breaking news
Tata Steel Masters International chess tournament
-
‘బ్లిట్జ్’ చాంపియన్ అర్జున్
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్ ఈవెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్కు చెందిన 19 ఏళ్ల అర్జున్ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్గా నిలిచిన అర్జున్కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 10 వేలు) ప్రైజ్మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్ ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్ (అజర్బైజాన్) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ ఈవెం ట్లో అర్జున్ రన్నరప్గా నిలిచాడు. బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్ ఈవెంట్లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్ ఈవెంట్లో టైటిల్ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్) 12 పాయింట్లతో రన్నరప్గా నిలి చింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హవా
టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ వరుసగా రెండో విజయం సాధించాడు. నెదర్లాండ్స్లో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్లో తెల్ల పావులతో ఆడిన అర్జున్ 42 ఎత్తుల్లో డానియల్ డార్దా (బెల్జియం)పై గెలిచాడు. 14 మంది గ్రాండ్మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్ తర్వాత అర్జున్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది. నెదర్లాండ్్సలోని విక్ ఆన్ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అనీష్ గిరి (నెదర్లాండ్్స)తో జరిగిన 11వ రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో 11వ రౌండ్ తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.