-
ఖతార్లో సాక్షి దినపత్రిక 'గల్ఫ్ జిందగీ' సావనీర్
ఖతార్: ఖతార్ లోని సిటీ సెంటర్ రొటానా హోటల్లో బసచేసిన తెలంగాణ వలస కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్లను బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఇ) సంస్థకు ఖతార్లో కమ్యూనిటీ లైజన్ ఆఫీసర్ (ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్) గా పనిచేస్తున్న మార్కోపోలో ఫెర్రర్ మర్యాదపూర్వకంగా సోమవారం కలుసుకున్నారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు వలసలపై ఆసియా-గల్ఫ్ దేశాల చర్చల సమావేశానికి హాజరవడానికి స్వదేశ్ పరికిపండ్ల ఒకరోజు ముందు ఖతార్కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వదేశ్ పరికిపండ్ల వద్ద ఉన్న సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ను చూసి సంతోసం వ్యక్తం చేశారు మార్కో పోలో. తెలుగు రాకపోయినా 88 పేజీల పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని ఫోటోల ద్వారా గల్ఫ్ వలసల గురించి సమాచారం ఉన్న పుస్తకం అని గమనించారు. దీంతో వివరాలను ఇంగ్లీష్లోకి అనువాదం చేసి అతనికి స్వదేశ్ వివరించాడు. దాదాపు గంటన్నర సేపు ముఖ్య కథనాల సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా వినడమేకాదు, ఈ సావనీర్ను ఇంగ్లీష్లోకి అనువదించి ఒక పుస్తక రూపంలో వేయాలని మార్కో పోలో సూచించడం విశేషం. 'గల్ఫ్ జిందగీ' సావనీర్ గురించి... గల్ఫ్ వలసలు - అభివృద్ధి, కష్టాలు, సుఖాలు, హక్కులు, జీవితాలపై, సమాజంపై, ప్రభుత్వాలపై చూపించే ప్రభావం, ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం సాక్షి జిల్లా పేజీల్లో 'గల్ఫ్ జిందగీ' ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన 'గల్ఫ్ జిందగీ' పేజీ 22 నెలలుగా సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా ప్రచురితమైన అన్ని పేజీలను కూర్పు చేసి ఒక సావనీర్ గా రూపొందించారు. వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు 'గల్ఫ్ జిందగీ' వారధిలా ఉపయోగపడుతూ సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఒక భరోసానిస్తూ ముందుకెళ్లింది. మొదట్లో ప్రతీ శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరికమేరకు 15 జూన్ 2018 నుండి గల్ఫ్ దేశాలలో సెలవుదినం అయిన శుక్రవారానికి మార్చారు. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి కుటుంబాల జీవనంపై కథనాలు ఇచ్చారు. ఇవే కాకుండా గల్ఫ్లో కష్టాలను జయించి మెరుగైన జీవితం గడుపుతున్న కార్మికుల సక్సెస్పై కూడా ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించారు. 'గల్ఫ్ జిందగీ' పేజీకి కావలసిన సమాచార సేకరణలో సహకరించిన 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' సభ్య సంస్థ 'ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం' అధ్యక్షులు మంద భీంరెడ్డి గారికి కృతఙ్ఞతలు అని ఎడిటర్ సావనీర్ ముందు మాటలో రాశారు. అద్భుతమైన కథనాలు అందించిన సాక్షి గల్ఫ్ డెస్క్, విలేఖరుల బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ గల్ఫ్ వలసల చరిత్రలో ఈ 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ఆవిష్కరణ గుర్తుండిపోయే ఘట్టంగి నిలిచిపోయింది. సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. (https://www.sakshi.com/sites/default/files/article_images/2019/10/4/gulf_book.pdf -
పర్యాటకులను జైలు పాలు చేసిన ఇసుక
రోమ్: విహార యాత్ర నిమిత్తం ఎక్కడికైనా వెళ్తే అక్కడ దొరికే వస్తువులను గుర్తుగా మనతో పాటు తెచ్చుకుంటాం. అయితే ఇలా చేసినందుకు ప్రస్తుతం ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులు జైలు పాలయ్యారు. అయితే వారు తీసుకున్న వస్తువులు బాగా ఖరీదైనవో.. లేక డబ్బు చెల్లించకుండా తీసుకున్నవో కాదు. సముద్రపు ఒడ్డున దొరికే ఇసుకను తీసుకున్నందుకు ఇటలీ ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్ చేసింది. వివరాలు.. ఇద్దరు ఫ్రెంచ్ యువకులు పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. అక్కడ చియా బీచ్లో పర్యటించారు. ఈ సందర్భంగా గుర్తుగా ఉంటుందని భావించి కొద్దిగా ఇసుకను తమతో తెచ్చుకున్నారు. అయితే ఈ ఇసుకనే తమను కటకటల పాలు చేస్తుందని ఆ క్షణనా వారికి తెలియదు. తిరుగు ప్రయాణంలో విమాన సిబ్బంది వీరి దగ్గర ఇసుక ఉండటం గమనించింది. దాంతో వారి మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే తాము చేసిన తప్పేంటో తెలియక ఆ పర్యాటకులు బిక్కమొహం వేశారు. అధికారులను అడిగారు. అందుకు అధికారులు బదులిస్తూ.. ‘2017లో ఇటలీలో చేసిన ఓ చట్టం ప్రకారం పర్యాటకులు ఇసుక, గుండ్లు, రాళ్లు వంటి వాటిని తమతో తీసుకెళ్లడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఇటలీ ప్రభుత్వం 1-6ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తుంది. మీరు ఇసుక తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశాం’ అని తెలపడంతో ఆశ్చర్యపోవడం సదరు పర్యాటకుల వంతయ్యింది. తెలియక చేశాం.. మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అంటూ ఆ పర్యాటకులు అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘టూరిస్ట్లు స్మారక చిహ్నం అంటూ మా దేశ పర్యటక ప్రదేశాల నుంచి టన్నుల కొద్ది ఇసుక, రాళ్లు, గుండ్లను తీసుకెళ్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడం కోసం ఇంత కఠిన చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. దీన్ని గమనించి పర్యాటకులు మా దేశ చట్టాలను గౌరవిస్తే మంచిద’ని వారు తెలిపారు. -
పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పిల్లల వైద్యుల (పీడియాట్రిక్) రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నీలి రాంచందర్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పిల్లల వైద్యుల రాష్ట్ర స్థాయి రెండో సదస్సును మెడికల్ కళశాలలోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, సదస్సులో జాతీయ పిల్లల వైద్యల నిపుణులు పాల్గొంటారన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే గణేష్గుప్త, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మేయర్ సుజాత పాల్గొంటారన్నారు.విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆజ్జ శ్రీనివాస్, సత్యకుమారస్వామి, ఆనంద్, దీపక్రాథోడ్, విశాల్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement