-
గూడేనికి కొత్త గుర్తింపు
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: ‘‘అది.. రెండు నెలల క్రితం దాకా ఊరూ పేరూ లేని ఓ మూరుమూల గూడెం! అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడిపల్లె పంచాయతీ శివారులో 40 మంది యానాదులు దశాబ్దాలుగా గుడిసెల్లో జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు! ప్రభుత్వ పథకాలేవీ దరి చేరలేదు! ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చొరవతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. తుప్పలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ రవాణా సదుపాయం లేని ప్రాంతానికి దారి ఏర్పడింది. తాగునీటి కోసం మంచినీటి బోరు కూడా తవ్వారు. ఏ ఆధారంలేని వారికి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. దీంతో ఓటు హక్కు దక్కింది. రేషన్ కార్డులూ రెడీ అవుతున్నాయి. ఇదంతా ‘జగనన్న ఎస్టీ కాలనీ’లో కేవలం రెండు నెలల్లోనే జరిగిన పురోగతి. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు సాకారమవుతున్నాయి. వేర్వేరు కమిషన్ల ఏర్పాటు.. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భిన్న స్థితిగతులు, సమస్యలు ఉంటాయి. గతంలో వారిని ఒకే కమిషన్ పరిధిలో కొనసాగించడంతో సత్వర న్యాయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు 2021 మార్చి 4న నియమితులయ్యారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్గా న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడైన మారుమూడి విక్టర్ ప్రసాద్ను 2021 ఆగస్టు 24న ప్రభుత్వం నియమించింది. ఈ రెండు కమిషన్లు ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల సమస్యలపై స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ కమిషన్ పనితీరులో మైలు రాళ్లు.. ► కలెక్టరేట్లలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎస్టీ కమిషన్ ఆరా తీస్తోంది. ► విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులు, పరిశోధకుల అడ్మిషన్లతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదించింది. ► శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ► ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, పదోన్నతులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, గిరిజనులకు భూమి పట్టాల (ఆర్ఓఎఫ్ఆర్, డీ పట్టా) పంపిణీపై ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజనులపై అఘాయిత్యాలు, భూ సమస్యలు, సర్వీసు వ్యవహారాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ► కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండ, మాన్సింగ్ తండా, మత్రియ తండా తదితర తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించింది. కృష్ణా నది నుంచి పైపులైను ద్వారా నేరుగా మంచినీరు అందించేలా ప్రతిపాదించింది. మారుమూల ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ను నియమించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. గిరిజనులకు ఎక్కడ సమస్య తలెత్తినా కమిషన్ అక్కడికి వెళుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను అందించేలా సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. –వడిత్యా శంకర్ నాయక్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నీటి తిప్పలు తీర్చారు గతంలో మా ప్రాంతానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండేది కాదు. దూరంగా ఉన్న తోటల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. పనికి వెళితేనే అక్కడి రైతులు నీరు ఇచ్చేవారు. అధికారులు మా గ్రామాన్ని సందర్శించి బోరు వేయడంతో నీటి తిప్పలు తీరాయి. –ఎం.సరోజమ్మ, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం మార్గమే లేని మా ప్రాంతానికి తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. త్వరలో పక్కా రోడ్డు వేస్తామన్నారు. పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేశారు. బడికెళ్లే పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశారు. మాకు ఆధార్, ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. –టి.నాగరాజు, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం జగనన్న ఎస్టీ కాలనీగా నామకరణం గతంలో యానాదుల కాలనీకి పేరు కూడా లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జగనన్న ఎస్టీ కాలనీగా బోర్డు ఏర్పాటు చేశాం. వారికి అవసరమైన వసతులు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేలా శ్రద్ధ వహిస్తున్నాం. –గంగాధర్, బావికాడపల్లె పంచాయతీ కార్యదర్శి బాక్స్లో హైలెట్ చేయగలరు ► జగనన్న ఎస్టీ కాలనీలో యానాదుల సంఖ్య 40 ► గతంలో ఇద్దరికి మాత్రమే ఆధార్ ఉండగా ప్రత్యేక క్యాంపుతో 30 మందికి ఆధార్ కార్డులిచ్చారు. ► ఇప్పటివరకు ఎవరికీ ఓట్లు లేవు. తాజాగా 21 మందిని (10 మంది మహిళలు, 11 మంది పురుషులు)కి ఓటర్లుగా నమోదు చేశారు. ► ఆధార్ కార్డులు రావడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. ► పెన్షన్లు కూడా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఐదేళ్ల లోపు పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్ నమోదు చేసి ముగ్గురిని బడిలో చేర్చారు. -
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
సాక్షి, విజయవాడ: ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. (చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్) ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.(చదవండి: నా ఇంటి నెంబరు 305..) -
‘వారిది తప్ప.. అందరి మద్దతు ఉంది’
సాక్షి, సింహాచలం: మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడిన 29 గ్రామాల ప్రజలు మినహా ప్రజలందరూ మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నాం.. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే భారీస్థాయిలో ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల విమర్శలు దారుణమన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా..? విచక్షణాధికారాల పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలన్నారు. అలా కాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదన్నారు. ఈ నిబంధనలు తెలియకపోతే యనమల మరోసారి రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. ఉద్యోగులను బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయని ఉద్యోగులందరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సింహాచలంలో ఎస్టీ కమిషన్ పర్యటన రాష్ట్ర ఎస్టీ కమిషన్ కమిటీ సభ్యులు మంగళవారం సింహాచలం కొండపై పర్యటించారు. సింహాచలంపై ఉద్యోగాల రిజర్వేషన్ అమలుపై ఏపీ ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్ బాలరాజు, సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా?
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు బిల్లుపై చర్చ జరగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడటం మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దళితుల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ అనుమతితో మంత్రి విశ్వరూప్ ఈ బిల్లును సభ ముందుంచారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు దళిత ద్వేషి: వరప్రసాద్ బిల్లుపై చర్చను అడ్డుకుంటూ టీడీపీ ఆందోళనకు దిగడంపై ఎమ్మెల్యే వరప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చులకనగా మాట్లాడిన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. నవరత్నాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నాయో టీడీపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి అనిల్ అన్నారు. ఎస్సీలను తొలగించిన చరిత్ర బాబుది: పుష్ప శ్రీవాణి దళితులంటే టీడీపీకి ఎంత వ్యతిరేకత ఉందో బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, దళితుల సంక్షేమం టీడీపీకి పట్టదని ఎమ్మెల్యే నాగార్జున విమర్శించారు. మహిళా మంత్రులను అవమానిస్తున్నారు: రోజా ఎస్సీ ఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా మంత్రిని అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను కేసీఆర్ పొగిడినట్లు చంద్రబాబు చెబుతున్నారని అయితే నిజానికి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ లేరని ఆయన అన్నారని తెలిపారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు బతికే దాన్ని సామాజిక రాజధాని అంటారని, సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, నక్కా ఆనంద్బాబు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. అనంతపురం నుంచి వచ్చి పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని, కానీ యామినిబాల ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు. బిల్లుకు అడ్డుపడుతున్న టీడీపీ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.కన్నబాబు, సుధాకర్బాబు, గొల్ల బాబూరావు, జోగారావు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఎరుకల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తా
హైదరాబాద్: కోయలు, గోండులు, చెంచులు, ఎరుకల, పెంట కులస్తుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పందుల పెంపకానికి ఎరుకల కులస్తులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం(టీపీవైఎస్) ఆధ్వర్యంలో 35మంది ఎరుకల కులస్తులకు ఏకలవ్య అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, కమిషన్లో 27,033 కేసులు పెండింగ్లో ఉండగా వాటిలో 26వేల కేసులను పరిష్కరించామన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు వి.రమణ, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement