-
శాంతిభద్రలపై ఎస్పీ ఆరా
- నగరంలో ఆకస్మిక తనిఖీ - సీఐ, ఎస్ఐలకు తెలియకుండా సుడిగాలి పర్యటన - పోలీసు గస్తీ విధులపై ఆరా కర్నూలు: ఏమమ్మా.. మీ కాలనీల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారా... డయల్ 100కు ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారా... మహిళా వేధింపులు, గొలుసు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు వంటి వాటిపై క్యూఆర్టీకి ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా... ఉదయం పూట వాకింగ్కు వెళ్లడానికి మహిళలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా... అంటూ ఎస్పీ ఆకె రవికృష్ణ ఆరా తీశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నగరంలోని పలు కాలనీల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వాకింగ్కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసు నగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తుండటంతో పలు చోట్ల వాకింగ్కు వెళ్లే మహిళలు, పురుషులను నిలిపి నగరంలో శాంతి భద్రతలప ఆరా తీశారు. శివారు ప్రాంతాలు లేబర్ కాలనీ, బాలజీనగర్, మమతానగర్, రామలింగేశ్వరనగర్, వెంకటరమణ కాలనీ, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండు ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలపై ఆరా తీశారు. బీట్ పోలీసులు గస్తీ తిరుగుతున్నారా... సీఐలు, ఎస్ఐలు కాలనీల్లో పర్యటిస్తున్నారా... అంటూ ఆరా తీశారు. కొత్త బస్టాండు దగ్గర రోడ్డుకు అడ్డంగా ఆటోలు నిలపడంతో డ్రైవర్లపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఆటోలను నిలుపుకోవాలని వారికి సూచించారు. రౌడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారా.. అని ఆరా తీశారు. మద్యం బాబుల ఆగడాలను వేగలేకపోతున్నాం: మద్యం బాబుల ఆగడాలను వేగలేకపోతున్నాం. ఉదయం 7 గంటలకే మద్యం వ్యాపారులు దుకాణాలను తెరుస్తుండటంతో మద్యం బాబులు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. ముందు సైడు షెట్టర్లు మూసి, వెనుకసైడు నుంచి పగలు, రాత్రి తేడా లేకండా మద్యం వ్యాపారాలు కొనసాగిస్తున్నారని బళ్లారి చౌరస్తా ప్రాంతంలో పలువురు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రోజురోజుకు ఆటోల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో శివారు కాలనీల్లో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోయాయని, జాతీయ రహదారికి ఇరువైపులా కూర్చొని మద్యం సేవిస్తుండటంతో నడుచుకుంటూ వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉందని మహిళలు ఫిర్యాదు చేశారు. పాఠశాల మైదానాలు, కేసీ కెనాల్ గట్టుపైన, ఫ్లై ఓవర్ బ్రిడ్జీలపైన మద్యం బాబులు తిష్ట వేసి అర్థరాత్రి వరకు అల్లర్లు చేస్తున్నారని కొంతమంది వాకర్లు ఫిర్యాదు చేశారు. పోలీసు గస్తీ మరింత పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని, సమస్యలు ఏమైనా ఉంటే తనకు గానీ, స్థానిక పోలీసులకు కానీ, డయల్ 100కు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ ఆదేశించారు. శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలపై స్టేషన్లకు వెళ్లినపుడు పోలీసు అధికారులు స్పందిస్తున్నారా.. లేదా అంటూ ఆరా తీశారు. కొంతమంది ఎస్ఐల పనితీరుపై మహిళలు తీవ్రంగా ఫిర్యాదు చేశారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారికే అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. -
ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు
- జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాణ్యం: ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. పాణ్యం సమీపంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలను బుధవారం ఆయన సందర్శింశారు. ఐటీ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై కళాశాల యాజమాన్యాన్ని విచారించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కళాశాలలో ఫిర్యాదుల పెట్టెలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచారని.. వీటిని గోప్యంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలిని సూచించారు. హాస్టళ్లలో ప్రతిగదిలో, బహిరంగ స్థలాల్లో పోలీస్ హెల్పలైన్ నంబర్లు రాయాలని తెలిపారు. అక్కడున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్తో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, ఉషారాణి ఘటన ఎంతో బాధ కల్గించిందన్నారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఉషారాణి మృతికి నివాళులర్పించారు. కేసును ప్రభుత్వం సీబీసీఐడికి అప్పగించినందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఎస్పీ వెంట నంద్యాల డీఎస్పీ హరినాథ్రెడ్డి తదితరులు ఉన్నారు. ర్యాగింగ్కు పాల్పడిన వారినికి కఠినమైన శిక్ష విధించాలని ఎపీఎస్ఎప్ నాయకులు డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement