breaking news
shames
-
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్హాం ప్యాలెస్లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
గుట్టురట్టుచేసిన సీసీటీవీ
-
గుట్టురట్టుచేసిన సీసీటీవీ
న్యూఢిల్లీ: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న సామెత విన్నాం కానీ.. దొంగలు ..పోలీసులు చేతులు కలిపిన వైనంఎపుడూ కనలేదు. తాజాగా దేశరాధాని ఢిల్లీలో ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ లో మహిళా దొంగలతో చేతులు కలిపిన పోలీసాయన యవ్వారాన్ని అక్కడి సీసీటీవీ బట్టబయలు చేసింది. సీసీటీవీ రికార్డైన దృశ్యాల ప్రకారం గోల్డ్ ఆభరణం కొట్టేసిన మహిళా దొంగ నుంచి తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ దాన్ని గుట్టు చప్పుడు కాకుండా తన జేబులో వేసుకుని చల్లగా జారుకున్నాడు. మరోవైపు బాధిత మహిళ భర్తతో కలిపి తీసుకున్న సెల్ఫీ ఆధారంగా ఆరుగురు సభ్యుల మహిళా దొంగల గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం అమెరికాకు అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారై జంట ఈ గ్యాంగ్ బారిన పడి దోపిడీకి గురైంది. వారు మెట్రోలో గుర్గావ్ కు వెళుతుండగా వారి నగలను కొందరు మహిళా దొంగలు చాకచక్యంగా దొంగిలించారు. దీంతో తమ నగలు సహా ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు వారు తీసుకున్న సెల్పీ పోలీసులకు చూపినప్పుడు అందులో ఈ మహిళా దొంగలు కనిపించారు. బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆరుగురు సభ్యులతో కూడిన గ్యాంగును పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి రూ.22 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఆ పోలీసును గుర్తించి సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయలో దర్యాప్తు చేపట్టామన్నారు.