జపాన్ రాజదంపతులకు విందు | Tamil Nadu Governor Hosts Lunch for Japanese Royal Couple | Sakshi
Sakshi News home page

జపాన్ రాజదంపతులకు విందు

Dec 6 2013 3:22 AM | Updated on Sep 2 2017 1:17 AM

ఆరురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జపాన్ రాజు అఖిహి టో హైసై, ఆయన సతీమణి మిచికోకు గురువారం చెన్నైలోని రాజభవన్‌లో గ వర్నర్ కే రోశయ్య విందునిచ్చారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆరురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జపాన్ రాజు అఖిహి టో హైసై, ఆయన సతీమణి మిచికోకు గురువారం చెన్నైలోని రాజభవన్‌లో గ వర్నర్ కే రోశయ్య విందునిచ్చారు. సీఎం జయలలిత హాజరయ్యూరు. జపాన్‌లోని టోక్యో నుంచి  చెన్నైకి వచ్చిన  జపాన్ రా జదంపతులు నగరంలోని తాజ్ కోరమండల్ హోటల్‌లో బసచేశారు. భార త్, జపాన్ సంప్రదాయాలతో వారికి ఘ న స్వాగతం లభించింది. ఈ సందర్భం గా తపాలాశాఖ విడుదల చేసిన పోస్టల్ స్టాంపును గవర్నర్ ఆవిష్కరించి జపాన్ రాజుకు అందజేశారు. ఢిల్లీలోని కుతుబ్‌మినార్, టోక్యోనగరంలోని గోపురం బొమ్మలతో కూడిన ఈ స్టాంపు వి లువ రూ.20. కార్యక్రమంలో కేంద్రమంత్రి సుదర్శన్ నాచియప్పన్, అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్, నగర మేయర్ సైదై దొరస్వామి, మంత్రులు, భారత్‌లో జపాన్ రాయబారి టకేషీయాగి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement