breaking news
Sharat Kumar
-
విశాల్... నా ఓటు కోల్పోయావ్
పెరంబూరు: నటుడు విశాల్, నటి వరలక్ష్మి మధ్య మంచి స్నేహసంబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య అంతకంటే ఇంకేదో బంధం ఉందనే ప్రచారం చాలా కాలం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటి వదంతులు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నటుడు విశాల్కు ఇంట్లో వాళ్లు హైదరాబాద్కు చెందిన అనీశారెడ్డి అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపించడంతో పుకార్లకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఫైర్బ్రాండ్గా పేరున్న నటి వరలక్ష్మిశరత్కుమార్ నటుడు విశాల్పై మండిపడ్డారు. ‘నీ సంకుచిత బుద్ధి బయట పడింది. నీపై నాకున్న గౌరవం తగ్గింది. ఇంకా సాధువులా నటించకు’ అంటూ ఆయనపై మాటల తూటాలు పేల్చారు. ఈ గొడవేంటో ఓ సారి చూద్దాం.. 2019–2022 ఏడాదికి గాను నడిగర్సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంఘ పదవులకు పోటీ పడుతున్న పాండవర్ పేరుతో విశాల్ జట్టు, స్వామి శంకర్దాస్ పేరుతో కే.భాగ్యరాజ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నారు. స్వామి శంకర్దాస్ జట్టు గురువారం నటుడు విజయకాంత్ను కలిసి మద్దతు కోరారు. శుక్రవారం నటుడు కమలహాసన్ను కలిశారు. కాగా పాండవర్ జట్టులో కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ఒక వీడియోను గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాదు నటి వరలక్ష్మి శరత్కుమార్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటుడు విశాల్ నడిగర్సంఘ మాజీ అధ్యక్షుడు శరత్కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై విమర్శలను గుప్పించారు. శరత్కుమార్, రాధారవి ఫొటోలను చూపిస్తూ వారి స్వప్రయోజనాల కోసం నాటక రంగ కళాకారుల శ్రేయస్సును పట్టించుకోలేదని, వారి అక్రమాలనుప్రశ్నించడానికే తాము ఈ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నాటక వృద్ధ కళాకారులకు అందిస్తున్న పింఛన్లు, నిర్మిస్తున్న సంఘ భవననిర్మాణం వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ వీడియోకు స్పందించిన నటి వరలక్ష్మిశరత్కుమార్ విశాల్పై మండిపడ్డారు. ఆమె తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. ‘మర్యాద గల విశాల్కు.. మీరు విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియోను చూసి మీరు ఎంతగా దిగజారిపోయారన్న విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురియ్యాను. మీపై ఉన్న కొంచెం మర్యాద, గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది. నా తండ్రిపై మీరు చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు ఎవరైనా నిరపరాధులే. నా తండ్రి నేరస్తుడే అయితే ఇప్పటికే జైలులో ఉండే వారు. కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి. ఇలాంటి నీచపు వీడియోలు మీ స్థా«యిని చూపుతున్నాయి. అయినా మిమ్మల్ని తప్పుపట్టలేం ఎందుకంటే మీరు పెరిగిన విధం అలాంటిదని భావిస్తున్నాను. ఇకపై కూడా సాధువులా చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు. మీ అబద్ధాలను, ధ్వంద మనస్థత్వాన్ని అందరూ గ్రహించారని భావిస్తున్నాను. మీరు నిజంగానే సాధువు అయితే మీ పండవర్ జట్టు సభ్యులు మీ నుంచి దూరం అయి మరో జట్టును ఏర్పాటు చేయరు. మీరు మంచి పనులు చేస్తే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నా తండ్రిని కించపరిచే కంటే, మీరు చేసిన మంచి కార్యాలను చెప్పి ఓట్లు అడుక్కోవచ్చు. ఇంత కాలం మిమ్మల్ని గౌరవించి ఒక స్నేహితురాలిగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాంటిది ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధించిన విషయాలతో వీడియో విడుదల చేయకుండా, ఇలా దిగజారి ప్రచారం చేసుకోవడం చాలా బాధనిపిస్తోంది. మీరు తెర వెనుక కూడా బాగానే నటిస్తున్నారనుకుంటున్నాను. మీరు నా ఓటును కోల్పోయారు. మీరు ఎప్పుడూ చెబుతున్నట్లు సత్యమే గెలుస్తుంది’ అని నటి వరలక్ష్మి శరత్కుమార్ నటుడు విశాల్పై మాటల దాడి చేశారు. వరలక్ష్మికి ఆ హక్కు ఉంది కాగా వీడియోను విడుదల చేసిన విశాల్పై నటి వరలక్ష్మి, నటి రాధికాశరత్కుమార్ చేసిన మూకుమ్మడి మాటల దాడి చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఇక విశాల్ వ్యతిరేకవర్గం దీన్ని బాగానే వాడుకుంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రం పాండవర్ జట్టు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ను స్థానిక ఆల్వార్పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం నటుడు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. నడిగర్సంఘంలో 30 ఏళ్లుగా జరగనిది తాము మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎందరు ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించారన్నది అందరికీ తెలుసన్నారు. ఇక నటి వరలక్ష్మి తనపై విసుర్ల గురించి స్పందిస్తూ ఆమె లాంటి ప్రతి స్నేహితులకు స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. నిసిగ్గుగా చెప్పిందే చెప్పడమా? విశాల్ వీడియోపై శరత్కుమార్ సతీమణి, నటి రాధికా శరత్కుమార్ ఘాటుగా స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ నెల 23న సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో పాండవర్ జట్టు విడుదల చేసిన వీడియోలో శరత్కుమార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, పలు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మూడున్నరేళ్ల ముందు చెప్పిన పాత పల్లవినే మళ్లీ సిగ్గు లేకుండా చెప్పడం బిచ్చగాడు వాంతి చేసుకున్నట్లు ఉంది. విశాల్ మీరు చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు నిరూపించారా? అయినా మీరు చేసిన ఫిర్యాదులు విచారణలో ఉండగా గతంలో చెప్పిన అసత్యాలు ఇప్పుడు నిజం అవుతాయా? మీపై వేయి కుళ్లిన గుడ్లు ఉండగా శరత్కుమార్ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నిర్మాతల మండలిలో డబ్బు అంతా ఖాళీ చేసి కోర్టు బోనులో నిలబడ్డారే, అలాంటి మీకు ఇలాంటి వీడియోను విడుదల చేసే అర్హత ఉందా? అంటూ రాధికాశరత్కుమార్ విశాల్పై విరుచుకుపడ్డారు. -
రజనీపై శరత్ కుమార్ ఘాటు విమర్శలు
-
అక్కతో కలిసి..
తమిళసినిమా: నటుడు శరత్కుమార్ రెండో కూతురు కూడా చిత్రరంగ ప్రవేశం చేసింది. శరత్కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మీ నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పోడా పోడీ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన వరలక్ష్మి బాలా దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మహిళల రక్షణ కోసం సేవ్ శక్తి అనే స్వచ్ఛంద సం స్థను ప్రారంభించన వరలక్ష్మి తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం గా రూపొందుతున్న శక్తి అనే చిత్రం లో నటిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్ శిష్యురాలు ప్రియదర్శని తొలిసారిగా మోగాఫోన్ పడుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారట. దీని గురించి ఆమె చెబుతూ ఇది పోలీస్ అధికారిణికి విలన్కు మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కిస్తు న్న యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు పూజ కాస్ట్యూం డిజైనర్గా పరిచయం అవుతోందని తెలిపా రు. చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది మార్చిలో శక్తి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. -
వేసవిలో సూర్యుడొస్తాడు!
... ఆ మాటకొస్తే ప్రతి ఉదయం సూర్యుడొస్తాడు. కానీ, వేసవిలో ఎక్కువసేపు మన తోడుగా, నీడగా వస్తుంటాడు. వచ్చే ఏడాది అదే టైమ్లో ప్రతిరోజూ ఉదయించే సూర్యుడితో పాటు మరో సూర్యుడు ‘నేనొస్తున్నా’ అంటున్నారు. ఆ సూర్యుడే అల్లు అర్జున్. ఎప్పుడూ మనదేశ ప్రజలకు తోడు–నీడగా ఉండే ఆర్మీ అధికారి సూర్యగా ఆయన నటిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నిన్న హైదరాబాద్లో మొదలైంది. నిన్ననే సినిమా విడుదల తేదీనీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా రెడీ చేసిన ఈ కథలో కమర్షియల్ అంశాలన్నీ ఉన్నాయి. నాగబాబు–‘బన్నీ’ వాసుగార్ల ఆధ్వర్యంలో సినిమా ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు. కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్, ముఖ్య తారలుగా అర్జున్, శరత్కుమార్లు నటిస్తున్న ఈ సినిమాకు కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్: రామ్–లక్ష్మణ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు, సమర్పణ: కె. నాగబాబు, సహనిర్మాత: ‘బన్నీ’ వాసు. -
శరత్కుమార్తో మళ్లీ నెపోలియన్
సీనియర్ నటులు శరత్కుమార్,cccc 15 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన తెన్కాశీపట్టణం చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఆ తరువాత తాజాగా చెన్నైయిల్ ఒరునాళ్ 2 చిత్రంలో కలిసి నటిస్తుండడం విశేషం.శరత్కుమార్ తాజాగా హీరోగా నటిస్తున్న ఇందులో నెపోలియన్, నటి సుహాసిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరూ ఒకే చిత్రంలో నటించడం ఇదే ప్రథమం. మునీశ్కాంత్, అంజనాప్రేమ్, రాజసింహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో నిశబ్ధం చిత్రం ఫేమ్ సాతన్య కీలక పాత్రను చేస్తోంది.ఇంతకు ముందు శరత్కుమార్ నటించిన చెన్నైయిల్ ఒరునాళ్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ నావల్ రచయిత రాజేశ్కుమార్ క్రైమ్ థ్రిల్లర్ నవల ఆధారంగా తెర కెక్కుతున్న ఈ చిత్రానికి చెన్నైయిల్ ఒరునాళ్ 2 అనే టైటిల్ను నిర్ణయించినట్లు దర్శకుడు జేపీఆర్ తెలిపారు.తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈయన చిత్రం గురించి తెలుపుతూ గత నెలలో కోవైలో చిత్ర షూటింగ్ను ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుందని, త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
విశాల్, శరత్ల మధ్య మాటల యుద్ధం