-
అధికారిక వెబ్సైట్లో మాయమైన స్కోడా సూపర్బ్.. కారణం ఏంటంటే?
Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్సైట్లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
స్కోడా కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: కారును సొంతం చేసుకోవాలని కలలు కంటున్నవారికి సువర్ణావకాశం. డ్రీమ్ కార్ను సొంతం చేసుకునే సమయం ఇది. తొలకరి జల్లుల కంటే ముందే ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివిధ లగ్జరీ మోడళ్ల కార్ల కొనుగోళ్లపై నగదు డిస్కౌంట్, లాయల్టీ బోనస్, క్యాష్బ్యాక్ , బై బ్యాక్ లాంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రాపిడ్, ఆక్టావియా, కొడియాక్ తదితర కార్లపై దాదాపు రూ.1. 75 వరకు భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. అవకాశం మే 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నగదు లాభాలు, లాయల్టీ బోనస్ ఇతర ప్రయోజనాలు రాపిడ్ ( ఆంబిషన్ ఎంటీ డీజిల్, ఆంబిషన్ ఏటీ పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోలు తప్ప) రూ. 50వేల వరకు డిస్కౌంట్ , దీంతోపాటు రూ .25వే లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఆంబిషన్ ఎంటీ డీజిల్ ఆంబిషన్ ఏటీ, పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోల్ మోడల్స్ పై రూ. 25వేల లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు రాపిడ్ మై 2018 రూ .1 లక్ష వరకు డిస్కౌంట్, దీంతోపాటు 10వేల రూపాయల మెయింటినెన్స్ ప్యాకేజీ కూడా లభ్యం. ఆక్టావియా రూ. 50వేల వరకు డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) మరో రూ .50వేల లోయల్టీ బోనస్ సూపర్బ్ మై 2019 రూ .50వేల డిస్కౌంట్ వరకు (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) 3 సంవత్సరాల తర్వాత 57 శాతం బై బ్యాక్ ఆఫర్ సూపర్బ్ మై -2018 కారుపై రూ .1.75 లక్షల డిస్కౌంట్ కోడియాక్ రూ .50వేల డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) రూ .50వేల లోయల్టీ బోనస్. ఈ ఆఫర్లు భారతదేశం అంతటా వర్తిస్తాయి. -
కారు చోరీ కేసులో పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్
హైదరాబాద్ : ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పోలీస్ అధికారి కుమారుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు అనుమానితుల్నికూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు సాగుతున్న డీఎస్పీ కుమారుడు రాహుల్ పై పోలీసులు దృష్టి సారించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్కు చెందిన వ్యాలెట్ పార్కింగ్లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ను పరిశీలించారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాంఅని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
పోలీసుల అదుపులో డీఎస్పీ కుమారుడు
ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఓ డీఎస్పీ కుమారుడితో సహా నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు చేస్తూ విచారిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్కు చెందిన వ్యాలెట్ పార్కింగ్లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ను పరిశీలించారు. ప్రాథమికంగా నలుగురిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. ‘ఆ నలుగురిలో అసలు నిందితుడు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాం. దీనికోసం అనుమానితుల్ని విచారించడంతో పాటు ఫోన్ వ్యవహారాలకు సంబంధించి సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నాం. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement