep 5 2017 1:01 AM
కొత్తగూడెం ఎయిర్పోర్టుకు అనుమతి ఇచ్చినందుకు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గణపతిరాజుకు తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్రమంత్రి అశోక్ గణపతి రాజుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ఏవియేషన్ స్కిలింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తీసుకున్న చొరవకు కేంద్రం సపోర్టివ్వాలని కేటీఆర్ కోరారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఏఏఐతో తెలంగాణ జాయిన్ అయ్యేందుకు త్రైపాక్షిత ఒప్పందంలోకి ప్రవేశించామని కేటీఆర్ తెలిపారు.
Advertisement
Advertisement