-
మాజీ డీజీపీ ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య!
హైదరాబాద్ : మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ ఇంట్లో పనిమనిషి నాగదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో గొడవపడిన ఆమె తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనకు సంబంధించి నాగదేవి భర్త కృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్తో సత్ఫలితాలు: డీజీపీ ప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: నేర దర్యాప్తులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు అన్న్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించేందుకు ఇదే సరైన మార్గమని చెప్పారు. నేర పరిశోధనలో సత్యశోధనకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్’ విధానం(మెదడులో దాగి ఉన్న కీలక సమాచారాన్ని రాబట్టే ప్రక్రియ)పై శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్)లో ఓ సదస్సు జరిగింది. ఏపీఎఫ్ఎస్ఎల్, స్వర్ణరక్ష నేతృత్వంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేర నిరూపణలో సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్)కంటే బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ విధానం అత్యంత ఆధునికమైందని చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ సహా అభివృద్ధి చెందిన దేశాలలో దర్యాప్తు సంస్థలు దీన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. ఈ విధానం 90 శాతం సత్ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో నేరస్తులను మానసికంగా, శారీరకంగా హింసించకుండా నే నిజాలు రాబట్టడం తేలికవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ మాట్లాడుతూ.. బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ నేర పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియలో సచ్ఛీలతకు అద్దంపట్టేలా ఈ సరికొత్త విధానం సహకరిస్తుందని ఫోరెన్సిక్ లేబొరేటరీ డెరైక్టర్ శారద చెప్పారు. పాలీగ్రాఫ్, నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల నిర్వహణను సుప్రీం కోర్టు నిషేధించిందనేది పూర్తిగా వాస్తవం కాదని, నిందితుడి అనుమతి ఉంటే పరీక్షలు నిర్వహించవచ్చని ఆమె తెలిపారు. ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటికే అమెరికా విజయవంతంగా అమలు చేస్తోందని మాజీ డీజీపీ, స్వర్ణరక్ష సంస్థ అధినేత స్వరణ్జిత్ సేన్ అన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement