-
తోడులేక ప్రసవాలు!
చెరసాలలో కృష్ణుడిని కన్న దేవకికి అండగా వసుదేవుడున్నాడు! లాక్డౌన్లో పురుడు పోసుకున్న కొంతమంది తల్లులకు అండగా ఎవరూ లేరు.. వాళ్ల గుండె ధైర్యం, పేగు బలం తప్ప!! ఆ శక్తితోనే బిడ్డలకు జన్మనిచ్చారు .. చేయి పట్టుకొనే తోడెవరూ రాకపోయినా!! పసికూన ఏడుపు వినేంత దగ్గర్లోనే తనవాళ్లున్నారనే భరోసా లేకపోయినా!! ప్రెగ్నెన్సీ గైడెన్స్ను గూగుల్ నుంచి తీసుకున్నా ప్రసవమప్పుడు మాత్రం తనవాళ్లు రావాల్సిందే. బిడ్డ ఏడుపు వినేంత దగ్గర్లో ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిందే. కరోనా కర్ఫ్యూ ఆ భద్రత లేకుండా చేసింది. అయినా ధైర్యం వీడలేదు ఆ తల్లులు. పండంటి బిడ్డల్ని చూసుకొని పడిన కష్టాన్నంతా మరచిపోయారు. ఆ సంఘటనలు కొన్ని.. స్వప్నిక కౌశిక్ది తమిళనాడు. ప్రైవేట్ ఉద్యోగిని. గర్భనిర్ధారణ జరిగినప్పటి నుంచీ ఆమె రక్తహీనతతో బాధపడింది. ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతిలోనే ఉంది. ఎనిమిది నెలలు గడిచాయి. ఈలోపు లాక్డౌన్ ప్రకటించారు. దాంతో హడావిడిగా తన తల్లిగారి ఊరైన చెన్నైకి వెళ్లిపోయింది. ఫ్యామిలీ డాక్టర్కు చూపించుకుంది. మళ్లీ వారానికి వెళ్లేసరికి ఆ డాక్టర్కు కరోనా డ్యూటీ పడడంతో ఆమే వేరే డాక్టర్ను సూచించింది. ఆమె దగ్గర ఆ వారం చూపించుకోగానే ఆమే కరోనా డ్యూటీ చేయాల్సి రావడంతో ఇంకో డాక్టర్కు మారాల్సి వచ్చింది స్వప్నిక. ‘ఇదంతా నరకంగా ఉండేది నాకు. మాటిమాటికీ డాక్టర్ను మార్చాల్సి రావడం, క్లినిక్కు వెళ్లే చాన్స్ లేకపోవడంతో ఫోన్లోనే మారిన డాక్టర్లందరికీ నా హిస్టరీ చెప్పడం, వాళ్లు అర్థం చేసుకొని ట్రీట్ చేసేలోపు మళ్లీ వాళ్లు మారడం.. ఎంత టెన్షన్ పడ్డానో దేవుడికే తెలుసు. ఒక్కోసారి డెలివరీ అయినా సవ్యం గా జరిగేనా అని భయమేసేది. అన్నట్టుగానే నా డెలివరీ టైమ్కి కరోనా కేసులు ఎక్కువయ్యాయి చెన్నైలో. పెద్దవాళ్లు త్వరగా ఇన్ఫెక్ట్ అవుతారని అమ్మ లేకుండానే హాస్పిటల్కు వెళ్లా. లాక్డౌన్తో మా వారూ రాలేకపోయారు. నాకు నేను చెప్పుకున్న ధైర్యమే ఆ గండం గట్టెక్కేలా చేసింది. ఈ పసిదాన్ని చూడగానే నా బాధంతా ఎగిరిపోయింది’ అని చెప్తుంది స్వప్నిక కూతుర్ని ముద్దాడుతూ. వలస కూలీకి అటెండెంట్గా.. డాక్టర్ అనిత గౌర.. కర్ణాటకలోని కలబురగి(గుల్బర్గా) ఎమ్ఆర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో స్త్రీ వైద్యనిపుణులుగా పనిచేస్తున్నారు. కరోనా లాక్డౌన్ ప్రకటించేనాటికి నిండు చూలాలు. ఆమె భర్త రాజీవ్ కొనిన్ హృద్రోగనిపుణులు. కరోనా డ్యూటీలో ఉన్నాడు. దాంతో డెలివరీ కోసమని అమ్మ దగ్గరకు వెళ్లింది అనిత. అమ్మ అన్నపూర్ణ గౌర కూడా డాక్టరే. లాక్డౌన్ వల్ల ఎవరూ తోడులేక ప్రసవవేదనతో ఆసుపత్రి చేరిన గర్భిణీలకు తల్లీ, తోబుట్టువూ తామై డెలివరీ చేశారు ఈ అమ్మాకూతుళ్లు. ‘అమ్మ దగ్గరకు వస్తున్న పేషంట్లను చూస్తూంటే రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు. నొప్పులతో వచ్చిన ఎవరినీ వెనక్కిపంపలేదు. వాళ్లలో వలస కూలీలూ ఉన్నారు. వరుసగా నాలుగు డెలివరీలు చేసిన రాత్రులూ ఉన్నాయి. ‘అలా నేను బిడ్డను కనే ముందు రోజు వరకూ డెలివరీలు చేశాను’ అంటూ చేతుల్లో ఉన్న తన బిడ్డను గుండెకు హత్తుకుంది డాక్టర్ అనితా గౌర. ఏప్రిల్ 20న ఆమెకు కూతురు పుట్టింది. అనిత పురిటినొప్పులు పడుతున్న సమయంలో ఆమె తల్లి అన్నపూర్ణ ఓ మహిళా వలస కూలీకి డెలివరీ చేస్తోంది. పది కిలోమీటర్లు నడవలేక.. ఒడిశాలోని కలహండి కరువుకు కేరాఫ్. కరోనా లాక్డౌన్తో ఆ గిరిజన ప్రాంతానికి అందే అత్యవసరాలకూ చెక్ పడింది. ఇక్కడి కెర్పై గ్రామంలో గర్భిణీలు, చిన్నపిల్లలకు మందులు, టీకాలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు కెర్పై నుంచి ఆరోగ్యకేంద్రం ఉన్న ఊరికి బస్సు అందుకోవాలంటే పదికిలోమీటర్లు నడవాలి. వెళ్లలేక ఇళ్లల్లోనే ప్రసవించారు. ఆ గిరిజన తల్లుల పేగుబలమే ఆ బిడ్డల్ని బతికించింది. ఈ విషయం తెలిసిన అక్కడి స్వచ్ఛంద సేవా కార్యకర్తలు కొందరు ‘మందులు, ఆహారపదార్థాలను హోమ్ డెలివరీ చేద్దామన్నా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దాంతో నిస్సహాయంగా ఉండిపోతున్నాం’ అంటున్నారు. -
హత్య చేసిందెవరు?
సాగర్, స్వప్నిక జంటగా నండూరి వీరేశ్ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న ‘సంభవం’ హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు క్లాప్ ఇవ్వగా, మాజీ ఎంపీ ఆవుల వీరశేఖర్ కెమేరా స్విచ్చాన్ చేశారు. వ్యాపారవేత్త బాబా భాయ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే హారర్–థ్రిల్లర్ చిత్రమిది. హత్య చేసిందెవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు నండూరి వీరేశ్. ‘‘మా సంస్థ నిర్మించిన ‘లవ్ స్పాట్’, ‘గురుబ్రహ్మ’ చిత్రాల్ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు గూన అప్పారావు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement