-
సర్వీస్ రూల్స్ అమలును వేగవంతం చేయండి
కేంద్ర హోం శాఖను కోరిన ఎస్టీయూ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ వెంటనే సర్వీసు రూల్స్ అమలుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఇరు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు కోరారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు షణ్ముర్తి, భుజంగరావు, ప్రధాన కార్యదర్శులు జోసెఫ్ సుధీర్బాబు, సదానందగౌడ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్కుమార్తో సమావేశమై వినతిపత్రాన్ని సమర్పించారు. సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే హోం శాఖ నుంచి ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపేదుకు చర్యలు తీసుకుంటామని దిలీప్ కుమార్ హామీ ఇచ్చినట్టు కత్తి నరసింహారెడ్డి తెలిపారు. సీఐడీ ఐజీగా షికా గోయల్ కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవల రిలీవై రాష్ట్ర పోలీసుశాఖలో రిపోర్టు చేసిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షికా గోయల్ను సీఐడీ ఐజీగా అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్శర్మ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సీఐడీలోని జనరల్ అఫెన్స్ వింగ్, ఎకానామిక్ అఫెన్స్ వింగ్ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రెండు విభాగాల్లో పదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులపై ఆమె సోమవారం సమీక్షించారు. -
ఏ ప్రతిభ ఆధారంగా బదిలీలు చేస్తున్నారు
► ప్రభుత్వానికి ఎస్టీయూ సూటిప్రశ్న కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ విడుదల చేయకుండా రాజకీయ బదిలీలు చేపడుతున్న ప్రభుత్వం ఏ ప్రతిభ ఆధారంగా చేస్తున్నారో వెల్ల్లడించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండం జయరామయ్య డియాండ్ చేశారు. నగరంలోని ఎస్టీయూభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రతిభ ఆధారిత బదిలీలు తప్పనిసరి అని చెబు తూనే మరోవైపు ప్రభుత్వం అవలం బిస్తున్న వైఖరి దేనికి సంకేతం అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో పరస్పర బదిలీల ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. బదిలీల షెడ్యూల్ను ప్రకటించపోతే త్వరలో ఎస్టీయూ తరఫు న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు రఘునాథ రెడ్డి, ఇలియాస్బాషా మాట్లాడుతూ ఆరియర్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులూ హెల్త్కార్డుకు అర్హులే: ఎస్టీయూ
సాక్షి, హైదరాబాద్: ప్రీమియం చెల్లించే మహిళా టీచర్లు, ఉద్యోగులపై ఆధాపడిన వారి తల్లి, తండ్రి హెల్త్ కార్డుల పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్టు ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5 నుంచి కుటుంబం మొత్తానికి కాకుండా సభ్యులకు విడివిడిగా కార్డులు ఇవ్వడానికి, నమోదు గడువు పొడిగించడానికి అంగీకరించారని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement