-
టీటీడీ చదువుకు భలే డిమాండ్
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: పదవ తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టీటీడీ డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం గత నెల 25 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ చేరే వారు ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేయగా, మంగళవారం టెన్త్ ఫలితాల విడుదలతో ఇంటర్లో చేరదలచిన వారు దరఖాస్తుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసే టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశ నోటిఫికేషన్ ఈ యేడాది త్వరగా విడుదల అయింది. దరఖాస్తు ప్రక్రియ గత నెల 25 నుంచే ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసేకొనే అవకాశం కల్పించారు. రెండు ఇంటర్ కళాశాలలు టీటీడీ పరిధిలో ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ఉన్నాయి. ఇందులో పద్మావతి జూనియర్ కళాశాలో బాలికలకే అడ్మిషన్లు ఇస్తారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో బాలబాలికలకు ఇరువురికి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో 9 గ్రూపుల్లో 968 సీట్లు అందుబాటులో ఉన్నా యి. అడ్మిషన్ పొందిన వారిలో 450 మందికి హాస్టల్ వసతి కల్పిస్తారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో 12 గ్రూపుల్లో 792 సీట్లు ఉన్నాయి. అడ్మిషన్ పొందిన వారిలో 350 మందికి హాస్టల్ వసతి ఉం ది. 20 కిమీ కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చిన వారికి మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తారు. పదవ తరగతిలో సాధిం చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం తక్కువగా ఉన్న వారి పిల్లలకు సైన్స్ కోర్సులకు 946 రూపాయలు, ఆర్ట్స్ గ్రూపులకు 394 రూపాయలు చెల్లించాలి. డిగ్రీ కళాశాలలకు.. టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అందుబాటులో ఉన్నాయి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో 26 గ్రూపుల్లో 1295 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 900 హాస్టల్ సీట్లు ఉన్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 22 గ్రూపుల్లో 1177 సీట్లు ఉన్నాయి. కళాశాలలో చేరిన వారిలో 600 మందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో 17 గ్రూపుల్లో 870 సీట్లు ఉన్నాయి. కళాశాలలో చేరిన వారిలో 400 మందికి మాత్రమే హాస్టల్ వసతి ఉంది. ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 1,625 రూపాయలు ఫీజు రూపంలో చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే విధానం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చేరదలచిన వారు admission.tirumala.org బ్సైట్లో దరఖాస్తు చేయాలి.ఇంటర్,కోర్సులకు కావాల్సిన ∙ఆప్షన్లు ఇచ్చుకోవాలి. తమ వివరాలతోపాటు, కావాల్సిన కళాశాల, కోర్సులకు ఆప్షన ్లు ఇచుకోవాలి. విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చుకున్న ఆప్షన్ల మేరకు మెరిట్ ప్రకారం దరఖాస్తు తుది గడువు తర్వాత సీటు కేటాయిస్తారు. దరఖాస్తు తుది గడువును ఈ నెల 25గా ప్రకటించారు. ప్రతిభకే పట్టం ఈ విద్యా సంస్థల్లో ప్రతిభ కల్గిన విద్యార్థులకే అడ్మిషన్ అవకాశం ఉంది. 2015–16 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించే వారు. అయితే ఈ యేడాది కొత్త విధానం తీసుకొచ్చారు. ఎంసెట్ తరహాలో విద్యార్థులు తాము కోరుకుంటున్న కళాశాల, గ్రూపులను ఆప్షన్లుగా ఇచ్చుకోవాలి. వీరు ఇచ్చుకున్న ఆప్షన్ల ఆధారంగా తుది గడువు ముగిశాక, సీట్లను కేటాయించి విద్యార్థులకు ఎస్ఎంఎస్ పంపుతారు. ఎస్ఎంఎస్ అందుకున్న విద్యార్థులు సంబంధిత కళాశాలకు వెళ్లి తమ సర్టిఫికెట్లు చూపించి అడ్మిషన్ పొందవచ్చు. -
గుర్తుకొస్తున్నాయి..
సనత్నగర్: రోజా..ఓ ఎమ్మెల్యే, సినీ నటి, మాలినీ కృష్ణమూర్తి..ఓ ఐపీఎస్ అధికారి, మృదుల..ఓ సామాజిక చైతన్య రథసారథి, మల్లిక...ఓ జాయింట్ డైరెక్టర్ (డీజీపీ కార్యాలయం తెలంగాణ), నాగమణి..ఓ సైంటిస్ట్, స్వర్ణలత...ఓ పారిశ్రామికవేత్త, మాధవి..ఓ గృహిణి...ఇలా ఆకాశంలో సగం...అవనిలో సగం అన్న మాటను అక్షరాల నిజం చేసిన శ్రీపద్మావతి ఉమెన్స్ కాలేజ్ (తిరుపతి) పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. బేగంపేటలోని తాజ్వివంతా హోటల్ ఇందుకు వేదికైంది. 1964 బ్యాచ్ నుంచి మొదలుకొని 2,000 బ్యాచ్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ఆనందంగా సాగింది.ఒకరికొకరు చూసి పోల్చుపోలేకపోయినా శ్రీపద్మావతి ఉమెన్స్ కళాశాల (ఎస్పీడబ్ల్యూసీ) కళాశాల అందించిన జ్ఞాపకాల పూదోటలో విహరించి తరించారు. ఆనాటి మధు ర స్మృతులను నెమరువేసుకున్నారు. ఒక్కసారి చిన్న పిల్లలుగా మారి తాము చేసిన అల్లరి, చిలిపిచేష్టలను గుర్తుచేసుకుని ఆనందంలో ముగినిపో యారు. దాదాపు 40, 50 ఏళ్ళ తరువాత కలుసుకున్న ఎస్పీడబ్ల్యూ కాలేజీ మేట్స్, క్లాస్ మేట్స్, బెంచ్మేట్స్ ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వే గానికి లోనయ్యారు. ఆనాటి అధ్యాపకులు తమ పట్ల చూపిన అభిమానానికి ఆ పూర్వ విద్యార్థలు సలాం కొట్టి ఘనంగా సత్కరించుకున్నారు. ఆ ఇద్దరి చొరవతో... ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన కమలామీనన్, జువాలజీ లెక్చర్గా పనిచేసిన హేమావతిలు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్వ విద్యార్ధులను కలిపారు. దాదాపు నెల రోజుల పాటు ఇందుకు కసరత్తు చేశారు. కొంతమంది పూర్వ విద్యార్ధుల సహాయంతో ఫేజ్బుక్, ఫోన్ నెంబర్ల ఆధారంగా హైదరాబాద్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులను సంప్రదించి ఒక్క చోట కలవడంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది జులై 29న తిరుపతిలో మొట్టమొదటి అలుమ్నీ మీట్గా జరగగా ఇది రెండోది. తమ పూర్వ విద్యార్ధులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ వారి నుంచి ఏమాత్రం ఆశించకుండా సొంత ఖర్చుతో తామే అన్నీ అయ్యి ఈ అపూర్వ కలయిక జరపడం గమనార్హం. జ్ఞాపకాల దొంతరలతో పులకింత... ఎస్పీడబ్ల్యూ కళాళాల పూర్వ విద్యార్ధుల కలయితో తాజ్వివంతా హోటల్ జ్ఞాపకాల దొంతరలతో పులకించిపోయింది. బురుజులతో అంతఃపురాన్ని తలపించే శ్రీదేవి, భూదేవి హాస్టల్స్ భవనాలు...శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ ఆ కొండలపై నుంచి మా కాలేజీ కనిపిస్తోందా? అని తరిచి చూసిన క్షణాలు..అప్పుడే పదో తరగతి పూర్తి చేసుకుని పాఠశాలను దాటి కళాశాలకు వచ్చిన తమకు జీవితమంటే ఏమిటో తెలియజేసిన అధ్యాపకులు కమలా మీనన్ మేడమ్, హేమావతి మేడమ్, శాంతి మేడమ్, కామేశ్వరి మేడమ్, కృష్ణవేణి మేడమ్, విజయలక్ష్మి మేడమ్...ఇలా ఎందరో తమలో స్ఫూర్తి నింపారంటూ ఆ పూర్వ విద్యార్ధులు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఒక్క ఫొటో ఛాన్స్ కోసం తపన.. ఆమె సెలబ్రీటీ కాదు..ప్రజాప్రతినిధి కాదు..పారిశ్రామిక దిగ్గజం కాదు..కానీ అలాంటి వారిని తయారు చేసేందుకు పునాది వేసిన ఎస్పీడబ్ల్యూ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కమలా మీనన్తో ఫోటో దిగేందుకు ఆ విద్యార్ధులు తపించారు. తమ జీవితాలపై ప్రభావం చూపిన గురువుతో ఫోటో ఛాన్స్ కోసం ఆరాటపడ్డారు. క్రమశిక్షణ, జీవిత పాఠాలు, ఆడది సాధించలేనిదంటూ ఉండదని అణువణువూ పట్టుదల, కసిని నింపిన అభిమాన గురువుకు వందనం పలికారు. స్వగతాలతో ప్రత్యేక పుస్తకం... శ్రీపద్మావతి ఉమెన్స్ కళాశాల పూర్వ విద్యార్ధుల అనుభవాలు, అధ్యాపకుల స్వగతాల మేళవింపుతో ప్రత్యేక పుస్తకం రూపకల్పన చేయనున్నారు. చిన్నపిల్లలుగా మారిపోయాం మాది 1989–92 బ్యాచ్. స్నేహితులతో కలిసి ఎంతగా అల్లరి చేసినా కళాశాలలో మేము సైలెంట్. ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థినులకు రక్షణగా మా కళాశాల ముందు ఏకంగా పోలీస్స్టేషన్నే ఏర్పాటుచేశారు. కమలా మేడమ్ ఎంతో ఇన్సిపిరేషన్. ఆమే మాకు రోల్ మోడల్. ఆమె లాగా గ్లామర్గా ఉండాలని, ఆమె లాగా నడుచుకోవాలని తపించేవాళ్లం. ఎక్కడెక్కడో ఉన్న కళాశాల పాత విద్యార్ధులందరినీ ఇలా కలుసుకోవడం నిజంగా గోల్డెన్ మెమరీ.. పెళ్ళయ్యి, పిల్లలు ఉన్న విషయాన్నే మరిచిపోయి ఒక్కసారిగా చిన్న పిల్లలుగా మారిపోయాం. ఇంతమంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే ఆ కళాశాల అధ్యాపకులే కారణం. మా బ్యాచ్ మాత్రం ఎప్పటికీ కళాశాలలో గుర్తుండిపోయే బ్యాచ్. కళాశాల ఆల్బమ్ను చూసే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ చదివిన తాళూరి రమేశ్వరి, మహేశ్వరి సినిమాల్లో ప్రవేశించడం ఆనందంగా ఉంది. వివాహ వ్యవస్థ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో లైఫ్ అండ్ లా ఫౌండేషన్ను నెలకొల్పాను. – రోజా, ఎమ్మెల్యే ఏటా ఇలా కలుసుకోవాలన్నదే మా కాంక్ష గతంలో తిరుపతిలో అలుమ్నీ మీట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్లో చేశాం. ఇలా తరుచూ కలుసుకోవడం ద్వారా ఒకరి భావాలు మరొకరు పంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఎస్పీడబ్ల్యూ కళాశాలలోకి ప్రవేశించిన ప్రతిఒక్క విద్యార్థిని కూడా సమాజంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను దీటుగా తట్టుకునేలా శక్తి సామర్థ్యాలను ఇచ్చాం. అందుకే నేడు ఇంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. గురువుగా అంతకంటే సంతోషం ఏముంటుంది. అయితే ప్రస్తుతం ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ బాధ్యతలు ఒక పురుషునికి ఇవ్వడం సరికాదు. మహిళల సమస్యలు ఒక్క మహిళకే తెలుస్తుంది. మహిళా ప్రిన్సిపల్ను నియమిస్తే బాగుంటుంది. – కమలా మీనన్, పూర్వ ప్రిన్సిపాల్ -
27న మహిళా వర్సిటీ స్నాతకోత్సవం
తిరుపతి: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈనెల 27వ తేదీ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ రత్నకుమారి తెలిపారు. మహిళా యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామన్నారు. ఆమె స్నాతకోపన్యాసం చేస్తారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి హాజరై చాన్సలర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేస్తారన్నారు. ఈ సందర్భంగా 1,948 మందికి వివిధ రకాల డిగ్రీలు ఇస్తున్నామని తెలిపారు. 71 మందికి బంగారు పతకాలు, 13 మందికి బుకే ప్రైజ్లు, 13 మందికి నగదు బహుమతులు, 117 మందికి పీహెచ్డీలు, 986 మందికి పీజీలు, 588 మందికి డిగ్రీలు, 242 మందికి దూరవిద్య డిగ్రీలు, ఎంఫిల్ డిగ్రీలు 15 మందికి ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఎంకాం, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సులు ప్రవేశపెట్టినట్టు వీసీ పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement