ఆరురోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన జపాన్ రాజు అఖిహి టో హైసై, ఆయన సతీమణి మిచికోకు గురువారం చెన్నైలోని రాజభవన్లో గ వర్నర్ కే రోశయ్య విందునిచ్చారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆరురోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన జపాన్ రాజు అఖిహి టో హైసై, ఆయన సతీమణి మిచికోకు గురువారం చెన్నైలోని రాజభవన్లో గ వర్నర్ కే రోశయ్య విందునిచ్చారు. సీఎం జయలలిత హాజరయ్యూరు. జపాన్లోని టోక్యో నుంచి చెన్నైకి వచ్చిన జపాన్ రా జదంపతులు నగరంలోని తాజ్ కోరమండల్ హోటల్లో బసచేశారు. భార త్, జపాన్ సంప్రదాయాలతో వారికి ఘ న స్వాగతం లభించింది. ఈ సందర్భం గా తపాలాశాఖ విడుదల చేసిన పోస్టల్ స్టాంపును గవర్నర్ ఆవిష్కరించి జపాన్ రాజుకు అందజేశారు. ఢిల్లీలోని కుతుబ్మినార్, టోక్యోనగరంలోని గోపురం బొమ్మలతో కూడిన ఈ స్టాంపు వి లువ రూ.20. కార్యక్రమంలో కేంద్రమంత్రి సుదర్శన్ నాచియప్పన్, అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్, నగర మేయర్ సైదై దొరస్వామి, మంత్రులు, భారత్లో జపాన్ రాయబారి టకేషీయాగి పాల్గొన్నారు.