-
ఉపాధి నిబంధనల్లో మార్పులు
ఇకపై పని చేసిన గ్రామంలోనే సగం నిధులు ఖర్చు చేయాలి వేతనదారులకు పని కలిపిస్తేనే మెటీరియల్ పనులు మంజూరు ఈ ఏడాది జిల్లాలో రూ. 800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం శ్రీకాకుళం పాతబస్టాండ్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది నుంచి మార్పులు తీసుకురావాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. గ్రామాల్లో వేతనదారుల ద్వారా జరిగే పని విలువను బట్టే ఆ గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడే మెటీరియల్ కాంపోనెంట్ నిధులను మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఉపాధి çహామీ పథకం అమలు చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో 60 శాతం వేతనదారులకు పనులు కల్పించడానికి, మరో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్లో భాగంగా సిమెంటురోడ్లు, భవనాలు, సీసీ కాలువులు, ప్రహరీల నిర్మాణ పనులకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం 40 శాతం మెటీరియల్ పనుల నిధుల విడుదలకు జిల్లా ప్రాతిపదిక.. గ్రామాల్లో వేతనదారుల ద్వారా జరిగే పని విలువను బట్టీ నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రామ పరిధిలో వేతనదారుల ద్వారా చేసే పని విలువలో కనీ సం 50 శాతం సంబంధిత గ్రామంలోనూ, మరో 25 శాతం నిధులు ఆ గ్రామం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వేరే గ్రామానికైనా మంజూరు చేయవచ్చు. మిగిలిన 25 శాతం నిధులను ఆ జిల్లా పరిధిలో ఏ గ్రామానికైనా మంజూరు చేసే వెసులబాటు ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర ఉపాధి హమీ పథకం అమలు కమిటీ సమావేశంలో గ్రామీణ అభివద్ది శాఖ అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా..దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అధికార ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. రూ. 800 కోట్ల విలువైన పనుల లక్ష్యం జిల్లాలో ఈ ఏడాది (2018–19 ఆర్థిక సంవత్సరంలో) ఉపాధి హమీ పథకం ద్వారా 800 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ పనులు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేతనదారుల ద్వారా చె?పట్టే పనులకు నాలుగు వందల కోట్ల రూపాయలు, మెటీరియల్ పనులకు మరో రూ. 400 కోట్లు వెచ్చించాలనేది లక్ష్యం. వీటిలో మెటీరియల్ కంపోనెంట్ పనుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరే నగదు రూ. 266 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం, నిబంధనాలతో వేతనదారులు ఎక్కువగా పనిచేసే గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ పనులు కూడా ఎక్కువగా రానున్నాయి. గత ఏడాది జిల్లాలో వేతనదారులు రూ. 320 కోట్లు విలువైన పనులు చేయగా.. మెటీరియల్ పనులు రూ. 210 కోట్లు జరిగాయి. ఈ ఏడాది ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో 1096 పంచాయతీలు ఉండగా.. వీటిలో 1071 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. మిగిలిన 25 గ్రామాల్లో పనులు గుర్తించక పోవడంతో పాటు వేతనదారులు కూడా పనులు చేసేందుకు ఆకస్తి చూపడం లేదు. ఇలాంటి గ్రామాల్లో నీటి గుంతలు, గృహ నిర్మాణాలు ఇతర పనులు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరేలా కృషి చేస్తున్నామని పీడీ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకి సగటునా 2,75,000 మంది వేతనదారులు పనుల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు పోలింగ్ కేంద్రాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్, రిటర్నింగు అధి కారి కేవీఎన్ చక్రధరబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్నికలపై జాయింట్ కలెక్టర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజనల్ ప్రధాన కేంద్రాల్లో పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చి 17న పోలింగు జరుగుతుందన్నారు. మార్చి 20న లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 28 వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉందని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓటు వేయడానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, ఆప్షన్ ఇచ్చిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఓట ర్లుగా ఉంటారని చెప్పారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా, సభ్యుల సంఖ్యను అందించాలని కాంగ్రెస్ ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి కోరారు. సమావేశంలో సహాయ రిటర్నింగు అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ప్రతినిధి పోలిశెట్టి మధుబాబు, కాంగ్రెస ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కె. సింహాచలం, లోక్సత్తా ప్రతినిధి, వి. అప్పలరాజు, బీజేపీ ప్రతినిధులు అట్టాడ రవిబాబ్జి, ఎస్వీ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement