-
హార్ట్ సర్జరీ! బిగ్బాస్ విన్నర్ అభ్యర్థన
ముంబై: హిందీ బిగ్బాస్ 11వ సీజన్ విన్నర్ శిల్పా షిండే బంధువు తృప్తి పటేల్ షిండే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె క్షేమంగా ఉండాలని ప్రార్థించమని శిల్పా అభిమానులను కోరింది. ఈ మేరకు తృప్తితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. "అభిమానులే నా దేవుళ్లు. కష్టసుఖాల్లో నా వెంట నిలబడుతున్న అభిమానులకు కృతజ్ఞతలు. నా దగ్గరి బంధువు తృప్తికి నానావతి ఆస్పత్రిలో హార్జ్ సర్జరీ జరగబోతుంది. ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకోండి" అంటూ ఫ్యాన్స్ను అభ్యర్థించింది. (చదవండి: టీవీ నటుడి రెండో పెళ్లి) ఇదిలా వుంటే శిల్పా.. "బాబీ జీ ఘర్ పర్ హై"లో అనిత బాబీ పాత్రలో ఉత్తమ నటన కనబర్చావంటూ నేహా పెండ్సేను మెచ్చుకుంది. నిజానికి ఆ పాత్రను నటి సౌమ్య టండన్ కొన్నేళ్లుగా చేస్తోంది. అయితే ఈ మధ్యే ఆమె సీరియల్ నుంచి తప్పుకోవడంతో నేహా కొత్తగా ఆ స్థానంలో అడుగుపెట్టింది.. ఇక అదే సీరియల్లో అంగూరి బాబీగా మెప్పించిన శిల్పా సైతం తప్పుకోవడంతో ఆమె స్థానంలో శుభంగి ఆత్రే నటిస్తోంది. శిల్పా లాక్డౌన్లో "గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్" అనే కామెడీ షోలోనూ పాల్గొంది. కానీ అది టీవీలో టెలికాస్ట్ కాకముందే షో నుంచి తప్పుకోవడం గమనార్హం. (చదవండి: స్నేహితుడిని పెళ్లాడిన బాలీవుడ్ సింగర్) View this post on Instagram A post shared by Shilpa Shinde (@shilpa_shinde_official) -
సునీల్ గ్రోవర్పై నటి సంచలన వ్యాఖ్యలు
నటి శిల్పా షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్టార్ భారత్ కొత్త కామెడీ షో ‘గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్’ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ షో ఇంకా టీవీలో టెలికాస్ట్ కాకముందే శిల్పా షిండే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ‘సాస్ బహు ఔర్ బేటియాన్’ నిర్వహించిన ఒక ప్రత్యేక చాట్లో శిల్ప తన నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాక సునీల్ గ్రోవర్ వల్లే తాను ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే.. ఈ షో కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎంతో హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా నన్ను కేవలం బ్యాక్గ్రౌండ్కే పరిమితం చేస్తున్నారు. అంతేకాక కరోనా సమయంలో కూడా మేం రోజుకు 12-15 గంటల పాటు షూటింగ్ చేస్తున్నాము. ఎక్కువ పని గంటలు కష్టపడ్డా కూడా సరైన ప్రతిఫలం లభించడం లేదు’ అన్నారు శిల్పా షిండే. (చదవండి: టీవీలకు అతుక్కుపోయే టైమ్ వచ్చేసింది) అంతేకాక ‘గతంలో మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు దీని గురించి మాట్లాడక తప్పని పరిస్థితి. మా షిఫ్ట్ ప్రతి రోజు ఉదయం 7 గంటలకు మొదలై రాత్రి 11 గంటలకు ముగుస్తుంది. నిర్మాతలు తమ నటులను అర్థం చేసుకోవాలి. మేం పని వాళ్లం కాదు. మీరు నటులను దోపిడీ చేయలేరు’ అన్నారు శిల్పా షిండే. అంతేకాక తాను షో నుంచి తప్పుకోవడానికి సగం కారణం సునీల్ గ్రోవరే అన్నారు శిల్పా షిండే. ఆమె మాట్లాడుతూ.. ‘యాభై శాతం నా సమస్య సునీల్ గ్రోవర్తోనే. ఈ షో ప్రమోషన్లో వారు నా పేరు వాడుకున్నారు. కానీ ప్రోమోలో కేవలం సునీల్ని మాత్రమే చూపిస్తున్నారు. ఇదే కాదు ప్రతి యాక్ట్లో కేవలం సునీల్ని మాత్రమే చూపిస్తున్నారు. మాకు కేవలం ఒక లైన్ మాత్రమే ఇస్తున్నారు. సునీల్కి సూచనలు ఇవ్వడానికి మేం ఇక్కడ లేము’ అన్నారు శిల్పా షిండే. అంతేకాక ఈ షోను కపిల్ శర్మ షోతో పోల్చుతూ.. మరిన్ని ఆరోపణలు చేశారు. (చదవండి: నా కుటుంబానికి ఇది కష్ట కాలం: నటుడు) ‘కపిల్ శర్మ షో చూడండి.. అక్కడ ప్రతి ఒక్కరికి స్పేస్ ఉంటుంది. అందరికి సమాన అవకాశం లభిస్తుంది. ఎవరూ ఖాళీగా నిలబడి ఉండరు. ప్రతి ఒక్కరికి స్వంత గుర్తింపు ఉంటుంది. కానీ ఇక్కడ అంతా సునీల్ గ్రోవరే. అలాంటప్పుడు వారు షో పేరును ‘సునీల్ గ్రోవర్ షో’గా ఎందుకు మార్చకూడదూ’ అంటూ శిల్పా షిండే ప్రశ్నలు కురిపించారు. అంతేకాక తాను తన ఒక్క దాని కోసం మాత్రమే కాక అందరి కోసం మాట్లాడుతున్నాను అన్నారు శిల్పా షిండే. ఇక ఈ ఆరోపణలపై షో నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘పాజీ తప్పేం లేదు.. పాక్ నటుల కోసం నేను పోరాడుతా’
‘పాజీ మాట్లాడిన దానిలో తప్పేం ఉంది. మీరు అనవసరంగా ఆయన మాటలను వక్రీకరుస్తున్నారు’ అంటూ బిగ్బాస్ 11(హిందీ) ఫేం, కాంగ్రెస్ నేత శిల్పా షిండే... తమ పార్టీ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు అండగా నిలిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ‘ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదు.. ఎవరో చేసిన తప్పునకు దేశాన్ని నిందించడం సరికాదు’ అని సిద్ధు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా సిద్ధు తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) ఈ విషయంపై స్పందించిన శిల్పా షిండే మాట్లాడుతూ... ‘ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా. నన్ను ట్రోల్ చేసిన వాళ్లకు బుద్ధి చెప్తా. పుల్వామా దాడిపై స్పందించిన మహిళా జర్నలిస్టులకు కూడా బెదిరింపులు వచ్చాయి. పాజీ(సిద్ధు)కి మద్దతుగా మాట్లాడినందుకు నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. నిజానికి ఇటువంటి వ్యక్తులు కూడా ఉగ్రవాదులే. లష్కర్, జైషే ఉగ్రవాదుల కంటే వీరు చాలా ప్రమాదకరం. అసలు పాజీ అన్నదాంట్లో తప్పేం ఉంది. ఆయన ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వలేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించకుండా ఓ రాజకీయ నాయకుడిగా ఆయన తప్పు చేశారనుకుంటున్నారేమో. కానీ వాళ్లిద్దరు ఏళ్ల తరబడి కలిసి క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాక్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించడాన్ని శిల్పా షిండే తీవ్రంగా తప్పుబట్టారు. ‘ కపిల్ శర్మ షో నుంచి సిద్ధును తొలగించడం, పాకిస్తాన్ నటులపై నిషేధం విధించడానికి నేను పూర్తి వ్యతిరేకం. ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. ప్రతిభ ఉన్న పాకిస్తాన్ నటుల హక్కుల కోసం నేను పోరాడుతా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నిషేధం ఎదుర్కొన్నదాన్నే. అందుకే ఆ బాధ ఏంటో నాకు తెలుసు’ అంటూ శిల్పా షిండే చెప్పుకొచ్చా రు. కాగా టీవీ షో ‘బాబీ జీ ఘర్ పర్ హై’లో అంగూరి బాబీగా ఆదరణ పొందిన శిల్పా బిగ్బాస్ 11 విన్నర్గా నిలిచి మరింత పాపులర్ అయ్యారు. ఇక ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.(కాంగ్రెస్లో చేరిన ప్రముఖ టీవీ నటి) -
కాంగ్రెస్లో చేరిన ప్రముఖ టీవీ నటి
ముంబై : ప్రముఖ టీవీ నటి శిల్పా షిండే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్, సీనియర్ నేత చరణ్ సింగ్ సప్రా సమక్షంలో మంగళవారం ఆమె కాంగ్రెస్లో చేరారు. 1999లో టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన 42 సంవత్సరాల శిల్పా షిండే ప్రముఖ టెలివిజన్ షో బాభీతో గుర్తింపు పొందారు. కాగా, ప్రజల్లో ఆదరణ పొందిన టీవీ షో బాబీ జీ ఘర్ పర్ హైలో అంగూరి బాభీగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇక 2017 అక్టోబర్లో బిగ్బాస్ 11లో పాల్గొన్న షిండే విన్నర్గానిలిచింది. కాగా 2014 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాల్లోనే గెలుపొందింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలో దిగే అవకాశం ఉంది. -
అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం!
భారత్లో #మీటూ ఉద్యమం అర్థం లేనిదంటూ టెలివిజన్ స్టార్, బిగ్బాస్ విన్నర్ శిల్పాషిండే వ్యాఖ్యానించారు. ప్రజలకు వినోదాన్ని అందించే టీవీ, సినీ పరిశ్రమల్లో రేప్లు వంటి ఉదంతాలు ఉండవని కొట్టిపారేశారు. పరస్పర అవగాహనతోనే ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ ఏర్పడుతుందనీ, దానికి అత్యాచారం అని పేరు పెట్టడం సరికాదని అన్నారు. ‘ప్రమాదం జరిగినప్పుడే స్పందించాలి, ప్రపంచం దృష్టికి తీసుకురావాలి. కానీ, ఘటన జరిగిన చాన్నాళ్లకు ఆ విషయం గురించి మాట్లాడితే అది వివాదమే అవుతుంది’ అని శిల్పా అన్నారు. ‘నిజమే.. మనకు ఎదురైన వేధింపులపై గొంతెత్తి ప్రపంచం దృష్టికి తేవాలంటే చాలా ధైర్యం కావాలి’ అని చెప్పారు. (హౌజ్ఫుల్ 4 నుంచి నానా ఔట్..!) ‘సినిమా, టీవీ పరిశ్రమలు చెడ్డవేం కాదు. అలాగని చాలా మంచివీ కాదు. కానీ, కొందరు కావాలని ఇండస్ట్రీ పేరును చెడగొట్టాలని చూస్తున్నారు. అంటే #మీటూలో వచ్చిన ఆరోపణలతో ఇండస్ట్రీలో పనిచేసేవారంతా తప్పు చేసినట్టేనా’ అని ప్రశ్నించారు. ఇక్కడెవరూ ఎవర్నీ బలవంతం చేయరని అన్నారు. పని ప్రదేశంలో అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని చెప్పుకొచ్చారు. (#మీటూ: సలోని సంచలన ఆరోపణలు) కాగా, తనుశ్రీ దత్తా నుంచి పలువురు టెక్నీషియన్ల వరకు బాలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో భారత్లో #మీటూ ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది మహిళలు తమకు ఎదురైన వేధింపులపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. బాలీవుడ్ దర్శకులు సుభాస్ ఘాయ్, సాజిద్ ఖాన్, వికాస్ బాహల్, రజత్కపూర్, నటులు అలోక్నాథ్, గాయకుడు కైలాష్ఖేర్ వంటి వారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (చదవండి : మీటూ : ఆ జెంటిల్మ్యాన్ ముందుకు వచ్చి మాట్లాడాలి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement