Suvarna
-
’సువర్ణ టెక్ట్స్టైల్స్‘ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సువర్ణ ఎంపిక
శ్రీకాకుళం: వరుసగా రెండో ఏడాది కూడా పరపటి సువర్ణ గ్రూప్–1 పోస్టు కొట్టేశారు. 2022 గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారో గ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ)గా బాధ్యత స్వీకరించి, శిక్షణలో ఉండగానే మళ్లీ తాజా గా ప్రకటించిన గ్రూప్–1 పరీక్షల్లో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికై రికార్డు సృష్టించారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు కుమార్తె సువర్ణ ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీలో పీజీ పూర్తి చేశా రు. అనంతరం సివిల్స్కు ప్రిపేర్ అవుతుండగా, 2022లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1కు అర్హత సాధించారు. అనంతరం మళ్లీ తాజాగా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. కలెక్టర్గా చూడాలన్నది నాన్న కల నన్ను కలెక్టర్గా చూడాలన్న నాన్న కల నెరవేర్చుతాను. ప్రస్తుతానికి రెండు సార్లు వరుసగా గ్రూప్–1 పోస్టులు సాధించాను. తాజాగా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదువుతాను. – సువర్ణ, గ్రూప్–1 విజేత -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
నారాయణఖేడ్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. సీఐ ముని కథనం మేరకు.. గురువారం పట్టణ బైపాస్ రోడ్డులో గల వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సువర్ణ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి సువర్ణ, సత్యమ్మలతో పాటు బాధితులు రేణుక, రామవ్వ విటుడు సర్దార్ రవిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఖేడ్కు చెందిన సువర్ణ, సత్యమ్మలు ఇద్దరు కలిసి సువర్ణ గృహంలో వ్యభిచారం జరుపుతున్నారని విచారణలో వెల్లడైందన్నారు. ర్యాలమడుగుకు చెందిన రేణుక, రామవ్వలను వ్యభిచారంలోకి దింపారని, దాడులు సమయంలో ఇంట్లో రూ.5 వేల నగదు, 6 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు, బీరు, కల్లు సీసాలు లభించగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. సువర్ణ, సత్యమ్మ, రవిలపై పిటా యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. రేణుక, రామవ్వలను సంగారెడ్డిలోని రెస్క్యూ హోంకు తరలిస్తామని తెలిపారు. ఖేడ్ సర్కిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు సునీల్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారని సీఐ పేర్కొన్నారు. -
భార్య చేతిలో భర్త హత్య
ఆళ్లగడ్డ రూరల్: అహోబిలం అడవుల్లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేడ్చింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బుధవారం వెలుగు చూడటంతో కలకలం రేపింది. చాకరాజువేముల గ్రామానికి చెందిన కంబయ్య(32) హత్య చేయబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన తంబయ్య(32)కు పదకొండేళ్ల క్రితం డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెందిన సువర్ణతో వివాహం జరిగింది. దంపతులిద్దరు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి తొమ్మిది ఏళ్ల సుధారాణి, ఐదు సంవత్సరాల దస్తగిరమ్మ సంతానం. ఈనెల 16న తంబయ్యకు అరోగ్యం బాగాలేదని భార్య సువర్ణ ఆళ్లగడ్డకు తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించింది. ఆ తర్వాత సువర్ణ ఒంటరిగా రాత్రికి గ్రామానికి చేరుకుంది. నా కొడుకు ఎక్కడ అని అత్త ఈశ్వరమ్మ కోడలను ప్రశ్నించగా ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదు, ఇంతవరకు ఎదురుచూసి ఇంటికొచ్చానని సమాధానం చెప్పింది. రెండు రోజులైనా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 21న దొర్నిపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును ఆళ్లగడ్డ స్టేషన్కు బదిలి చేశారు. అయితే బుధవారం అహోబిలం అడవిలోని గండ్లేరు వాగులో గుర్తు తెలియన మృతదేహం ఉన్నట్లు పొలపర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆళ్లగడ్డ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐలు రమేష్బాబు, నవీన్బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన తంబయ్య తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు తమ కుమారుడిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భార్యనే కడతేడ్చింది.. తంబయ్య కనిపించకపోవడంతో కేసు నమోదు చేసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు భార్యపై అనుమానం వచ్చి ఆమె కాల్ డేటాను పరిశీలించగా నేరం అంగీకరించింది. సువర్ణకు కోటకందుకూరు గ్రామానికి చెందిన కిట్టు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్తను అసుపత్రి తీసుకెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఆళ్లగడ్డకు బయలుదేరారు. ఆ తర్వాత భర్తకు నిద్రమాత్రలు మింగించి ప్రియుడు కిట్టుతో కలిసి అటోలో అహోబిలం అడవిలోని గండ్లేరు వాగులోనికి తీసుకెళ్లారు. నిద్ర మత్తులో ఉన్న తంబయ్యను బండరాయిలో మోది హతమార్చారు. తంబయ్యను హత్య చేసిన సువర్ణ, ఆమె ప్రియుడు కిట్టులను ఆళ్లగడ్డ పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.


