breaking news
society land
-
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి ఊరట దక్కింది. గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది.ప్రస్తుత సీఎం 2016లో అప్పటి మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలో ఐటీ హబ్గా పేరొందిన గచ్చీబౌలీకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపల్లీలో 31 ఎకరాల హౌసింగ్ సొసైటీ భూమూల్ని ఆక్రమించుకునేందుకు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డితో పాటు అతని అనుచరులు ప్రయత్నించారంటూ ఫిర్యాదులందాయి.ఆ ఫిర్యాదుల్లో రేవంత్రెడ్డి, అతని సోదరుడు,అనుచురులు ఎలాంటి హక్కులు, అనుమతులు లేకుండా వివాదాస్పద సొసైటీ భూముల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ సభ్యుల్ని బెదిరించడం, భూములతో సంబంధం ఉన్నవారిని దూషించారంటూ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చీబౌలీ పోలీసులు రేవంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూముల వివాదానికి సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. హైకోర్టు విచారణ చేపట్టింది. సొసైటీ భూముల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని రేవంత్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అదే కేసులో 2019లో కోర్టులో రేవంత్ మరో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ విచారణ నిలిపివేయాలని కోరుతూ రేవంత్ వాదనలు వినిపించారు. రేవంత్ తరుపు వాదనలు విన్న కోర్టు ఎటువంటి అధికారిక అభియోగాలు మోపలేదు. దీనికి ప్రతిస్పందనగా, హౌసింగ్ సొసైటీ తరపు న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సొసైటీ భూముల వివాదంపై రిపోర్టును తయారు చేసి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో 2020లో రేవంత్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సొసైటీ భూముల వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై గత జూన్ 20న విచారణ చేపట్టిన కోర్టు తీర్పును జులై 17కి రిజర్వు చేసింది. ఇవాళ కోర్టులో జరిగిన విచారణలో.. సంఘటనా జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని హైకోర్టు తెలిపింది. ఫిర్యాదు దారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది. -
సొసైటీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
చిలకలూరిపేటటౌన్: యడవల్లి సొసైటీ భూములు ప్రభుత్వం తీసుకోవడాన్ని దళిత రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చేసిన వ్యాఖ్యలపై యడవల్లికి చెందిన రైతులు మండిపడ్డారు. భూముల వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మధును స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా చిలకలూరిపేట పట్టణంలోని అంబేడ్కర్ భవన్కు ర్యాలీగా చేరుకొని సీపీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన పారితోషికం ఇప్పించాలంటూ తాము సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు విన్నవించామని, అది నచ్చని మధు నాటకాలాడొద్దంటూ తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని వివరించారు. గత నెలలో ఎస్సీ కమిషన్ గుంటూరు వచ్చినప్పుడు తాము భూములు ఇస్తామని వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు. 99 శాతం మంది రైతులు భూములు ఇవ్వటానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించి భూములను ప్రభుత్వం తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే భూములు స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇస్తారన్న భరోసాతో ఉన్నామని, ఈ సమయంలో ఏ రాజకీయపార్టీ కూడా జోక్యం చేసుకోవద్దని కోరారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యడవల్లి సొసైటీ భూముల రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ హామీలో భాగంగా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు ముందడుగు వేసిందని, దీన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తమ భూములు స్వాధీనం చేసుకుంటే ప్రతి కుటుంబానికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని వివరించారు. సమావేశంలో ఈపూరి రాంబాబు, పరిశపోగు శ్రీనివాసు, వేల్పుల సాంబయ్య, రమేష్, అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు. -
అమాత్యా.. తగునా
- గగ్గోలు పెడుతున్న సొసైటీ సభ్యులు - వివాదాల్లో ఉన్నా పట్టించుకోని వైనం - ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్ పేరిట మంత్రి శంకుస్థాపన - కలెక్టర్ను అడిగానంటున్న మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు నిబంధనలు మరిచి మరీ సొసైటీ భూమిపై కన్నేశారు. రూ.2 కోట్ల విలువైన 66 సెంట్ల భూమి వివాదాల్లో ఉన్నా ‘ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్’ పేరిట శంకుస్థాపన చేసేశారు. ఆ భూమి ప్రభుత్వానిది కానప్పటికీ.. వివాదాల్లో ఉన్నా.. పనులు కానిచ్చేస్తున్న వైనంపై సొసైటీ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. ఈ అంశం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నరసన్నపేటలో 1948లో ‘ది కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ’ పేరిట 130మందికి సుమారు 16ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పంచాయితీలో 1952లో టౌన్ప్లానింగ్ నుంచి సభ్యులు అనుమతి తెచ్చుకుని ఇందిరానగర్ కాలనీ పేరిట లే అవుట్ వేసుకున్నారు. ప్రస్తుతం 80కుటుంబాలు స్థలంలో ఉంటున్నాయి. పాఠశాల, కళాశాల, దేవాలయం, శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు. ఆ భూములపై తొలినుంచీ కన్నేసిన టీడీపీ అనుచరులు సొసైటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కోర్టుకెళ్లారు. దఫదఫాలుగా విచారణ జరిపి భూమి సొసైటీదేనని అధికారులు ధ్రువీకరించారు. సొసైటీ రికార్డుల పరిశీలన మేరకు కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. తర్వాత అదే ప్రాంతంలో సుమారు 66సెంట్ల ప్రాంతంలో రీడింగ్ రూం, విశ్రాంత గదులు నిర్వహించుకునేందుకు సభ్యులు నిర్ణయించుకున్నారు. దాతలు కూడా అంగీకరించి 16మందికి స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. పార్టీ నిర్మాణాల కోసం మంత్రిని రంగంలోకి దించారు. సీఎం పర్యటన తరువాతే హడావుడి గతేడాది ఆగస్టులో ఇక్కడ సీఎం నరసన్నపేట సందర్శించారు. ఆ సందర్భంలో భారీ పార్క్ నిర్మిస్తామని ఆయన చేత స్థానిక నేతలు హామీ ఇప్పించారు. స్థలం ఖాళీగా ఉందని, తమ ప్రాంతంలో పార్క్ కావాలంటూ స్థానిక ఎమ్మెల్యే ద్వారా సీఎంకు వినతిపత్రం అందించడం, సీఎం పార్క్ హామీ ఇచ్చేయడం తెరవెనుక జరిగిపోయిందని సొసైటీ సభ్యులు భావిస్తున్నారు. రోజురోజుకూ ఆ స్థలానికి విలువ పెరిగిపోతుండడంతో పార్క్ పేరిట టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. 1942లలో జనాభా, సౌకర్యాల ప్రాతిపదికన 5శాతం రిజర్వు స్థలం నిబంధన ఉండేదని, 2001 తరువాత అది 10శాతానికి పెరిగిందని, జిల్లా అధికారులు చెబుతున్నట్టు 40శాతం రిజర్వు అనేది రోడ్లతో కలిపి వ ర్తిస్తుందని, ఈ విషయం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకపోవడం దారుణమని వాదిస్తున్నారు. ఏం చేస్తారో? గతంలో సొసైటీ స్థలంలో హక్కులు పొందిన వారి పేరిట ప్రస్తుతం అదే ప్రాంతంలో ప్రజాసదన్ పేరిట టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రిజర్వుగా ఉన్న స్థలంలో ఎర్రన్న పార్క్పేరిట స్థలాన్ని ఆక్రమించే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. తమ ప్రాంతంలో మంత్రితో శంకుస్థాపన చేయించిన సమయంలో కనీసం సభ్యుల్ని ఆహ్వానించలేదని, ముందస్తు నోటీసులేవీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారా మధ్య నాయకగణం, అధికారుల సమక్షంలో వివాదంలో ఉన్న భూమిలో శంకుస్థాపన చేయడంపై మండిపడ్డారు. కలెక్టర్ను అడిగిన తరువాతే తాను కార్యక్రమం మొదలెట్టానని మంత్రి చెప్పుకురావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ భూముల్లో ఏవేని ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలన్నా, భవనాలు నిర్మించాలన్నా 40శాతం రిజర్వు స్థలం ఉండాలనే నిబంధన మేరకు గతంలోనే ఇక్కడ 40అడుగుల రోడ్డు సహా 16ఎకరాల స్థలంలో 40శాతం అంటే సుమారు ఆరెకరాల్ని రిజర్వుగా ఉంచినట్టు అధికారులకు రికార్డులు కూడా చూంపించామని సభ్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్థానిక పంచాయతీ విస్తరణాధికారి సీహెచ్ ఉమామహేశ్వరరావును వివరణ కోరగా ఈ అంశం తన పరిధిలో లేదని, కలెక్టర్ సహా పెద్దవాళ్లు ఏం చెబితే అది చేయడమే తన విధి అని చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులే కీలక పాత్ర పార్కు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే పీఏ సహా ఓ వైద్యుడిపై అనుమానాలున్నాయి. ప్రజాప్రయోజనాల పేరిట స్థలం తీసేసుకుని తరువాత టీడీపీ ఏదైనా చేయొచ్చు. ఇళ్లు కట్టేయడమో, ఎర్రన్న విగ్రహం ముందు పెట్టి దాని తరువాత క్వార్టర్లు కట్టించేయోడమో జరగొచ్చు. పార్క్ కోసం శంకుస్థాపన అయితే అక్కడ శిలాఫలకాలేవీ? కేవలం సభ్యుల స్థలంపై టీడీపీ కన్నేయడంతోనే ఇలా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ స్థలంలో శంకుస్థాపనా? సొసైటీ అనుమతి పొందకుండానే టీడీపీ నేతలు పార్క్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. 16మంది పొట్టకొట్టాలని చూస్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం కూడా ఆలోచించలేదు. ఇళ్ల నిర్మాణం కోసం దాతలు రిజిస్ట్రేషన్ చేయించిన స్థలంలో కేటాయిస్తే పార్క్ ఎలా కడతారు? టంకాల అర్జున్, బోర్డు సొసైటీ అధ్యక్షుడు. రిజర్వు సైట్లలో ప్లాట్లు ఎలా ఇస్తారు? కో ఆపరేటివ్ సెక్టార్లో రిజర్వు సైట్ పరిధిలో ప్లాట్లు ఎలా విభజించారన్న విషయం మా పరిధిలో ఉంటుంది. మద్రాస్ యాక్ట్ ప్రకారం పరిశీలిస్తున్నాం. రోడ్లతో పాటు 40శాతం రిజర్వు స్థలం ఉండాలి. అందుకనే పార్కు నిర్మిస్తున్నారని భావిస్తున్నాం. సభ్యులు తమకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్నూ కలిశారు. - శ్రీహరి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి.