-
షార్ట్ టెంపర్కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం
రష్యన్ టెన్నిస్ స్టార్.. ఎనిమిదో సీడ్ డానిల్ మెద్వదెవ్ తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ఆడుతున్న మెద్వదెవ్ మ్యాచ్ సందర్భంగా ఒక అభిమానిపై తిట్ల దండకం అందుకున్నాడు. విషయంలోకి వెళితే.. షార్ట్ టెంపర్కు మారుపేరుగా నిలిచిన మెద్వదెవ్ అప్పటికే రెండు సెట్లలో విజయం సాధించి దూకుడు మీద ఉన్నాడు. ఇక మూడో సెట్లోనూ 5-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న మెద్వదెవ్ సర్వీస్ మిస్ చేశాడు. ఇది గమనించిన ఒక అభిమాని కోర్టులోకి వచ్చి బంతిని మెద్వదెవ్ వైపు విసిరాడు. దీంతో సహనం కోల్పోయిన మెద్వదెవ్ అతనివైపు కోపంగా చూస్తూ రష్యన్ భాషలో బూతు పదం తిట్టాడు. మెద్వదెవ్ చర్య అక్కడి మైక్రోఫోన్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దీంతో చైర్ అంపైర్ మెద్వదెవ్ను మందలించి అభిమానికి క్షమాపణ చెప్పాలని కోరాడు. అంపైర్కు ఏం జవాబివ్వకుండానే మ్యాచ్ను కొనసాగించిన మెద్వదెవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానికి క్షమాపణ చెప్పడం కొసమెరుపు. ఇక మెద్వదెవ్ దురుసుగా ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్ సందర్భంగా అభిమానులతో పాటు చైర్ అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్కు హాజరైన అభిమానులను ఇడియట్స్ అని.. వాళ్లవన్నీ ఖాళీ బ్రెయిన్స్ అని తిట్టిపోశాడు. అటుపై చైర్ అంపైర్ను కూడా దూషించాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలి రౌండ్లో అమెరికాకు చెందిన మార్కోస్ గిరోన్పై 6-0, 6-1, 6-2తో వరుస సెట్లలో కంగుతినిపించిన మెద్వదెవ్ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. చదవండి: సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్కు బిగ్షాక్ -
కమర్షియల్ టెంపర్
నవీన్, షాలినీ చౌహాన్ , శుభాంగి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షార్ట్ టెంపర్’. ప్రవీణా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాఘవ దర్శకత్వంలో ఎన్.ఆర్.ఆర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం హైదరాబాద్లో జరిగింది. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. రైటర్, డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేశాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. హీరోగారు జిమ్లో 8 గంటలు కష్టపడుతున్నారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. కామెడీ టచ్ ఉన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇందులో అలీగారు, ఆదిత్యా ఓమ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. బ్యాంకాక్లో షూట్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘రాఘవగారు కథ చెబుతున్నప్పుడే సినిమా చూసినట్టు అనిపించింది. బాగా డిజైన్ చే శారు’’ అన్నారు నవీన్. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
చింతకొమ్మదిన్నె: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన కడప నగర సమీపంలోని అంగడివీధిలో చోటు చేసుకుంది. కడప రూరల్ సీఐ వెంకటశివారెడ్డి కథనం మేరకు కడప నగర సమీపంలోని అంగడివీధిలో నివాసముంటున్న ఆలుమూరి శ్రీనివాసులు, ఆలుమూరి కమాల్బీలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో క్షణికావేశానికి గురైన భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన కమాల్బీని చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించినట్లు సీఐ వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement