-
హైదరాబాద్లో ఇదేం విచిత్రం.. షీ టాయిలెట్లలో షాపులా?
సాక్షి, రామంతాపూర్: వివిధ పనుల నిమిత్తం ఇళ్లనుంచి బయటకు వచ్చే నగర మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షీ టాయిలెట్ల ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ అగమ్యగోచరంగా తయారవడం మహిళల పాలిట శాపంలా తయారవుతోంది. వివరాలివీ... రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఐడీఏ ఉప్పల్ సమీపంలో మోడ్రన్ బేకరీ ఎదురుగా ఉన్న బస్టాండ్ ఆనుకొని షీ టాయిలెట్ను ఏర్పాటు చేశారు. ఈ షీ టాయిలెట్లను బస్సుల కోసం ఎదురు చూసే మహిళలతో పాటు స్థానికంగా ఉన్న ఐడీఏ ఉప్పల్లో పలు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు వినియోగిస్తుంటారు. అయితే షీ టాయిలెట్ అని చూడకుంగా వీటిని ఆనుకొని షాపులు ఏర్పాటు చేశారు. ఈ షాపులను పురుషులే నిర్వహిస్తున్నందున చాలామంది మహిళలు షీ టాయిలెట్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ టాయిలెట్లను ఆనుకొని ఉన్న షాపులను దూరంగా తరలించాలని లేదా ఈ షీ టాయిలెట్ను మహిళలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
కఠోర శ్రమతోనే విజయం సాధ్యం
ఒలింపిక్ మెడల్ విజేత సింధు వైభవంగా షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవం తాడితోట/(రాజమహేంద్రవరం సిటీ) : కఠోర శ్రమతోనే విజయం సాధ్యమని ప్రముఖ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు అన్నారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీ టీమ్ సభ్యులు వాట్సప్, మెయిల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై క్షణాలలో రక్షణ కల్పించడం అభినందనీయమని కితాబు ఇచ్చారు. షీ టీమ్ వల్ల మహిళలకు భద్రత, రక్షణ కలుగుతుందని, ఈ టీమ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని సూచించారు. యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ పీవీ సింధును స్ఫూర్తిగా తీసుకొని యువత విజయం సాధించాలని యువతకు సూచించారు. స్త్రీలు ఎక్కడ గౌరవించిన చోటే దేవతలు ఉంటారన్న ఆరోక్తిని ప్రస్తావించారు. మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టాలనే లక్ష్యంతో షీ టీమ్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాదిలో సుమారు మూడు వేలకు పైగా యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. షీ టీమ్ ఏర్పాటుతో నగరంలోని మహిళలకు భరోసా ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా షీ టీమ్ తరఫున యాప్ను ప్రారంభించారు. పిల్లలపై బాధ్యతగా వ్యవహరించాలి... సింధు తండ్రి రమణ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసి ఉంచాలని సూచించారు. తాము బాధ్యతగా వ్యవహరించడం వల్లే సింధు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిందని అన్నారు. తొలుత సింధును మధురపూడి విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆనం కళాకేంద్రానికి తీసుకువచ్చారు. షీ టీమ్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలు, షటిల్ బ్యాడ్మింటెన్ పోటీలలో విజేతలకు సింధూ బహుమతులు అందజేశారు. సింధుకు ఘన సత్కారం ఈ సందర్భంగా సింధూను ఘనంగా సత్కరించారు. షీ టీమ్ సభ్యులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిరి ఆనంద్, ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంఓ పద్మశ్రీ,, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మ, భవాని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ఆదిరెడ్డి భవాని, బి.సత్యకుమారి, ఆర్.చంద్రకళ, అడిషినల్ ఎస్పీలు ఆర్.గంగాధరరావు, రజనీకాంత్రెడ్డి, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, వైవీ రమణరావు, సీఐలు రవీంద్ర, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆమెకి అతనే విలన్!
‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు. -
శ్మశానంలో 'షి'
హైదరాబాద్: విలక్షణ నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తె హీరోయిన్గా నటిస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఈ విషయాన్ని ఉత్తేజ్ సోమవారం సోషల్ మీడియాలో అఫీయల్గా ప్రకటించారు. షీ అనే తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు. ఆ విశేషాలను, ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. మలయాళ కుట్టి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో ఉత్తేజ్ కూతురు చేతన టాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ''షీ''. 'ఈజ్ వెయిటింగ్' అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా కొన్ని దృశ్యాలను శ్మశానంలో చిత్రీకరించారు. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు సోదరి రమ్య క్లాప్ కొట్టగా , అనూప్ సింగ్ కెమెరా స్విచాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. తాను ఇంతకు ముందు బాలనటిగా నటించినా, హీరోయిన్గా మాత్రం ఇదే తొలి సినిమా అని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని చేతన మీడియాతో చెప్పారు. మరి ఈమె కూడా తండ్రిలాగే విలక్షణ నటనతో ఆకట్టుకుంటుందా.. హీరోయిన్గా రాణిస్తుందా అనేది తెలియాలంటే షీ సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే. -
శ్వేతామీనన్ నిరీక్షణ
హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. శ్వేతామీనన్ ముఖ్య పాత్రలో పర్స రమేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బసంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: అనిత్, సంగీతం: భోలే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement