breaking news
speaks
-
కోహ్లి కన్నీళ్లు పెట్టిన వేళ డ్యుప్లెసిస్ వ్యాఖ్యలు
-
బడ్జెట్పై రామ్దేవ్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2018 పై ప్రముఖ యోగా గురు రామ్దేవ్ స్పందించారు. సామన్యులకు ఆదాయ పన్ను మినహాయింపు లేకపోవడంపై ఆయన నిరాశను వ్యక్తం చేశారు. ఈ పరిమితిని రూ. 5లక్షలకు పెంచితే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సగటు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాల్సిందని పేర్కొన్నారు. ముఖ్యంగా దీని వల్ల రాబోయే ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితం ఉండేదని చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం కచ్చితంగా తీసుకుంటుందనే ధీమాను బాబా రాందేవ్ వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇది జాతి నిర్మాణ బడ్జెట్ అంటూ ప్రశంసించారు. ఆదాయం పన్నురేట్లు , స్లాబ్లలో ఎలాంటిమార్పులు చేయకుండా యధాతథంగా ఉంచటంతో పాటు, ఉద్యోగులు, పెన్షనర్ల కు స్టాండర్డ్ డిడక్షన్(రవాణా, మెడికల్ ఖర్చులు ) సౌలభ్యాన్ని రూ. 40వేలకు కల్పించారు. అలాగే సీనియర్ పౌరులకు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు, ఆరోగ్య భీమా ప్రీమియం , క్లిష్టమైన అనారోగ్యం ఖర్చు నుంచి రూ.50వేల మినహాయింపును ఈ బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. -
మరాఠీలో మాట్లాడిన స్మీత్
-
దేశంలో న్యాయపాలన సాగుతుందా ?
-
అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడం..శవాలమీద చిల్లర..
-
రాహుల్గాంధీపై వ్యంగ్యాస్త్రాలు
-
ప్రభుత్వం 'గ్రౌండ్ వాటర్' టేబుల్ను పెంచాలి
-
రణభీర్కు మాస్ ఇమేజ్ లేదంటున్న ఖల్ నాయక్
-
నల్లధనం వెలికితీసే చర్యలను సమర్థిస్త్తాం
-
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే లోక్ మంథన్
-
రూ.2000 నోటుపై ప్రజల అభిప్రాయాలు
-
పెద్ద నోట్ల రద్దుపై రాందేవ్ బాబా..
-
హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దాలి
-
చంద్రబాబు పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదు
-
నవంబర్ నుంచి ఏసీ మినీ బస్సులు
-
ఉగ్ర పైశాచికం
♦ ఢాకా రెస్టారెంట్లో ముష్కరుల మారణకాండ ♦ 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ఆష్ఫాక్ చౌదురి తెలిపారు. వీదేశీ బందీలను.. మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు. ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పది గంటల తర్వాత సైనిక చర్య... శుక్రవారం రాత్రి రెస్టారెంట్ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు. ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్లైన్లో ఉంచింది. బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి... బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి. దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు. ఖురాన్ చెప్పలేదని హింస బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి సంజీవ్జైన్తో మాట్లాడానన్నారు. ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది. -
ఢాకా దాడిని ఖండించిన మోదీ..
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం ఢాకాలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐసిస్ ముష్కరులు జరిపిన దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోదీ... గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఢాకాదాడులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై తెలుసుకున్న ఆయన.. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన పలు ట్వీట్లు చేశారు. ఢాకా దాడులు ఎంతో బాధను కలిగించాయని, ప్రధాని షేక్ హసీనాతోనూ, ఇతర అధికారులతోనూ మాట్లాడినట్లు తన ట్వీట్స్ లో తెలిపిన మోదీ.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లాంటి బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధృఢంగా ఉండాలని మోదీ సూచించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కేఫ్ లో బంధించి, ఇస్టామిక్ స్టేట్ తీవ్ర వాదులు దారుణంగా చంపేసిన 20 మందిలో భారతదేశానికి చెందిన బాలిక తరుషి జైన్ కూడ ఉన్నట్లు విదేంశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ తో ఫోన్ లో మాట్లాడిన కన్హయ్య
న్యూ ఢిల్లీః ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ నాయకుడు కన్హయ్య ఫోన్ లో సంభాషించారు. ముందుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన కన్హయ్య వీలు కుదరకపోవడంతో ఫోన్ లోనే మాట్లాడారని సీపీఐ నాయకుడు డి రాజా తెలిపారు. అయితే విద్యార్థి కార్యకర్త అపరాజితతో కలసి రాజా ముఖ్యమంత్రిని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. తన కుమార్తె... జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి కార్యకర్త అపరాజిత తో సహా.. రాజా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ముఖ్యమంత్రిని కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కన్హయ్య ట్రాఫిక్ జామ్ కారణంతో రాలేకపోయాడని, ముఖ్యమంత్రితో టెలిఫోన్ లో సంభాషించాడని తెలిపారు. బహుశా తిరిగి శనివారం వారిద్దరూ కలిసే అవకాశం ఉందని కూడ వెల్లడించారు. అయితే అపరాజిత ముఖ్యమంత్రిని కలిసేందుకు నా కుమార్తెగా రాలేదని, జెఎన్ యు విద్యార్థి కార్యకర్తగా, దేశద్రోహం కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్ కు మద్దతుదారుగా వచ్చిందని రాజా తెలిపారు. కన్హయ్య కుమార్, అపరాజితలు ఇద్దరూ సీపీఐ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ ఎఫ్) సభ్యులే. కాగా కన్హైయా కుమార్ విషయంలో సీపీఐకి ఏవైనా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయా అన్న విలేకరుల ప్రశ్నకు రాజా అటువంటివేమీ లేవని సమాధానం ఇచ్చారు. -
విద్యార్థులకు సంఘీభావం తెలిపిన సిపిఐ నేత ’సురవరం’
-
ప్రభుత్వ ఏర్పాటు పై 'ఫరూక్ అబ్దుల్లా'
-
ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య అవగహన
-
ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు
-
వరంగల్ ఉపఎన్నికపై రాహుల్ను కలిసిన ఉత్తమ్కుమార్
-
తొమ్మిదేళ్లలో బాబు తెచ్చిన పరిశ్రమలెన్ని? : అంబటి
-
కళ్యాణ లక్ష్మి పధకం పై అసెంబ్లీలో చర్చ
-
ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నాట్లు భారత్ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ రోజు ఆయన ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జీ20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్య భావనలో ఐక్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. భారతీయ యువత మార్పు కోరుకుంటోందన్నారు.30 ఏళ్ల తర్వాత భారత్లో స్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలి అన్నారు. -
దేవాదాయ శాఖలో రిజర్వేషన్ల పై చర్చ
-
విభజన సరికాదు..CWCని కాదనలేం-మణియప్ప
-
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం
-
ఆమర్నాత్ రెడ్డి మీడియా సమావేశం
-
మైసూరారెడ్డి మీడియా సమావేశం
-
గట్టు రామచంద్రరావు మీడియా సమావేశం 20th july 2013