-
రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు హిందుజా గ్రూప్లో భాగమైన జీవోసీఎల్ కార్పొరేషన్ సీఈవో పంకజ్ కుమార్ వెల్లడించారు. ఎక్స్ప్లోజివ్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు, ధరల పెరుగుదల తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని మంగళవారం ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు సుమారు రూ. 559 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎక్స్ప్లోజివ్స్ ఎగుమతులపైనా, ఎలక్ట్రానిక్స్ విభాగంపైనా మరింతగా దృష్టి పెడుతున్నామని కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు రూ. 40 కోట్లుగా ఉన్న ఎక్స్ప్లోజివ్స్ ఎగుమతులను ఈ ఏడాది రూ. 100 కోట్లకు పెంచుకోనున్నట్లు వివరించారు. సూడాన్, టాంజానియా తదితర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగం ఆదాయం సుమారు రూ. 20 కోట్లుగా ఉందని, వచ్చే ఏడాది-ఏడాదిన్నర వ్యవధిలో దీన్ని రూ. 100 కోట్లకు పెంచుకోనున్నామని పంకజ్ కుమార్ పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పెట్టుబడులు .. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పంకజ్ వివరించారు. ఇందులో భాగంగా బళ్లారిలో ఎక్స్ప్లోజివ్స్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్లోని ప్లాంట్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి రెండో లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 100 మంది ఉండగా, రాబోయే రెండు-మూడేళ్లలో ఈ సంఖ్యను 300 వరకూ పెంచుకునే అవకాశం ఉందని పంకజ్ చెప్పారు. ముడి సరుకు రేట్ల భారం.. వివిధ కారణాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ముడి వస్తువుల ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని పంకజ్ తెలిపారు. కొన్నాళ్ల క్రితం 200 డాలర్లుగా ఉన్న టన్ను అమోనియా రేటు ఏకంగా సుమారు 900 డాలర్లకు ఎగిసిందని, ప్రస్తుతం 700 డాలర్ల స్థాయిలో ఉందని పేర్కొన్నారు. తదనుగుణంగా తాము కూడా కొంత మేర ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వచ్చే 3-4 నెలల్లో ముడి వస్తువుల రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. కంపెనీకి హైదరాబాద్లో ఉన్న 42.25 ఎకరాల మిగులు స్థలంలో 32 ఎకరాల విక్రయ ప్రక్రియ పూర్తయిందని పంకజ్ తెలిపారు. ఈ డీల్ విలువ రూ. 326 కోట్లు. -
ధూమ్ 3 టార్గెట్...1000 కోట్లు!
వంద కోట్లు చాలా పాత విషయం 200 వందల కోట్లు నిన్న మొన్నటి టాపిక్. 300 కోట్లు లేటెస్ట్ ట్రెండ్. 400 వందల కోట్లు షాకింగ్ న్యూస్ మరి 1000 కోట్లు షాకింగ్ కే షాకింగ్ న్యూస్ అవును... ఈ మధ్య బాలీవుడ్ అంతా ఈ మేజిక్ ఫిగర్ల మీదే నడుస్తోంది. చిన్న చిన్న స్టార్ వేల్యూ ఉన్న సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్కి గురిపెడుతుంటే, ఇక సూపర్స్టార్ల సిని మాలపై అంచనాలకు హద్దేముంటుంది? ఇప్పటివరకూ ‘చెన్నై ఎక్స్ప్రెస్’ 422 కోట్ల రూపాయలు వసూలు చేసి బాలీవుడ్ హిస్టరీలో టాప్ ప్లేస్లో నిలిచింది. ‘3 ఇడియెట్స్’ 393 కోట్లు, ‘క్రిష్ 3’ 374, ‘ఏక్తా టైగర్’ 319, ‘యే జవానీ హై దీవానీ’ 309 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే 2013లో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన చిత్రంగా ‘క్రిష్ 3’ నిలుస్తుందని నిర్మాత రాకేశ్ రోషన్, ట్రేడ్ అనలిస్టులు వేసిన అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి. ‘క్రిష్ 3’ చిత్రం విడుదలకు ముందు జరిగిన ఓ మీడియా సమావేశంలో తమ చిత్రం వెయ్యికోట్లు వసూలు చేస్తుందని రాకేశ్ రోషన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం మందగించడం, సాంకేతికంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా ‘క్రిష్ 3’ 374 కోట్ల రూపాయలు వసూలు చేయడం మాత్రం సినీ విమర్శకుల్ని సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. ప్రస్తుతం సినీ ట్రేడ్ అనలిస్టులు, విమర్శకులు, ప్రముఖుల దృష్టంతా ‘ధూమ్ 3’ చిత్రంపైనే ఉంది. ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్లాంటి హేమాహేమీలు ఇందులో నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రం సృష్టిస్తున్న హంగామా అందరిలోనూ అంచనాలు పెంచుతోంది. డిజిటల్ రీ మాస్టరింగ్, డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో, ఐమాక్స్ ఫార్మాట్ లాంటి ప్రత్యేకతలతో విడుదలవుతున్న తొలి చిత్రంగా ‘ధూమ్ 3’ ఓ ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన హిందీ సినిమాగా రికార్డుకెక్కింది. కేవలం ‘మలాంగ్’ అనే పాటకే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటేనే ఆ సినిమా మేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం హిట్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా 500 కోట్ల ఫిగర్ను అవలీలగా దాటేస్తుందని, టాక్ రేంజ్ పెరిగితే 1000 కోట్ల మార్కు చేరడం అంత కష్టమేమీ కాదని బాలీవుడ్ పండితుల అంచనా. దానికి తగ్గట్టుగానే ఆ చిత్ర నిర్మాతలు ఓవర్సీస్ మార్కెట్ని, ప్రాంతీయ భాషల మార్కెట్ని కొల్లగొట్టడానికి పలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించారు. ఒకవేళ ‘ధూమ్ 3’ మాత్రం 1000 కోట్ల రూపాయలు టార్గెట్ని సాధిస్తే... ప్రపంచ సినీచరిత్రలోనే ఒక స్పెషల్ ఇండియన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. -రాజబాబు అనుముల
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement