breaking news
sunni leon
-
యూపీ యాసలో...
సినిమాల్లో కథానుగుణంగా, ప్రాంతానుగుణంగా హీరోహీరోయిన్లు ప్రవర్తిస్తుంటారు, ఆయా ప్రాంత యాసలో డైలాగులు కొడుతుంటారు. తాజాగా సన్నీ లియోన్ యూపీ యాసలో డైలాగులు చెప్పడానికి రెడీ అయ్యారు. తాజా చిత్రం ‘కోకోకోలా’లో సన్నీ లియోన్ యూపీ మహిళగా కనిపిస్తారట. కొత్త యాస నేర్చుకోవడం గురించి సన్నీ మాట్లాడుతూ– ‘‘కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఎగై్జటింగ్గా ఉంటుంది. యాక్టర్గా నేనింకా ఎదగడానికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. సినిమాలో యూపీ యాస సరిగ్గా పలకడానికి చాలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు సన్నీ. -
ఆ చాన్స్ ఇప్పుడొచ్చింది
సన్నీలియోన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె వేసే స్టెప్పులకు కుర్రకారు హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇప్పటికే చాలా స్పెషల్ సాంగ్స్లో నర్తించిన సన్ని తాజాగా మరో సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’) ఫేమ్ వైశాక్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా మలయాళంలో ‘మధుర రాజా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2010లో వచ్చిన ‘పోకిరి రాజా’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ‘‘మమ్ముట్టిసార్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఆ చాన్స్ ఇప్పుడు వచ్చింది. ఇది నాకో మంచి అవకాశం. ఈ సాంగ్ గురించి నాకు తెలుసు. ఏదో సినిమాలో కావాలని పెట్టే పాట కాదిది. చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ విషయం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని సన్ని చెప్పారు. ఈ సాంగ్ కోసం సన్నీలియోన్ ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశారు. వచ్చే నెలలో కొచ్చిలో ఈ పాట చిత్రీకరణకి ప్లాన్ చేశారు టీమ్. కాగా సన్నీలియోన్ ౖటైటిల్ రోల్లో ‘వీరమహాదేవి’ అనే పీరియాడికల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
మలయాళీ రంగీలా
ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు ఓ సందర్భంలో సన్నీ లియోన్ కొచ్చి వెళ్లినప్పుడు. ఆ తర్వాత సన్ని లియోన్ మలయాళంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలే నిజమయ్యాయి. సన్నీ మాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘మనీ రత్నం’ ఫేమ్ సంతోష్ నాయర్ దర్శకత్వంలో సన్నీ లియోన్ నటించనున్నారు. జయలాల్ మీనన్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రంగీల’అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో సన్నీ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘‘పీరియాడికల్ సినిమా ‘వీరమహాదేవి’ ఫిజికల్గా చాలెంజింగ్గా ఉంది. నా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కరణ్జీత్ కౌర్’ వెబ్ సిరీస్కు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఇవి కాకుండా కాస్త డిఫరెంట్గా ఉన్న సినిమాల్లో నటించాలనుకుని మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలవుతుంది. సినిమా సెట్స్పైకి వెళ్లడానికి ముందే వర్క్షాప్స్ ప్లాన్ చేస్తున్నాం. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుంది. బాలీవుడ్తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగూ హిందీ భాష వచ్చు. ఇప్పుడు మలయాళం నేర్చుకోవాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు సన్నీ లియోన్. అంతేకాదు ‘పాస్వర్డ్’ అనే నేపాలి ఫిల్మ్లో ఓ డ్యాన్స్ నంబర్కు చిందేయనున్నట్లు సన్నీ లియోన్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. -
మాస్ అమ్మా... మాస్!
బీట్... ఒక్క బీట్...హార్ట్ బీట్ని పెంచేస్తుంది! నోట్... ఒక్క మాస్ నోట్...మనందరి చేత స్టెప్పులేయిస్తుంది!రూరల్ టు సిటీ... సిటీ టు రూరల్....ఏ రూటులోని థియేటర్లోనైనా...ఎంత రేటు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడినైనా... వయసెంతైనా...స్టెప్పులేయించగల సత్తా... పాడించగల పట్టు... ఐటమ్ పాటకున్న ప్రత్యేకతలు!! మరి, మూడు గంటల సినిమాలో మూడున్నర నిమిషాల ఐటమ్ పాటలోసందడి చేసే భామలు? చిందేసే చిచ్చుబుడ్డీలు...కనువిందు చేసే కాకర పువ్వొత్తులు...టెన్ థౌజెండ్వాలా టపాసులు! సిన్మాలో వీళ్ల వెలుగులు, సౌండులు కాసేపే!కానీ, థియేటర్లను హోరెత్తించే ఈ స్పెషల్ సాంగులు..మాస్ అమ్మా... మాస్! రత్తాలూ... రైట్ రైట్! రత్తాలు రాకతో సంక్రాంతి పండక్కి థియేటర్లలో దీపావళి వచ్చేసింది. చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రత్తాలూ... రత్తాలూ’లో చిరూతో కలసి రాయ్ లక్ష్మీ అంతలా రఫ్ఫాడించేశారు మరి! రాయ్ లక్ష్మీ అంతకు ముందు ఎన్ని ఐటమ్ సాంగులు చేసినా... రత్తాలు మాత్రం ఆమెకు, ప్రేక్షకులకూ స్పెషల్! డ్యాన్సులో చిరు గ్రేసు, సాంగులో చిరూతో రాయ్ లక్ష్మీ వేసిన స్టెప్పులు... పట్టాలు ఎక్కిన రైలు వెళ్లేంత స్పీడులో ప్రేక్షకుల చేత స్టెప్పులేయించాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఇందులో రత్తాలు హాట్ అప్పియరెన్స్కి ప్రేక్షకులు రైట్... రైట్... అని ఓటేశారు. స్వింగ్ జరా... సెన్సేషన్రా! దీపావళికి నెల ముందు.. సరిగ్గా దసరా టైమ్లో... థియేటర్లలో సాలిడ్ సౌండ్ వినబడింది. ఎవరది? అంత సౌండ్ చేసింది? అని చూస్తే... తమన్నా! ఎన్టీఆర్తో స్టెప్పులు కలిపారు. థియేటర్లలో ఎవరి సీటుల్లో వాళ్లు కూర్చుంటే... అందరి చేత ‘స్వింగ్ జరా’ సాంగుతో స్టెప్పులేయించారు. కళ్లల్లో కసి, స్టెప్పుల్లో సెక్సీనెస్, ఎన్టీఆర్ రావణతాండవం... వెరసి సాంగ్ సెన్సేషన్! తెలుగు ప్రేక్షకులకు తమన్నా అందాలు కొత్తేం కాదు. ఎన్టీఆర్తో కలసి ఆల్రెడీ ఓ సినిమా చేశారు. కానీ, ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ సూపరో... సూపరు! అందుకే, పాట అంత హిట్టయ్యింది. సూయ... సూయ... స్టైలిష్ అనసూయ! రత్తాలొచ్చిన నెలన్నర తర్వాత థియేటర్లలో నిఖార్సైన నాటు బాంబు పడింది. ఈ నాటు బాంబు పేరు... అనసూయ. రత్తాలు చిరూతో వస్తే... చిరు మేనల్లుడు ‘విన్నర్’ సాయిధరమ్ తేజ్తో అనసూయ వచ్చారు. ‘సూయ సూయ అనసూయ’ అని ఆమె పేరుపైనే పాట రాయడం అనసూయకు దక్కిన అరుదైన అదృష్టం. హాట్ యాంకర్ అనసూయ హస్కీ లుక్స్, సెక్సీ స్టెప్పులకు తోడు ప్రముఖ యాంకర్ సుమ పాడడంతో ఈ పాటకు మాంచి క్రేజ్ వచ్చింది. థియేటర్లలో బాగానే సౌండ్ చేసిందీ సాంగ్! సిరిమల్లి... హాట్ రెడ్ చిల్లి! లేట్ కాలేదు... నాటు బాంబు వచ్చిన వారం రోజులకు దీవాలి టపాసు వచ్చేసింది. ఈ టపాసు స్టెప్పులకు పోరగాళ్లు ఫుల్ టాస్. ఫుల్ టు బిందాస్! ఈ టపాసు పేరు... హంసా నందిని. అసలే, ఐటమ్ సాంగులకు కేరాఫ్ అడ్రస్ ఈ రెడ్ చిల్లి. ‘మిర్చి’ నుంచి లాస్ట్ ఇయర్ ‘శ్రీరస్తు శుభమస్తు’ వరకు పలు సిన్మాల్లోని ఐటమ్ సాంగుల్లో ఘాటు ఘాటుగా కనిపించారు. ఈ ఏడాది రాజ్తరుణ్ ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో ‘నా పేరే సింగపూర్ సిరిమల్లి’ అంటూ చిచ్చుబుడ్డిలా వెలుగులు విరజిమ్మారు. పాటలో చెప్పినట్టు హంసా నందిని అందం హాట్ హాట్ రెడ్ చిల్లీనే. కొంటె కుర్రాళ్ల గుండెల్లో లొల్లి లొల్లీనే! టైమ్ లేదు గురూ... శ్రియ చమక్కులు! ‘టైమ్ లేదు గురూ...’ అంటూ కృష్ణవంశీ ‘నక్షత్రం’లో కనిపించారు శ్రియ. కానీ, అప్పటికి చాలా టైమైంది... తెలుగు తెరపై ఐటమ్ బాంబు పేలి! ఇటువంటి పాటల్లో శ్రియ చమక్కులు చూపించి! మార్చి మొదట్లో హంస హోయలొలికిస్తే... ఆగస్టు ఫస్టు వీక్లో శ్రియ సౌండ్ చేశారు. హీరోయిన్లను అందంగా చూపడంలో స్పెషలిస్ట్ అయిన కృష్ణవంశీ, మోడ్రన్ డ్రస్సుల్లో శ్రియను సెక్సీగా చూపించారు. దాంతో కుర్రకారు హ్యాపీ.ఎ ఫర్ అందగత్తె... సి ఫర్ క్యాథరిన్! ఎ ఫర్ అందగత్తె. బి ఫర్ బాంబ్... ఐటమ్ బాంబ్! ఎవరు? సి ఫర్ క్యాథరిన్. కావాలంటే... ‘జయ జానకి నాయక’లో ‘ఎ ఫర్ యాపిలు... బి ఫర్ బుజ్జులు’ చూడండి. క్యాథరిన్ చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. గట్టిగానే పేలిందీ బాంబ్. బెల్లకొండ శ్రీనివాస్ మంచి డ్యాన్సర్. అతని పక్కన అందంతో, అదరగొట్టే స్టెప్పులతో ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేశారు క్యాథరిన్. స్వీట్ సన్నీ.. ప్యారీ పూజ...రెడీ టు బ్లాస్ట్! జస్ట్... టూ వీక్స్ వెయిట్ చేస్తే చాలు! థియేటర్లలో ఇంకో ఐటమ్ బాంబు పేలుతుంది. మామూలు బాంబ్ కాదిది.. ఇంటర్నేషనల్ బాంబ్! పేరు... సన్నీ లియోన్. ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని శృంగార తార. వచ్చే నెల 3న థియేటర్లలోకి వస్తున్న రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’లో ఐటమ్ సాంగ్ చేశారు. అది ఏ రేంజ్లో పేలబోతుందో... ‘డియో డియో డిసక’ పాట వింటే అర్థమవుతుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన బీట్లో మాస్ని ఊపేసే ఓ మేజిక్ ఉంది. ఆల్రెడీ నెట్టింట్లో ‘డియో డియో’ ట్యూన్, సన్నీ స్టిల్స్, మేకింగ్ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ఓన్లీ... ఈ ఒక్క పాటకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారట! సన్నీ లేడీ 50 లక్షలు తీసుకుంటే... మేకింగ్కి మరో 50 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాటను నాలుగు రోజులు తీశారు. ‘‘నా సినిమాల్లో నేను తీసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. అందుకే, ‘ది బెస్ట్’ సాంగ్ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను’’ అని చిత్రదర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఇక, ఐటమ్ సాంగ్తో బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతోన్న మరో బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు ఈమె ఏ సినిమాలోనూ ఐటమ్ గాళ్గా కనిపించలేదు. రామ్చరణ్ ‘రంగస్థలం’తో ఆ లోటు తీర్చేస్తున్నారు. çసుకుమార్ సినిమాల్లో ఐటమ్ బాంబులు ఏ రేంజ్లో పేలాయో? సుక్కు సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత రెచ్చిపోతారో? ప్రత్యేకంగా చెప్పాలా!! సో, ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేయబోయే పాట ఆల్రెడీ హిట్టని ప్రేక్షకులు ఫిక్సయ్యారు! - సత్య పులగం -
సన్నీలియోన్ పై కక్ష కట్టిన రాఖీ సావంత్
-
'సన్నీ లియోన్ను దేశం నుంచి తరిమేస్తా'
అత్త మీది కోపం దుత్త మీద తీర్చుకోవడం అంటే ఇదేనేమో! ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్కు ఎవరి మీద కోపమో తెలియదు కానీ.. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా శృంగార తార సన్నీ లియోన్పై చూపించింది. ఆమె పరోక్షంలో.. సన్నీతో తనకు పోలికేంటని కేకలు పెట్టినంత పని చేసింది. అంతటితో ఆగకుండా.. సన్నీని దేశం నుంచి పారిపోయేలా చేస్తానని ఆవేశంతో ఊగిపోయింది. వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా సన్నీ మీద ఫైర్ అవ్వడంపై ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. వరుస అవకాశాలతో సన్నీ బాలీవుడ్ను దున్నేస్తుండటమే రాఖీ ఫ్ట్రస్ట్రేషన్కు కారణమని విశ్లేషిస్తున్నారు.