sinking ship
-
కొచ్చి తీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక
కొచ్చి: కేరళలోని కొచ్చి తీరంలో శనివారం బోల్తాపడిన లైబీరియా కార్గోషిప్ ఆదివారం పూర్తిగా మునిగిపోయినట్లు భారత కోస్ట్ గార్డ్ ప్రకటించింది. నౌకలో 27 మంది సిబ్బంది ఉండగా.. ఇండియన్ కోస్ట్గార్డ్ 24 మందిని రక్షించింది. నేవీ షిప్ ఐఎన్ సుజాత మరో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకలో భారీగా రసాయనాలు ఉన్నాయని, అవి సముద్రంలో లీకై, వేగంగా విస్తరిస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. రసాయనాల లీకేజీని అరికట్టడానికి కోస్ట్గార్డ్ కృషి చేస్తోంది. సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది.. లైబీరియాకు చెందిన ఎమ్ఎస్సీ ఈఎల్ఎస్ఏ 3 శనివారం సాయంత్రం వంగిపోవడంతో ఇండియన్ కోస్ట్గార్డ్కు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కోస్ట్గార్డ్ 24 మంది సిబ్బందిని రక్షించింది. 24 మంది సిబ్బందిలో ఒక రష్యన్ (ది మాస్టర్), 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియన్ జాతీయుడు ఉన్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి ముగ్గురు సీనియర్ సిబ్బంది ఓడలోనే ఉండిపోయారు. అయితే.. ఆదివారం తెల్లవారుజాము సమయానికి అది పూర్తిగా బోల్తా పడటంతో ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ సుజాత ఆ ముగ్గురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు... బోల్తా పడిన ఓడలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 640 ఇతర కంటైనర్లు ఉన్నా యి. వీటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ఆయిల్, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. ఓడ మునిగిపోయిన తరువాత రసాయనాలు లీకయ్యా యి. ఇవి సముద్రపు నీటితో కలిసి అత్యంత ప్రమాదకరమైన ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుందని కోస్ట్గార్డ్ హెచ్చరించింది. మ్యాపింగ్ సాంకేతికతతో చమురు లీకేజీని అంచనా వేస్తున్నారు. లీక్ అయిన ఇంధనం గంటకు దాదాపు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని గుర్తించింది. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కావడంతో.. చము రును విచ్ఛిన్నం చేయడానికి వైమానిక డోరి్నయర్ విమానాలు డిస్పర్సెంట్ను స్ప్రే చేస్తున్నాయి. కేఎస్డీఎంఏ హెచ్చరికలు.. కేరళలోని సముద్ర తీరం జీవవైవిధ్యానికి నిలయం. పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ. ఈ రెండింటికి ఎలాంటి విఘాతం కలగకుండా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) చర్యలు తీసుకుంటోంది. కంటైనర్లు చమురుతో సహా సరుకు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో చమురు పొరలు కనిపించవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒడ్డుకు కొట్టుకువచ్చే కార్గో కంటైనర్లు లేదా చమురును తాకవద్దని సూచించింది. ఒడ్డున కంటైనర్లు లేదా చమురు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రకటించింది. -
మునిగిపోయిన వాణిజ్య నౌక..
పోర్బందర్: అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోవడంతో అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని మన తీర రక్షక దళం(ఐసీజీ) కాపాడింది. మన ప్రాదేశిక జలాల ఆవల చోటుచేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ)సత్వరమే స్పందించి, సహకారం అందించినట్లు ఐసీజీ వెల్లడించింది. ఎంఎస్వీ ఏఐ పిరన్పిర్ అనే వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ఈనెల 2న గుజరాత్లోని పోర్బందర్కు బయలుదేరింది. అయితే, బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో లోపలికి భారీగా నీరు చేరి పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైం రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీనిని ఎంఆర్సీసీ గాందీనగర్లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి చేరవేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ విభాగం ఘటన జరిగిన పీఎంఎస్ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్పిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది. తక్షణమే స్పందించిన పీఎంఎస్ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు, నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి చివరికి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందినీ తీసుకుని, పోర్బందర్కు తరలించింది. పాక్ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఐసీజీ పేర్కొంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో పీఎంఎస్ఏ చూపిన నిబద్ధతను కొనియాడింది. -
కాంగ్రెస్ నౌకకు మాజీ సీఎం రంధ్రం పెట్టారు
బిలాస్పూర్: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నౌక లాంటిదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, చాలామంది నాయకులు ఆ పార్టీ వీడాలని భావిస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా చత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగిన ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు. చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కూడా కాంగ్రెస్ పార్టీ అనే మునిగిపోతున్న నౌకకు ఓ రంధ్రం పెట్టారని రాజ్నాథ్ ఛలోక్తి విసిరారు. కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలోని ఏ శక్తి కూడా రక్షించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టబోతున్నట్టు ఇటీవల అజిత్ జోగి ప్రకటించిన నేపథ్యంలో రాజ్నాథ్ పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి ఉండేదని విమర్శించారు. ప్రస్తుతం మోదీ పాలనలో అవినీతి ఉందని ఒక్కరూ కూడా ఆరోపించలేదని అన్నారు.