breaking news
svarnakumari
-
కలిసి వెళితే కలదు లాభం...
యాత్రలకు ఎంత మంది కలిసి వెళితే, అంత లాభం’ అంటున్నారు హైదరాబాద్లోని కృష్ణానగర్కి చెందిన వి.రామరాజు. ఆయన విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఈ వారం జమ్మూ, కాశ్మీర్ విహారయాత్రకు వెళుతున్నారు. అందులో ప్రత్యేకత ఏముందీ? అంటారా... అయితే చదవండి... ‘‘నేనూ, నా సతీమణి స్వర్ణకుమారి ప్రతి ఏడాదీ విహారయాత్రలకు వెళ్లడం ఓ అలవాటుగా చేసుకున్నాం. ఈ వారంలో మనదేశ స్వర్గసీమగా భావించే జమ్మూ, కాశ్మీర్కు బయల్దేరుతున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. నాతో కలిసి మరో తొంభైమంది ప్రయాణిస్తున్నారు. అంతా మా బంధువులు! నాలుగేళ్లక్రితం పదిమంది గ్రూప్గా యాత్రలకు వెళ్లడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ సంఖ్య వందకు చేరువవుతోంది. రెండేళ్ల క్రితం 65 మందిమి కలిసి దక్షిణ భారతదేశం తిరిగొచ్చాం. కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ చుట్టొచ్చాం. అంతకుముందు ఏడాది హిమాలయ యాత్రకు వెళ్లాం. హరిద్వార్, రుషికేష్ చూసొచ్చాం. ఏడాదిన్నరక్రితం ఉత్తరభారతదేశానికి 75 మందిమి ఒక గ్రూప్గా కలిసి వెళ్లాం. ఇప్పుడు 91 మందిమి వెళుతున్నాం. మా గ్రూప్లో అందరూ దాదాపు 60 దాటినవాళ్ళే! అన్నీ ప్రయోజనాలే! జమ్మూ-కాశ్మీర్ పదిరోజుల యాత్రకు నెల ముందుగానే ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాం. 35 సీట్లు ఉన్న 3 బస్సులలో ప్రయాణం. మాతో ప్రతి బస్సుకు ఒక ట్రావెల్ గైడ్ కూడా ఉంటాడు. వెళ్లిన చోట ఇద్దరు వ్యక్తులు ఒకే హోటల్ గదిలో ఉండేట్టయితే ఒక్కొక్కరికి (మొత్తం ఛార్జీలు, భోజనంతో సహా) రూ.15,000/-లు. ముగ్గురు ఒకే గదిలో ఉండేట్టయితే ఆ ముగ్గురికీ రూ.31,000/-. ముందు ట్రావెల్ ఏజెంట్ని కలిసినప్పుడు జమ్మూకాశ్మీర్ యాత్ర ఒక్కొక్కరికి రూ.18000/- అని చెప్పాడు. కాని 91 మందితో గ్రూప్ అనేసరికి ఒక్కొక్కరికి రూ.3 వేలు తగ్గింపు లభించింది. సాధారణంగా ఏ వేడుకల్లోనో బంధువులం కలుస్తాం. హడావిడిగా వెళ్లిపోతాం. అదే ఇలా వెళితే కనీసం పది రోజులకు పైగా అంతా కలసి ఉంటాం. భోజనాలైనా, తిరగడమైనా కలిసే చేస్తాం. సరదాగా ఉండటం వల్ల అందరితో చనువు ఏర్పడుతుంది. పెద్ద వయసు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రయాణంలో కిలోమీటర్ల కొద్దీ తిరుగుతారు. అయినా చిన్న నొప్పి అని కూడా ఎవరూ అనరు. అంత ఉల్లాసంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనకి మరో తొంభైమంది తోడుగా ఉన్నారన్న భరోసా ఉంటుంది. తమిళనాడు, ఉత్తరాంచల్ వెళ్లినప్పుడు... రైలు టికెట్లు, హోటల్స్ అన్నీ మేమే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాం. ఖర్చులన్నీ కలిపి చివరగా అందరం పంచుకున్నాం. ఆ విధంగా చాలా తక్కువ డబ్బులకే ప్రయాణాలు చేసిన సందర్భాలున్నాయి. ఈసారి సంఖ్య ఎక్కువైందని ట్రావెల్ బస్సులు బుక్ చేసుకున్నాం’’అని తెలిపారు. ఎక్కువ మంది కలిసి గ్రూప్గా యాత్రలకు వెళితే కొత్త ప్రాంతాల్లో మరింత భరోసాగా గడిపిరావచ్చు. ఖర్చూ కలిసి వస్తుంది. కలిసి ఇలా టూరు వెళితే మరిన్ని ప్రయోజనాలు మీరూ స్వయంగా తెలుసుకుంటారు. - నిర్మలారెడ్డి -
అర్ధరాత్రి అలజడి
=ఆదివాసీలపై గుర్తుతెలియని =వ్యక్తుల దాడి భీతిల్లిన జనం =మద్దతుగా ఆయా పార్టీల నేతల ఆందోళన =20మంది అరెస్టు, రిమాండ్ నాగోలు/మన్సూరాబాద్,న్యూస్లైన్: ‘ఎన్నోయేళ్లుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం..ఉన్నట్టుండి పొమ్మంటే ఎలా..చావనైనా చస్తాం కానీ..ఇక్కడ్నుంచి పోయేది లేదు.. దాడులకు భయపడమని’ ఆదివాసీలు స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంలో నివాసముంటున్న ఆదివాసీలపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి దాడి చేయడంతో శనివారం వారంతా ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఆయా పార్టీల నాయకులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ మన్సూరాబాద్ డివిజన్ సర్వేనెం.66/6లో ఆదివాసీకాలనీలో కొన్నేళ్లుగా ఆదివాసీలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఇటీవల భూముల విలువ పెరగడంతో ఆదివాసీకాలనీని ఖాళీ చేయించాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్థలం తమదేనంటూ స్వర్ణకుమారి ఇటీవల డాక్యుమెంట్లతోవచ్చి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో స్థానిక కాం గ్రెస్, టీడీపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకొని ఆదివాసీలను ఖాళీ చేసే యత్నం కొంతకాలంగా సాగుతోంది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయించాలనుకుంటున్న నాయకులు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఫలక్నుమాకు చెందిన కొంతమంది గుండాలను రెండు డీసీఎంలలో తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. నిద్రిస్తు న్న వారిని బలవంతంగా లేపి వారిపై కారం,మత్తుస్ప్రే చల్లి వారిని బలవంతంగా డీసీఎంలోకి ఎక్కించి బండ్లగూడ వైపు తరలిస్తుండగా గట్టిగా కేకలు వేశారు. వీరి అరువులు విన్న నైట్పెట్రోలింగ్ పోలీ సులు డీసీఎంలను అడ్డగించి నేరుగా పోలీసుస్టేషన్ కు తరలించారు. అక్కడినుంచి ఆదివాసీలను గుడిసెలకు చేర్చారు. ఓ గుడిసెలోని బీరువాలో రూ.40వేలతోపాటు పలు సామాన్లను దుండగులు అపహరించారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అండంగా ఉంటాం..: దాడుల విషయం తెల్సుకున్న మాజీఎంపీ అజీజ్పాషా, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దగౌని రాంమోహన్గౌడ్, సీపీఐ గ్రేటర్ కార్యదర్శి బోస్, ఆయా పార్టీల నేతలు ఆకుల రమేష్గౌడ్, స్వామిగౌడ్,కళ్ళెం రవీందర్రెడ్డి, తుమ్మల సత్తిరెడ్డి, కాచం సత్యనారాయణ, కార్పొరేటర్ వ జీర్ప్రకాష్గౌడ్,గిరిజసంఘం నాయకులు శివనాయక్, గోపినాయక్ తదితరులు ఆదివాసీకాలనీకి చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు. తామంతా అండగా ఉంటామని, ఎవరూ ఖాళీ చేసి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా నాయకులు వారించారు. స్థానిక టీడీపీ నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్రెడ్డిలు తమ అనుచరులతో ఆదివాసీలను భ్రయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నారని అజీజ్పాషా ఆరోపించారు. 20 మంది రిమాండ్ : అర్ధరాత్రి సమయంలో దాడిచేసి బీభత్సం సృష్టించిన 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.