breaking news
shakehand
-
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్లో, ఫుట్బాల్లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్గా భారత్కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్తో షేక్హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్తో ఆడం, మ్యాచ్లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్బాల్లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్లో లేదు. ఇది పూర్తిగా గుడ్విల్తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
‘షేక్హ్యాండ్ ఇవ్వండి.. ఆశీర్వాదం పొందండి’
ముంబై: సాధారణంగా ఆలయానికి వెళ్లినప్పడు పూజారి ఆశీర్వదిస్తాడు. అక్కడ ఎవరైనా సాధువులు, సన్యాసులు ఉంటే వారికి నమస్కరించి.. ఆశీర్వాదం తీసుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా కుక్క ఆశీర్వాదం తీసుకున్నారా.. లేదా. పోని దానికి భక్తితో నమస్కరించారా.. ఆ పని కూడా చేయలేదా. అయితే ఈ వీడియో చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే.. అక్కడ కుక్క కనిపిస్తే.. ఈ వీడియో తప్పకుండా మీ మదిలో మెదులుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా సిద్ధతేక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం చాలా ఫేమస్. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. (చదవండి: ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం) ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గుడి బయట.. మెట్ల పక్కన కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఓ కుక్క కూర్చుని ఉంది. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులను పిలిచి మరి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాక ఆశీర్వదించింది. ఈ వింత సంఘటనను కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయ్యడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజనులు ‘ఈ వీడియో చూసి మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.. మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఇదేం ‘చాదస్తం’
నగర వాసుల్లో అనవసర భయాలు పదేపదే ఒకే పని... డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు మోహన్కు ఎవరైనా షేక్హ్యాండ్ ఇస్తే రోజంతా అదే పనిగా చేతులు కడుగుతూనే ఉంటాడు. కళ్యాణి ఇంటిలో ఎవరైనా అడుగు పెడితే పదే పదే ఇల్లంతా నీళ్లు చల్లి శుభ్రం చేస్తూనే ఉంటుంది. ఇదే విషయమ్మీద భార్యాభర్తల మధ్య అనేకసార్లు గొడవలు చోటుచేసుకున్నాయి. అయినా ఆమెలో మార్పు లేదు. పైగా సాధారణ దగ్గు వచ్చినా తనకు క్యాన్సర్ వచ్చిందేమోననే భయంతో విలవిల్లాడిపోతుంది. అదేమని అడిగితే...ఫలానా సినిమాలో హీరోయిన్ ఇలాగే చనిపోయిందంటూ ఆ పాత్రను తనకు అన్వయించుకుంటుంది... ఇలాంటి మోహన్లు, కళ్యాణిలు మన మధ్య చాలా మంది ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ‘చాదస్తుల’ సంఖ్య పెరుగుతుండడం విస్తుగొల్పుతోంది. బంజారాహిల్స్: ఒకే పని రోజంతా చేస్తుండడం... ఒకేమాట పదే పదే చెప్పడం.. ముట్టుకుంటారనే భయం.. పట్టుకుంటారని బెంగ.. తనపై ఏదో పడుతుందని ఆందోళన.... అన్ని సమస్యలూ తన పైనే వేసుకుని... అన్నింటినీ తానే భరిస్తున్నట్లు భావించడం.. ఇలాంటి చేష్టలు ఇటీవల నగర వాసుల్లో పెరిగిపోయాయి.. చొక్కాను పట్టుకొని అదే పనిగా లాగుతుండటం.. సబ్బుతో పదే పదే ముఖం కడగడం వంటి చాదస్తాలను పాటించే వారు పెరుగుతున్నారు. ఇవే కాదు.. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు నగర వాసుల్లో అనుమానాలను పెంచడమే కాకుండా వారిని మరింత చాదస్తులుగా మారుస్తున్నాయి.. ఈ సమస్య చిన్నారులు మొదలుకొని అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోంది. ప్రముఖులకూ తప్పని భయాలు {పిన్సెస్ డయానా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ అందాల రాశి కూడా ఒక రకమైన చాదస్తంతో బాధపడేది. ‘ఈటింగ్ డిజార్డర్’తో బాధ పడే ఆమె తాను చాలా ఫిట్గా ఉన్నాననే కారణంగా ఆహారం ఎక్కువ తీసుకుని వాంతులు చేసుకునేది.రోగులకు ఎంతో విశిష్ట సేవలందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సైతం ఒక రకమైన చాదస్తంతో ఉండేది. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (సీఓడీ) కారణంగా ఆమె చివరి దశలో మంచం మీదనే ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది. వీరే కాదు.. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఇలాంటి చాదస్తాలతో సతమతమవుతున్నారు. జీవన శైలిలోని విపరీత పరిణామాలకు తోడు.. పని విధానంలోని అసాధారణమైన మార్పులు... ఒత్తిడి ఇలాంటి చాదస్తాలు... అనుమానాలకు తావిస్తోంది. అతి..అనర్థం నగరానికి చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్లో నడిచి వెళుతూ ఒక భవన నిర్మాణం వద్ద తల పెకైత్తి చూశాడు. అదే సమయంలో అతని కంట్లో సిమెంటు నీటి చుక్క పడింది. దీంతో అతను తన కంట్లో ఎవరో ఎయిడ్స్ ఉన్న వ్యక్తి ఉమ్మి వేశాడంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆస్పత్రులకు వెళ్లి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకున్నాడు. ఎలాంటి సమస్య లేదని ఎంతమంది వైద్యులు చెప్పినా నమ్మకుండా ఇప్పటికీ అలాగే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంటెక్ చదివిన మరో యువకుడు తనకు ఎలర్జీ ఉందనే అభిప్రాయంతో తన చేతులను సబ్బుతో నిరంతరం అదే పనిగా కడుగుతుండేవాడు. దీంతో అధిక రాపిడికి గురైన అతని చేతులు రంగు మారిపోయాయి. మచ్చుకు కొన్ని... మహిళల్లో చాలా మంది ఇంటిని పదే పదే ఊడ్చటం, తుడవడం.. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్తే మళ్లీ శుభ్రం చేయడం లాంటి సంఘటనలు కోకొల్లలు. మరికొందరు గ్యాస్ స్టౌను ఆపేశామా? లేదా 20 నుంచి 30 సార్లు తనిఖీ చేసుకోవడం చాదస్తాల్లో భాగమే. మరికొందరు రుచి చూసే పేరుతో పొయ్యి మీది వంటకాన్ని సగం ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి కేసులు అనేకం తన వద్దకు కూడా వస్తున్నాయని చెబుతున్నారు నగరానికి చెందిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పూర్ణిమా నాగరాజు. ‘ఫర్ఫెక్ట్’ కావాలనుకొని... చాలామంది ఉద్యోగులు తమకు తాము పర్ఫెక్ట్గా ఉన్నామనే భావనలో ఉంటారు. మరికొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో అన్ని పనులు తామే చేస్తుండటం... జట్టులో ఉన్న ఇతర సభ్యుల బాధ్యతల్లోకి తొంగిచూడటం.. పనంతా తానే చేస్తున్నట్లుగా భావించడం చేస్తుంటారు. దీనికి తోడు తమ ఉద్యోగంపై భయం. పక్కవారు చూస్తున్నారేమోననే ఆందోళన. ఇలాంటివన్నీ చాదస్తులుగా మారుస్తున్నాయి. కొందరు యువకులు విపరీత స్థాయిలో ప్రేమను ప్రదర్శిస్తుంటారు. తాను ప్రేమించిన అమ్మాయి మీద సర్వ హక్కులు తనవేనని అతిగా పెత్తనాన్ని చెలాయిస్తుంటారు...ఇదీ చాదస్తంలో భాగమే. కొంతమంది సన్నగా, అస్థిపంజరంలా ఉన్నప్పటికీ తాము చాలా లావుగా ఉన్నామన్న భావనతో ఇంకా డైటింగ్ చేస్తుంటారు. ఈటింగ్ డిజార్డర్లో భాగమైన ‘బులీమియా’ అనే చాదస్తంతో వీరు బాధ పడుతున్నట్టు లెక్క. మరికొందరు తాము ఫిట్గా ఉన్నామనే భావనతో ఏది తిన్నా ఏం కాదని అతిగా తిని వాంతులు చేసుకుంటారు.. ఇలాంటి వారిని సాధారణంగా ‘అనోరెక్సియా’ బాధితులుగా పరిగణిస్తారని డాక్టర్ పూర్ణిమ పేర్కొన్నారు. -
కరచాలనమే బ్రేకింగ్ న్యూస్!
* ఇద్దరు సీఎంల కలయికపై వెంకయ్యనాయుడు స్పందన * అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో బాబు, కేసీఆర్ ఆలోచించుకోవాలి * అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్త కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడం పెద్ద వార్త కాకూడదు. అయితే అది పెద్ద వార్త అయింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై వారే ఆలోచించాలి. విభేదాలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించా. పాటిస్తారో లేదో వారి ఇష్టం’ అని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు దేశాల అధ్యక్ష, ప్రధానులతో భేటీ అవడం సాధారణ అంశాలుగానే పరిగణిస్తామన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉద్దేశించిన అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫీజు రీయిం బర్స్మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 1956 స్థానికత నిబంధనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్డర్ నుంచి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా, రియల్ ఎస్టేట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా బిల్లు ఉంటుందన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్తోపాటు కెడ్రాయి లాంటి సంస్థలతోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వచ్చే అవకాశం ఉందన్నారు. నిధుల సేకరణపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలి పురపాలక సంస్థలు నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా వనరులు సమకూర్చుకోవటంపై దృష్టి సారించాలని వెంకయ్య సూచించారు. పనులు వసూలు చేసి పారదర్శకంగా ఖర్చు పెట్టాలన్నారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు సుదీర్ఘ కాలం తరువాత కూడా ప్రభుత్వాలు అధికారాలు అప్పగించకపోవటంపై సమీక్షించటం తన ప్రాధాన్యత అంశాలల్లో ఒక్కటని తెలిపారు. కాలపరిమితి తీరినందున జేఎన్ఎన్యూఆర్ఎం పథకం స్థానంలో కొత్త మిషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ్హ కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బీమా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలును కోరుతున్నాం. అర్థవంతమైన సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిల్లుపై చర్చించేందుకు తయారుగా ఉన్నాం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు నెగ్గేందుకు సహకరించాలి. 2008లో యూపీఏ ప్రభుత్వమే ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. తాజా బిల్లులో బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాం. సవరణ బిల్లులో ఉన్న తేడా అదే.