breaking news
Shares Surge
-
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్ల జోరు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి.బ్యాంకులు, ఫైనాన్స్తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆయిల్అండ్గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్ బ్యాంకు 3.20%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్ బ్యాంక్ 5%, యస్ బ్యాంక్ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి. -
హెచ్సీఎల్ ఫలితాలు భేష్... అమెరికా కంపెనీ కొనుగోలు
ముంబై: దేశంలో నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన క్యూ2లో ఉత్సాహకరమైన ఫలితాలను ప్రకటించి ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. 17 శాతం వృద్ధితో రూ. 2,016 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతంపైగా పుంజుకుని రూ. 11,519 కోట్లను సాధించింది. డాలర్ రెవెన్యూ కూడా 2 శాతం జంప్ చేసి 1722మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.క్యూ2లో నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 2318 కోట్లు, ఇబిటా మార్జిన్లు 20.1 శాతంగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ షేరు 4 శాతం లాభాలతో ట్రేడవుతోంది. మరోవైపు2016-17ఆర్థిక సంవత్సరానికి గాను 12-14 శాతం ఆదాయ వృద్ధి అంచనా(గెడెన్స్)లను యథాతథంగా ఉంచింది. అమెరికాకు చెందిన బట్లర్ అమెరికా ఏరోస్పేస్ సంస్థను కొనుగోలు చేసినట్లు హెచ్సీఎల్ టెక్ వెల్లడించింది. అమెరికా ఏరోస్పేస్, డిఫెన్స్ కస్టమర్లకు ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ స్వాధీనానికి 8.5 కోట్ల డాలర్లను చెల్లించనున్ననట్టు తెలిపింది. నగదు రూపంలో 85 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది డిశెంబర్ నాటికి అమెరికా సహా దేశం రెగ్యులేటరీ అనుమతులు పూర్తి కానున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం సీవోవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్కుమార్కు పదోన్నతి కల్పించినట్టు బీఎస్ఈ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. అతణ్ని సీఈవోగా నియమించినట్టు, అక్టోబర్ 20నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.