breaking news
sportsmens selection
-
జూలైలో ఆర్మీ బీఎస్సీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కంటోన్మెంట్: ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ(బీఎస్సీ)లో క్రీడాకారుల ఎంపిక కోసం తిరుమలగిరిలోని 1ఈఎంఈ సెంటర్ ఆధ్వర్యంలో జూలైలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. జూలై 3 నుంచి 15 వరకు నిర్వహించే ఈ ర్యాలీలో వాలీబాల్, కయాకింగ్, కనోయింగ్ విభాగాల్లో ఎనిమిది నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఆర్మీ పీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొనే వారు 2009 జూలై 3 నుంచి 2015 జూలై 15 మధ్య జన్మించిన వారై కనీసం మూడో తరగతి పూర్తి చేసిన వారై, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కనీస పరిజ్ఞానం ఉండాలి. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆఫీసర్, ఆర్మీ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ స్పెషలిస్ట్ల ధ్రువీకరణ కలిగి ఉండాలి. ఏదేనీ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. శరీరంపై ఎక్కడైనా శాశ్వత టాటూ వేయించుకున్న వారు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులను స్పోర్ట్స్ క్యాడెట్లుగా పరిగణిస్తారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు పదోతరగతి వరకు ఉచిత విద్య అవకాశాలు కల్పిస్తారు. శిక్షణా కాలంలో ఉచిత బీమా, వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారు. వివరాలకు వాట్సాప్ ద్వారా 9398543351 నంబర్లో లేదా తిరుమలగిరిలోని 1 ఈఎంఈ సెంటర్ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ట్రెయినింగ్ బెటాలియన్లో సంప్రదించవచ్చు. -
దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలి
ఏపీటీటీఏ అధ్యక్షుడు భాస్కరరామ్ రంజీ క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు సత్కారం రాజమహేంద్రవరం సిటీ : క్రికెట్లో ప్రతిభ కనబరిచి దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ టేబుల్టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.భాస్కరరామ్ అన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీకాంత్, ఐ.కార్తీక్ రామన్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంజీ టీమ్కు ఎంపికైన నేపథ్యంలో వారిని ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సిటీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. భాస్కరరామ్ మాట్లాడుతూ క్రికెట్ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ బాబు, ఉపాధ్యక్షుడు దివాకర్, సిటీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, గొర్రెల సురేష్, ఏ.రాజ గోపాల్, కోచ్ జీరి హరనాథ్రెడ్డి పాల్గొన్నారు.