breaking news
SP m.srinivas
-
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
► ఎస్పీ ఎం.శ్రీనివాస్ ► ప్రజాఫిర్యాదుల విభాగంలో అర్జీల స్వీకరణ ఆదిలాబాద్ : పోలీస్స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎనిమిది మంది ఎస్పీకి అర్జీలు అందజేశారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా పోలీసులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ముందంజలో ఉండాలన్నారు. గ్రామాలను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వేసవి రావడంతో రాత్రి సమయంలో గస్తీ నిర్వహించే పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి ఆర్థిక నేరాలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. అదనపు ఎస్పీ పనసారెడ్డి, ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజీ చౌహాన్, జైస్వాల్ కవిత, స్పెషల్ బ్రాంచి ఇన్ స్పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ఉల్హక్, జి.రామన్న, ఎంఏ హకీం, సీసీ పోతరాజు, కార్యాలయ అధికారులు పుష్పరాజ్, జె.భారతి ఉన్నారు. -
అధునాతన పద్ధతిలో కానిస్టేబుళ్లకు శిక్షణ
జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ ఆదిలాబాద్ : పోలీసు కానిస్టేబుళ్లకు అధునాతన పద్ధతిలో ఇవ్వనున్నట్లు ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పోలీసు హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శిక్షణ కేంద్రంలోని ఇండోర్, ఔట్డోర్ ఫ్యాకల్టీ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పోలీసు శిక్షణ కేంద్రంలో 9 నెలల శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఎంపికైన నాలుగు జిల్లాల అధికారులు జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు. వీరు అంబర్పేట్లోని ప్రధాన శిక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారని పేర్కొన్నారు. మైదానంలో పరేడ్ శిక్షణ ఇచ్చే అధికారుల్లో ఆర్ఐ–1, ఏఆర్ ఎస్సై 4, ఏఆర్ హెడ్కానిస్టేబుళ్ల 27, సివిల్ ఎస్సైలు 4, హెడ్కానిస్టేబుళ్లు 12 మంది ఉంటారని తెలిపారు. ప్రిన్సిపల్గా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, వైస్ ప్రిన్సిపల్గా కె.సీతారాములు ఉంటారని పేర్కొన్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ వృత్తి ఎంతో కీలకమని అన్నారు. ఫ్యాకల్టీ అధికారులకు స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో డీఎస్పీ సమక్షంలో పరేడ్ శిక్షణ చేయిస్తూ రాబోయే శిక్షణ కార్యక్రమానికి సన్నద్ధం కావాలని సూచించారు. సివిల్ ఎస్సైలు చట్టంలోని భారతీయ శిక్షా స్మృతి, సాక్షాధారాలు, చట్టం పరిపాలన తదితర అంశాలపై రోజు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సరైన సామర్థ్యం చూపిన వారికి ప్రశంస పత్రాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా శిక్షణ సమయంలోనే కానిస్టేబుళ్లకు ల్యాప్టాప్లు అందించి కంప్యూటర్ పరిజ్ఞాణంతో ఆధునికంగా సిద్ధం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీ కె.సీతారాములు, ఆర్ఐ బి.జెమ్స్, ఎస్.సురేంద్ర, ఎస్సైలు గంగాధర్ విష్ణు ప్రకాష్, సక్రీయనాయక్, ఏఆర్ ఎస్సైలు హబీబ్ బేగ్ పాల్గొన్నారు.