-
శివసేన సర్కారు దూకుడు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించి నప్పటినుంచి రాజుకుంటున్న వివాదం అనేకానేక మలుపులు తిరిగి చివరకు మంగళవారం అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి అరెస్టుకు దారితీసింది. అది జరిగిన మరునాడే నటి కంగనా రనౌత్ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతలు మొదలుపెట్టడం, ముంబై హైకోర్టు ఆదేశాలతో మధ్యలో అవి నిలిచి పోవడం, ఆ విషయంలో శివసేనపై కంగనా విరుచుకుపడటం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగాయి. రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోగానే ఇప్పుడు కంగనా ఇంటి కూల్చివేత వివాదం ఎజెండాలో కొచ్చింది. ఈ రెండు ఉదంతాలూ పరస్పర సంబంధమైనవి కాకపోయివుంటే ఈ కూల్చివేత ఇంత ఆదరా బాదరాగా జరిగేది కాదు. అలాగే ఇంత ప్రముఖంగా చర్చకొచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇంతక్రితం షారుఖ్ ఖాన్, సోనూసూద్ వంటి బాలీవుడ్ ప్రముఖుల నివాసాల్లో సైతం బీఎంసీ అక్రమ నిర్మాణాల పేరిట కొన్నింటిని కూల్చివేసింది. ఇటీవలకాలంలో శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆ పార్టీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. సుశాంత్సింగ్ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చారు. ఇక్కడ జీవనం సాగించాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు. అందుకు జవాబుగా శివసేన సైతం ఆమెపై నోరు పారేసుకుంది. దాంతో తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని వై ప్లస్ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసిన ప్పుడు శివసేన ప్రతీకారం ఏ స్థాయిలో వుంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నందువల్లా, ఆ అధికారాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్లతో పంచుకుంటూన్నందువల్లా ఆ పార్టీ ఈసారి భౌతిక దాడులకు బదులు వాగ్యుద్ధానికి మాత్రమే పరిమితమైంది. కానీ అధికారాన్ని విని యోగించి తన చేతనైంది చేయడానికి సిద్ధపడింది. దాని పర్యవసానమే బుధవారంనాటి కూల్చివేత. కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ మొన్న సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్లో కంగనా జవాబిచ్చారు. ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బుధవారం ఉదయం బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో అది తాత్కాలికంగా నిలిచింది. ముంబై మహానగరంలో అధికారుల కుమ్మక్కు కారణంగా అనేకానేక అక్రమ నిర్మాణాలు బయల్దేరు తున్నాయని, పర్యవసానంగా వర్షాకాలంలో నగరం వరదల్లో చిక్కుకుంటున్నదని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న నిర్మాణాలు నగరంలో నిరుపేదలు, సాధారణ పౌరుల బతుకుల్ని నరకప్రాయం చేస్తున్నాయని వారంటున్నారు. కనుక అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సిందే. కానీ అందుకు తగిన విధివిధానాలు అనుసరించాలి తప్ప ఇష్టానుసారం చేయడం ఎవరూ హర్షించరు. ఇది హఠాత్తుగా చేసింది కాదని...ఆమెకు 2018లోనే నోటీసులిచ్చామని బీఎంసీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు... కానీ దానిపై ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఇచ్చిన నోటీసుకు సైతం కంగనా సిబ్బంది జవాబిచ్చారు. ఆ వెంటనే కూల్చివేత ప్రారంభించాల్సిన అగత్యం ఏమొచ్చిందో బీఎంసీ సంతృప్తికరమైన జవాబివ్వలేక పోతోంది. ఒకపక్క ఆమెకూ, శివసేనకూ మధ్య వివాదం రాజుకుని తారస్థాయికి వెళ్లిన సమయంలో ఇది చోటుచేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది వేధింపుగానే అందరూ భావిస్తారు. ఈ వివాదం మొత్తానికి మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. సుశాంత్ మరణానికి మానసిక ఒత్తిళ్లే కారణమని, ఇలాంటి ఒత్తిళ్లను అయినవాళ్లు సకాలంలో గుర్తించకపోతే బాధితులు ఆత్మహత్య చేసుకునేవరకూ వెళ్తారని చానెళ్ల నిండా నిపుణులు చర్చిస్తున్న సమయంలో కంగనా రనౌత్ రంగ ప్రవేశం చేసి పూర్తి భిన్నమైన కథనం వినిపించారు. బాలీవుడ్లో బంధుప్రీతిని ప్రోత్సహించే మూవీ మాఫియా అతన్ని మృత్యు ఒడిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వున్నదని ఆమె చెప్పారు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. అది చూస్తుండగానే కంగనాకూ, శివసేనకూ... కంగనాకూ, ఇతర బాలీవుడ్ నటీ మణులకూ మధ్య వివాదంగా మారింది. బిహార్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముంబై పోలీసులపై బురద జల్లుతున్నదని, వారి తరఫున కంగనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ ఒక నటి చేసిన వ్యాఖ్యలు సీరియస్గా తీసుకుని, ఆమెపై కక్ష సాధిస్తున్నట్టు కనబడేలా వ్యవహరించడం శివసేన అపరిపక్వతను పట్టిచూపుతుంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. స్థానికుల ఉపాధి కాజేస్తున్నారన్న వంకతో స్థానికేతరులపై ఆ పార్టీ దాడులు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెస్తుంది. లాక్డౌన్ పర్యవసానంగా మన దేశంలో సామాన్యుల జీవనం ఎంత దుర్భరంగా మారిందో కళ్లకు కట్టే కథనాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి జోరు ఇంకా తగ్గలేదు. కానీ మన మీడియా మాత్రం రెండున్నర నెలలుగా బాలీవుడ్ పరిధి దాటి బయటకు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడి జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందరూ దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. -
‘శివసేన సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందస్వామి’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేరును అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఖరారు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శివసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో శివసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని పేర్కొన్నారు. -
అమితాబ్..అరడజను శత్రువులు
అమితాబ్ బచ్చన్ హీరోగా ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ తీసిన రామ్గోపాల్ వర్మ ఆ సినిమాలకు కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘సర్కార్ 3’. తనకెంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో ‘సర్కార్’ ఫ్రాంచైజీలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు వర్మ. అమితాబ్ నటించిన సుభాష్ నాగరే పాత్రను శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో ప్రజెంట్ చేశారు. మూడో చిత్రంలోనూ ఆయన సుభాష్ నాగరేగా కనిపించనున్నారు. ఇక అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యా రాయ్లు ‘సర్కార్ 3’లో నటించడం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ముఖ్యమైన నటీనటుల ఫస్ట్ లుక్స్ను వర్మ విడుదల చేశారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో మెయిన్ విలన్గా నటిస్తున్నారు. చిత్రంలో ఆయన్ను అందరూ ‘సర్’ అని సంభోదిస్తారట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్, మహేశ్బాబులకు నానమ్మగా నటించిన రోహిణీ హట్టంగడి ఈ చిత్రంలో రక్కుబై దేవిగా విలనిజం చూపించనున్నారు. గోరక్ రాంపూర్గా రెండు పార్శ్వాలున్న పాత్రలో భరత్ దభోల్కర్... తన తండ్రి చావుకి కారణమైన సుభాష్ నాగరేపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూసే పాత్రలో హీరోయిన్ యామీ గౌతమ్.. సుభాష్ నాగరే అనుచరుడిగా రోనిత్ రాయ్ నటిస్తున్నారని వర్మ తెలిపారు. అత్యంత క్రూరుడైన శివాజీ అలియాస్ చీకు పాత్రలో యువ నటుడు అమిత్ సాద్ కనిపించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహా పాత్రను మనోజ్ బాజ్పాయ్ చేయనున్నారు. ‘‘కాకపోతే.. ఇది కాస్త వయొలెంట్ వెర్షన్’’ అన్నారు వర్మ. ‘‘మనోజ్ అద్భుతమైన నటుడే కానీ అరవింద్ కేజ్రీవాల్ కంటే నటనలో చాలా చిన్నోడు’’ అని వర్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు. రోనిత్ రాయ్ మినహా వర్మ పరిచయం చేసిన మిగతా ఆరు పాత్రలూ ప్రతినాయక ఛాయలున్నవి కావడం గమనార్హం. సో.. ఇందులో అమితాబ్కు మొత్తం అరడజను మంది విలన్లు ఉంటారన్నమాట. -
త్వరలో ‘మరాఠా’ పేరుతో ఎమ్మెన్నెస్ దినపత్రిక
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రే త్వరలోనే ఓ దిన పత్రికను ప్రారంభించనున్నారు. తానే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించనున్న ఈ పత్రిక పేరు ‘మరాఠా’ అని ఖరారు చేసినట్టు తెలిసింది. గతంలో శివసేన పార్టీ తన వాణిని వినిపించేందుకు ‘మార్మిక్’ అనే వ్యంగ్య చిత్రాల వారపత్రికతోపాటు ‘సామ్నా’ దినపత్రికను కూడా ప్రారంభించింది. ఈ పత్రికలను శివసేన తన ఎదుగుదలతోపాటు ప్రత్యర్థులపై తాము చెప్పదల్చుకున్నది వివరించేందుకు ఉపయోగించుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే రాజ్ ఠాక్రే పత్రిక స్థాపన విషయంలో కూడా ఆయనను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెన్నెస్ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తవుతుండగా, గత సంవత్సరం జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క శాసనసభ స్థానం లభించింది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఇందులో బాగంగా ప్రజల సంక్షేమంతోపాటు వారి సమస్యల కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు , ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమకంటూ ఓ పత్రిక ఉండాలన్న నిర్ణయాలనికి వచ్చారు. మరాఠీ రాజభాష దినోత్సవం సందర్భంగా ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో మంగళవారం బాంద్రాలోని ఎంఐజీ క్లబ్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కోసం ఓ పత్రిక ఉండాల్సిన అవసరాన్ని రాజ్ ఠాక్రే నొక్కి చెప్పినట్టు తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పత్రికను ప్రారంభించాలన్న ఆలోచనతో రాజ్ఠాక్రే ఉన్నట్టు సమాచారం. -
సర్కారులోకి శివసేన
సాక్షి, ముంబై: శివసేన పార్టీని తమతో చేర్చుకుంటామని, త్వరలో ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం వెల్లడించారు. అయితే కూటమిగా ఏర్పడే ముందు ఇరుపార్టీలు మరోసారి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నాయని, అవి శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. శివసేనకు అధికారంలో ఎంత వాటా.. ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహకార మంత్రి చంద్రకాంత్ పాటిల్ లకు అధికారాలిచ్చినట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఇదిలాఉండగా, వచ్చే వారంలో ఫడ్నవిస్ తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. అందుకు ఈ ఆదివారం వరకు శివసేనతో చర్చలు జరిపి పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే ప్రతిపాదనలు పూర్తిచేయనున్నారు. ఫడ్నవిస్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలిసి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వంలో సరైన వాటా కల్పిస్తే ప్రభుత్వంలో చేరేందుకు తమకు అభ్యంతరం లేదని ఉద్ధవ్ వారిద్దరితో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శివసేన లేనిదే రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఫడ్నవిస్ బీజేపీ అధిష్టానానికి వివరించారు. అలాగే చంద్రకాంత్ పాటిల్ కూడా షా కు శివసేన పాత్ర గురించి వివరించారు. స్థిర పాలన అందించాలంటే శివసేనను తమతో చేర్చుకోక తప్పదని షా కు స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య చర్చలకు తిరిగి అవకాశం ఏర్పడింది. ‘పొత్తు’.. వారిష్టం !.. ఎన్సీపీ ముంబై: ప్రభుత్వంలో చేరే విషయంలో శివసేనతో బీజేపీ చర్చలు జరుపుతుందని సీఎం ఫడ్నవిస్ ప్రకటించడంపై ఎన్సీపీ స్పందించింది. ‘మేం ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకే మైనారిటీ బీజేపీ సర్కార్కు బయటనుంచి బేషరతు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాం.. అంతేతప్ప మా సిద్ధాంతాల్లో మార్పు లేదు.. శివసేనను ప్రభుత్వం కలుపుకోవడం ఆ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం.. దాంతో మాకు ఎటువంటి సంబంధం లేదు..’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే వ్యాఖ్యానించారు. త్వరలోనే తమ పార్టీ తరఫున సీఎం ఫడ్నవిస్ను కలిసి రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలని కోరనున్నట్లు తెలిపారు. అలాగే అహ్మద్నగర్ జిల్లా జావ్ఖేడలో జరిగిన మూడు హత్యలపై కూడా ప్రశ్నించనున్నట్లు చెప్పారు. రైతుల కోసం అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే విధాన మండలిలో ప్రతిపక్ష హోదా కోరనున్నట్లు తెలిపారు. మండలిలో 78 స్థానాలకు గాను తమ పార్టీకి 28 మంది సభ్యులున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మండలి అధ్యక్షుడి పదవిని కూడా తమ పార్టీ ఆశిస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 29 వ తేదీ నుంచి రెండు రోజులపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటుచేసేందుకు పార్టీ అధినేత శరద్ పవార్ నిర్ణయించినట్లు చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement