breaking news
Tamil Nadu Governor K Rosaiah
-
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
సాక్షి, తిరుమల : తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా మహాద్వారానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట డెప్యూటీ ఈవోలు సాగి వేణుగోపాల్, కోదండరావు ఉన్నారు. రుతువులు సక్రమంగా ఉండాలని శ్రీవారు దీవిస్తారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రతి సారి కుటుంబ సభ్యులతో వచ్చే ఆనవాయితీ ఉందని, ఈ సారి మాత్రం ఒంటరిగానే వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకున్నానన్నారు. రాష్ట్రంలో వాతావరణం బాగా వేడిగా ఉందని, రుతువులు సక్రమంగా ఉంటూ ప్రజలంందరూ సుఖంగా ఉండేలా భగవంతుడు దీవిస్తాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో రోశయ్య తిరుచానూరు: తిరుచానూ రు శ్రీపద్మావతి అమ్మవారిని తమిళనాడు గవర్నర్ కే.రోశయ్య శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆల యం ఎదుట టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్ వరప్రసాద్, ఎన్టీఆర్ రవి, పసుపర్తి గోపి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్కు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
జపాన్ రాజదంపతులకు విందు
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆరురోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన జపాన్ రాజు అఖిహి టో హైసై, ఆయన సతీమణి మిచికోకు గురువారం చెన్నైలోని రాజభవన్లో గ వర్నర్ కే రోశయ్య విందునిచ్చారు. సీఎం జయలలిత హాజరయ్యూరు. జపాన్లోని టోక్యో నుంచి చెన్నైకి వచ్చిన జపాన్ రా జదంపతులు నగరంలోని తాజ్ కోరమండల్ హోటల్లో బసచేశారు. భార త్, జపాన్ సంప్రదాయాలతో వారికి ఘ న స్వాగతం లభించింది. ఈ సందర్భం గా తపాలాశాఖ విడుదల చేసిన పోస్టల్ స్టాంపును గవర్నర్ ఆవిష్కరించి జపాన్ రాజుకు అందజేశారు. ఢిల్లీలోని కుతుబ్మినార్, టోక్యోనగరంలోని గోపురం బొమ్మలతో కూడిన ఈ స్టాంపు వి లువ రూ.20. కార్యక్రమంలో కేంద్రమంత్రి సుదర్శన్ నాచియప్పన్, అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్, నగర మేయర్ సైదై దొరస్వామి, మంత్రులు, భారత్లో జపాన్ రాయబారి టకేషీయాగి పాల్గొన్నారు.