-
రూ.6 లక్షలు మాయం, వాళ్లే తీసుకున్నారంటూ హైడ్రామా
సాక్షి, సుల్తాన్బజార్: సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన యజమాని డబ్బును పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ విషయం మీడియాకు తెలియడంతో ఓ నకిలీ పోలీసు రూ.6 లక్షలు కాజేసినట్లు వైరలైంది. అయితే సుల్తాన్బజార్ పోలీసులు మాత్రం ఇది ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. కోదాడకు చెందిన అమర్నాథ్రెడ్డి సొమ్ము రూ.6 లక్షలు పోయినట్లు తప్పుడు సమాచారం పోలీసులకు అందింది. డబ్బు పోయిందని డ్రామానా? రూ.6 లక్షలు తన డ్రైవర్ తండ్రి హన్మంతు ద్వారా కూకట్పల్లి నుంచి కోదాడకు తీసుకువెళ్తున్నారు. హన్మంతుకు డబ్బుపై ఆశ కలగడంతో డబ్బులను కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో అమర్నాథ్రెడ్డి సుల్తాన్బజార్ పోలీసులను వాకబు చేశారు. పోలీసులు కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తా వద్ద ఎలాంటి డబ్బు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. ఈ విషయమై సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతిని వివరణ కోరగా తమకు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని డబ్బుపై ఆశతోనే హన్మంతు నకిలీ పోలీసులంటూ డ్రామా ఆడుంటారని అభిప్రాయపడ్డారు. -
Black Fungus: కోఠి ఆస్పత్రికి ఒక్కరోజే 284 మంది!
సాక్షి, సుల్తాన్బజార్: ‘బ్లాక్ ఫంగస్’ నోడల్ కేంద్రమైన హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి వస్తున్న బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్ ఫంగస్ అనుమానితులు ఆస్పత్రికి రాగా.. అందులో మొత్తం 39 మందిని ఇన్పేషెంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. మిగతావారిలోనూ చాలా మందికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నా.. కొందరు పాజిటివ్ రోగులు కావడం, మరికొందరికి కోవిడ్ వచ్చి తగ్గినా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ లేకపోవడంతో చేర్చుకోలేదని సమాచారం. చాలా తక్కువగా లక్షణాలు ఉన్నవారికి మందులు రాసి పంపించినట్టు తెలిసింది. తాజాగా అడ్మిట్ అయినవారితో కలిపి ప్రస్తుతం ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘బ్లాక్ ఫంగస్’ బాధితుల సంఖ్య 90కి చేరింది. వీరిలో ఏడుగురికి గురువారం శస్త్రచికిత్సలు నిర్వహించారు. బెడ్ల సంఖ్య పెంచుతూ.. ఈఎన్టీ ఆస్పత్రికి వస్తున్న బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. మొదట 50 బెడ్లను కేటాయించగా.. ప్రస్తుతం 200 వరకు బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డుల్లో, ఆవరణలో బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు, రిపోర్టుల కోసం వెనక్కి.. గురువారం ఒక్కసారిగా 284 మంది ‘బ్లాక్ ఫంగస్’ అనుమానితులు ఈఎన్టీ ఆస్పత్రికి రావడంతో ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. వీరిలో కొందరు కోవిడ్ పాజిటివ్ వారు ఉండటం, మరికొందరికి కోవిడ్ తగ్గినా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ లేకపోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిప్పిపంపారు. మరికొందరిని పలు టెస్టుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాలని ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు సూచించినట్టు రోగులు తెలిపారు. ఉస్మానియాకు, ఇతర ల్యాబ్లకు టెస్టుల కోసం పరుగెత్తడం, ఇందుకు రోజంతా సమయం పట్టడంతో ఆస్పత్రిలో అడ్మిషన్ ఆలస్యం అవుతోందని రోగుల బంధువులు వాపోయారు. ఉదయం ముందుగా వస్తున్న రోగులకు పరీక్షలు చేస్తున్నామని, పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణలో వేచి ఉండటం కనిపించింది. ఆస్పత్రిని పరిశీలించిన సీఎంవో ఓఎస్డీ బ్లాక్ ఫంగస్ చికిత్సలకు సంబంధించి కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని సీఎంవో ఓఎస్డీ గంగాధర్ గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న బెడ్లు, పేషెంట్ల సంఖ్య, చికిత్సలపై ఆరా తీశారు. అంతకుముందు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి చికిత్సలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండదని ఆయన పేర్కొన్నారు. జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కలకలం సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం కూడా పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కందగట్లకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు.. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఆయన కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు, రంగాపూర్కు చెందిన మరో వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ ఇద్దరికి కళ్లకు ఇన్ఫెక్షన్ సోకగా.. హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో 25 ఏళ్ల యువకుడికి ఒక కన్ను తొలగించినట్టు బాధితుడి బంధువులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం అర్లి(టి)కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి బ్లాక్ ఫంగస్తో ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నా కూతురు నాకు కావాలి: విలపించిన తల్లి
సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. ఈ విషయం గురించి సుల్తాన్ బజార్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ‘శిశువును అపహరించిన మహిళ తొలుత బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించాము. అనంతరం ఆమె ప్రయాణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను విచారించగా ఆమె బీదర్ కొత్త కమాన్ దగ్గర దిగినట్లు చెప్పారు. అక్కడి నుంచి ఆమె ఆటోలో వెళ్ళి ఉండవచ్చని అనుమానిస్తున్నాము. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని విచారిస్తున్నాము. కాని ఈ మహిళకు పాత కేసుల్లో ఉన్న వారితో ఎలాంటి పోలికలు లేవ’ని తెలిపారు. అంతేకాక శిశువును అపహరించిన మహిళ పాప తల్లితో మాట్లాడినప్పుడు తెలుగులోనే మాట్లాడిందని, కండక్టర్తో మాట్లాడినప్పుడు మాత్రం కన్నడలో మాట్లాడిందని సీఐ శివశంకర్ చెప్పారు. శిశువును అపహరించిన మహిళను పట్టుకునేందుకు మొత్తం 11 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏడు తెలంగాణకు చెందినవి కాగా, మరో నాలుగు బీదర్ పోలీసు బృందాలని తెలిపారు. నా కూతురు నాకు కావాలి: తల్లి విజయ ‘ఆ మహిళ నాతో తెలుగులోనే మాట్లాడింది. టీకా వేయించాలని నా కూతుర్ని తీసుకెళ్లింది. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయింది. నా కూతురు నాకు కావాలి, ఎక్కడ ఉన్నా నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి’ అంటూ బాలిక తల్లి విజయ కన్నీరుమున్నీరైంది. -
చారిత్రక కట్టడాలు కనుమరుగు!
♦ సుల్తాన్ బజార్లో మెట్రో పనులకు శ్రీకారం ♦ కాలగర్భంలో కలిసిపోనున్న చారిత్రకకట్టడాలు ♦ వాటిలో ముఖ్యమైనవి సుల్తాన్బజార్, బడీచౌడి మార్కెట్ ♦ ఆర్యసమాజ్, హరి మసీద్, జైన్మందిర్లు కూడా... హైదరాబాద్: రాష్ర్టంలోనే ప్రతిష్టాత్మక చారిత్రక సుల్తాన్బజార్ మార్కెట్ త్వరలో కనుమరుగుకానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మెట్రోైరెల్ ప్రాజెక్ట్ మార్గం ఈ మార్కెట్ మీదుగానే వెళుతుండడంతో ఈ ప్రాంతంలో వందేళ్లు పైబడిన అరుదైనచారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. మెట్రో మార్గంపై స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా..హెచ్ఎంఆర్ఎల్, జీహెచ్ఎంసీ, ఎల్అండ్టీ సంస్థలు తమదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆస్తుల కూల్చివేతను గణనీయంగా తగ్గించేందుకు ఈ మార్కెట్ ప్రాంతంలో ప్రధాన రహదారి పైనుంచి 65 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఆస్తులను సేకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా గత మంగళవారం పుత్లిబౌలి చౌరస్తాలోని ఓ పెట్రోల్బంక్ కూల్చివేతతో సుల్తాన్ బజార్లో మెట్రో పనులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కాలగర్భంలోకి... సుల్తాన్బజార్ మీదుగా మెట్రో మార్గం వెళుతుండడంతో సుల్తాన్బజార్, బడీచౌడి ప్రాంతాల్లో సుమారు 60 నిర్మాణాలు నేలమట్టం కానున్నాయి. ఇందులో ప్రధానంగా 100 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక ఆర్యసమాజ్ మందిరం, హనుమాన్, గణపతి దేవాలయాలు, హరి మసీద్, సుల్తాన్బజార్ ప్రధాన మార్కెట్లో ఉన్న జైన్ మందిర్లతో పాటు ఆంధ్రాబ్యాంక్.. ఇతర ఆస్తులు కనుమరుగు కానున్నాయి. ముఖ్యంగా సుల్తాన్బజార్ చారిత్రక మార్కె ట్, బడీచౌడి మార్కెట్, ఆర్యసమాజ్, హరి మసీద్, జైన్ మందిర్లు కూల్చివేతకు గురవుతుండడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.కోఠిలో రద్దీ దృష్ట్యా ప్రజల సౌకర్యార్ధం నిర్మించిన సబ్వేలు సైతం కనుమరుగయ్యే అవకాశం ఉంది. మెట్రోకు వ్యతిరేకంగా ఉద్యమం... తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులతో బహిరంగ సభ నిర్వహించి మెట్రో మార్గాన్ని సుల్తాన్బజార్ మీదుగా రానివ్వబోమని వ్యాపారులకు భరోసా ఇచ్చారు. దీంతో మెట్రో అధికారులు ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే నాలుగు రోజుల క్రితం అధికారులు పెట్రోల్ బంక్ను కూల్చివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. పరిహారం రెట్టింపు... నాలుగేళ్ల్ల క్రితం సుల్తాన్బజార్లో మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులు ఆందోళన చేపట్టిన రోజుల్లో గజానికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తామని వ్యాపారులతో మెట్రో అధికారులు సంప్రదింపులు జరిపినా సఫలంకాలేదు. మెట్రో కారిడార్ 1, 2లో పనులు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో సుల్తాన్బజార్ వ్యాపారులకు రెట్టింపు పరిహారం అంటే.. గజానికి లక్ష ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని కొందరు భవన యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగుతుండడం విశేషం. అయినా కొందరు వ్యాపారులు, హాకర్స్, 54 మంది భవన యజమానులు మెట్రో మార్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. -
సుల్తాన్బజార్ బంద్ సక్సెస్
‘మెట్రో’కు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యాపారులు హైదరాబాద్: పాత రూట్లోనే మెట్రో రైల్ నిర్మిస్తామన్న ఎల్అండ్టీ ఎండీ గాడ్గిల్ ప్రకటనపై సుల్తాన్బజార్ వ్యాపారులు గళమెత్తారు. సుల్తాన్బజార్ మీదుగా మెట్రో రైలు రూటు వేస్తే ప్రాణాలకు తెగించైనా అడ్డుకొంటామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సుల్తాన్బజార్ మీదుగా మెట్రో నిర్మాణం చేపట్టవద్దని... అదే జరిగితే పెద్దఎత్తున ఉద్యమిస్తామని సుల్తాన్బజార్ వ్యాపార సంఘం పేర్కొంది. గాడ్గిల్ ప్రకటనకు నిరసనగా శుక్రవారం సుల్తాన్బజార్లో వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ నిర్వహించారు. గాడ్గిల్కు వ్యతిరేకంగా నినదించారు. సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఇతర నాయకులు సురేంద్రమాల్ లూనియా, శశిభూషణ్ల ఆధ్వర్యంలో వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్కు స్థానిక ఎమ్మెల్యే టి.రాజాసింగ్ లోధా మద్దతు తెలిపారు. సుల్తాన్బజార్లో మెట్రో నిర్మాణం చేపడితే ఎంతో మంది వ్యాపారులు ఉపాధి కోల్పోతారని, రూట్ మార్చకపోతే పనులను అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బైకుల చోరీ కేసులో ఐదుగురికి జైలు
ఉండాల్సింది ధైర్యం మాత్రమే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement