breaking news
sunglasses
-
సీఎం విజయ్ వృద్ధురాలికి గిఫ్ట్గా సన్గ్లాసెస్.. ధర ఎంతో తెలుసా..!
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్గ్లాసెస్ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!.ఆ సన్గ్లాస్ ప్రత్యేకత ఇది..ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని పారిస్లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్హౌస్ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె.#WATCH | Salem | Tamil Nadu CM Joseph Vijay visits the house of a farmer and gifts his glasses to an elderly woman in Mettur(Source: TN CMO) https://t.co/VQy07Jy7kt pic.twitter.com/NhZN3FfXmF— ANI (@ANI) September 1, 2026(చదవండి: క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) -
బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్గ్లాసెస్: భారీ తగ్గింపుతో
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కనెక్ట్ గ్యాడ్జెట్స్ రిథమ్ పేరుతో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ సన్గ్లాసెస్ను ఆవిష్కరించింది. ఎండ నుంచి రక్షణతోపాటు ఫోన్ కాల్స్ అందుకోవచ్చు. పాటలు వినొచ్చు. స్పెషల్ లాంచ్ ఆఫర్ ధర రూ. 1,999. నాలుగు గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. మార్కెట్లోకి విడుదల చేసిన 3 రోజుల్లోనే 20,000 యూనిట్లు విక్రయించామని కంపెనీ కో-ఫౌండర్ ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు. రిథమ్ అంతర్నిర్మిత మైక్రోఫోన్ స్పీకర్లతో వస్తుంది. ఇది మ్యూజిక్, ఇన్కమింగ్ కాల్స్కు సులభంగా మారడానికి వీలు కల్పిస్తుందనీ, ముఖ్యంగా సన్ గ్లాసెస్ను తీయకుండానే వాల్యూమ్ను సర్దుబాటు చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు అని ప్రదీప్ తెలిపారు. రిథమ్ కేవలం 38 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులోని 120mAh బ్యాటరీ నాలుగు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందన్నారు. త్వరలోనే మరో ఐదు మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వచ్చే త్రైమాసికంలో 5 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మరోవైపు దీని అసలు ధర రూ. 6,999. అయితే ప్రత్యేక లాంచ్ ఆఫర్గా, 1,999 రూపాయలకే అందిస్తోంది. -
కూల్గా ఎండకు చెమట పట్టించండి...
స్టయిల్ సన్గ్లాస్ అంటే ఎండను తట్టుకోవడానికి ఉపయోగపడే అద్దాలు మాత్రమే కాదు...ఇంకా చాలా! ముఖ్యంగా చెప్పాలంటే మన ‘పర్సనల్ స్టైయిల్’ అందులో ప్రతిఫలిస్తుంది. ముఖాన్ని బట్టి సన్గ్లాస్లు సూట్ అవుతుంటాయి. కాబట్టి కొనే ముందు సలహా తీసుకోండి. మీ ముఖారవిందానికి నప్పే చలువ అద్దాలను ఎంపిక చేసుకుండి. ఎండను షేక్ చేయండి. ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. మీకు సూటయ్యే అద్దాల గురించి ఒక అంచనాకు రండి. -
కొత్త సరుకు...
మతిమరపు రాయుళ్ల కోసం... స్మార్ట్ఫోన్, కళ్లజోడు, పర్స్... ఇలా ముఖ్యమైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ మరచిపోయే వాళ్లు మనలో చాలామంది ఉంటారు. ఇలాంటివారి కోసమే తయారైన ఎలక్ట్రానిక్ పరికరం బ్రింగర్! మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువులకు చిన్న ట్యాగ్ను తగిలిస్తే చాలు.. అన్ని వస్తువులు ఉన్నాయా? లేదా? అన్నది చెక్ చేసి దేన్ని మరచిపోయారో మీకు గుర్తు చేస్తుంది. బ్లూ టూత్ ఆధారంగా పనిచేసే ఈ గాడ్జెట్ కారులో లైటర్ స్టాండ్లో ఇమిడిపోతుంది. కారెక్కగానే... ట్యాగ్స్ ఉన్న పరికరాలన్నీ మీతోనే ఉన్నాయా? లేదా? అన్నది చూస్తుందన్నమాట. ప్రస్తుతానికి దీన్ని కారు ఉన్నవారు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. భవిష్యత్తులో ఇతరులకూ పనికొచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లల కోసం ఎడ్డీ... స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టాబ్లెట్ను మెటిస్ లెర్నింగ్ కంపెనీ ఇటీవలే భారత్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ టాబ్లెట్ ఏకంగా 1.6 గిగాహెర్ట్జ్ డ్యుయల్కోర్ ప్రాసెసర్పై నడుస్తూండటం విశేషం. అంతేకాదు... ఏడు అంగుళాల స్క్రీన్సైజ్తో లభించే ఎడ్డీలో ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది గిగాబైట్ల మెమరీ ఏర్పాటు చేశారు. రెండు మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. స్కూల్ కరిక్యులమ్కు అనుగుణమైన ప్రీలోడెడ్ ఆప్స్, ఆటల ద్వారా కొత్త విషయాలను నేర్పే టెక్నిక్స్ కూడా దీంట్లో ఉన్నాయని, తద్వారా పిల్లలు వేగంగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని కంపెనీ తెలిపింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా ఇబ్బంది లేకుండా టాబ్లెట్ చుట్టూ రబ్బర్ ఫ్రేమ్ ఒకటి ఏర్పాటు చేశారు. రెండు నుంచి 10 ఏళ్ల వయసు మధ్యవారి కోసం ఉద్దేశించిన ఎడ్డీలోని కంటెంట్ను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నియంత్రించే వీలుంది. రెండేళ్ల పసివాళ్లు కూడా రోజుకు రెండు గంటల వరకూ టాబ్లెట్ను వాడినా కంటికి ఇబ్బంది లేని స్క్రీన్, రెజల్యూషన్ను ఉపయోగించామని కంపెనీ తెలిపింది. ధర దాదాపు రూ.10వేలు. మరిన్ని వివరాల కోసం www.eddytablet.com/ వెబ్సైట్ను సందర్శించవచ్చు. జియోనీ జీ4 ఫాబ్లెట్... చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోనీ తాజాగా జీప్యాడ్4 పేరుతో ఓ శక్తిమంతమైన స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 5.7 అంగుళాల స్క్రీన్సైజ్తో లభించే ఈ స్మార్ట్ఫోన్ 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 7.95 మిల్లీమీటర్ల మందంతో ఉండే అల్యూమినియం యునీబాడీ జీప్యాడ్ మరో ప్రత్యేకత. 1280 బై 720 ఫుల్హెచ్డీ డిస్ప్లేతో చిత్రం స్పష్టతపై ఢోకా ఉండదు. అప్లికేషన్లు లాంచ్ చేసేందుకు, ఇతర కర్యాకలాపాల కోసం సంజ్ఞలు చేస్తే సరిపోయేలా దీంట్లో గెస్చర్ కంట్రోల్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. ఆటోఫోకస్, ఎల్ఈడీ ఫ్లాష్లతో కూడిన 13 మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3200 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కు కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆమిగో ఓఎస్ను దీంట్లో ఉపయోగించారు. ఫలితంగా ఫేస్బ్యూటీ ఎఫెక్ట్స్, హ్యాండ్స్ఫ్రీ ఫొటో, గెస్చర్ రికగ్నిషన్, మోషన్ సెన్సింగ్, పనోరమా మోడ్ (హారిజాంటల్, వెర్టికల్ కూడా) ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్ వంటి అదనపు హంగులు చేరాయి. డిజిటల్ థియేటర్ సిస్టమ్ను కూడా కలిపి ఉంచిన ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు రూ.18999.


