breaking news
specialtrains
-
విశాఖ–విల్లుపురం మధ్య సువిధ రైళ్లు
సాక్షి, విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకుని తూర్పు కోస్తా రైల్వే విశాఖపట్నం–విల్లుపురంల మధ్య సువిధ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనుంది. అక్టోబర్ 3 నుంచి నవంబరు 15 వరకు వారానికి మూడుసార్లు చొప్పున తిరగనున్నాయి. రైలు నంబర్ 82853తో అక్టోబర్ 3 నుంచి నవంబర్ 11 వరకు విశాఖ–విల్లుపురంల మధ్య సోమ, బుధ, శనివారాల్లో నడుస్తాయి. ఈ రైలు విశాఖలో రాత్రి 11 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 3.30 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 82854 నంబరుతో విల్లుపురం–విశాఖపట్నంల మధ్య మంగళ, గురు, ఆదివారాల్లో అక్టోబరు 4 నుంచి ఈ సువిధ రైళ్లు బయలుదేరతాయి. అక్టోబరు 4 నుంచి 15 వరకు రాత్రి 8.30కి బయలుదేరి మర్నాడు సాయంత్రం 3.15కి విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు స్టేషన్లలో ఆగుతాయి. ఈ సువిధ రైలుకు సెకండ్ ఏసీ–1, థర్డ్ ఏసీ–3, స్లీపర్–7, సాధారణ భోగీలు–4, లగేజీ–2 వెరసి 16 బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ కోరారు. -
దసరాకు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : దసరా సమయంలో ప్రయాణికుల రద్దీ దష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు ఈస్టుకోస్టు రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. విశాఖపట్నం–తిరుపతి–విశాఖ వీక్లీ సువిధ స్పెషల్(82851/52) ఈ రైలు విశాఖపట్నంలో (82851) అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 వరకు గల అన్ని సోమవారాల్లో రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 01.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (82852) తిరుపతిలో అక్టోబర్ 4 నుంచి నవంబర్ 15 వరకు గల అన్ని మంగళవారాల్లో మధ్యాహ్నం 03.30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఓ సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ల సామర్థ్యమున్న ఈ జత రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు,విజయవాడ, న్యూగుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విశాఖ–సికింద్రాబాద్–విశాఖ వీక్లీ స్పెషల్(08501/02) ఈ రైలు విశాఖలో (08501) అక్టోబర్ 4 నుంచి నవంబర్ 15 వరకు అన్ని మంగళవారాల్లో రాత్రి 11 గంటల కు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08502) అక్టోబర్ 5 నుంచి నవంబర్ 16 వరకు గల అన్ని బుధ వారాల్లో సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 04.30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 04.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఓ సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 6 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ల సామర్థ్యమున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.