breaking news
Semi-nude show
-
ఒక్క వీడియో కాల్తో కష్టాల్లో యువ క్రికెటర్..!
డేటింగ్యాప్లో పరిచయమైన మహారాష్ట్ర క్రికెట్ జట్టు యువక్రికెటర్ను ప్రేరేపించి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డు చేసిన యువతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసింది. యువక్రికెటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశాన్య విభాగ సెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన కణ్ణూరు వద్ద పంచతార హోటల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యువక్రికెటర్ మహారాష్ట్ర నుంచి నగరానికి చేరుకుని హోటల్లో ఉన్నాడు. డేటింగ్ యాప్లో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్కు 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. వాట్సాప్కాల్లో మాట్లాడాలని తెలిపి నెంబర్ షేర్ చేసింది. అనంతరం ఇద్దరు వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యువతి ఒంటిపై దుస్తులు తీసేసింది. క్రికెటర్ కూడా దుస్తులు తీసి అర్ధనగ్నంగా ఉండగా వీడియో రికార్డ్ చేసింది. కొద్దిసేపటి తరువాత క్రికెటర్కు ఫోన్ చేసి నగ్న వీడియో స్క్రీన్షాట్లు పంపించి డబ్బు ఇవ్వాలని బెదిరించింది. కంగారు పడిన క్రికెటర్ రూ.1,500 ఆన్లైన్లో షేర్ చేశారు. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
బాబు సర్కారు తీరుకు నిరసనగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అర్ధనగ్న ప్రదర్శన
మంగళగిరి రూరల్: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ సభ్యులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని చినకాకాని గ్రామం ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. గత 16 రోజుల నుంచి నిరాటంకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను సర్కారు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. తమ బాధలు వినే సమయం బాబు ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,500 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.780 కోట్ల సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఈనెల 7న కలిశామని, సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఫలితం లేదని పేర్కొన్నారు. కాగా, అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి పారిశ్రామికవేతలను అడ్డుకున్నారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని హెచ్చరించారు. దీంతో పారిశ్రామికవేత్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తి నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోతు రమేష్, సంఘం అనంతపురం కో–ఆరి్డనేటర్ ఆదినారాయణ, కడప కో–ఆర్డినేటర్ ఆర్.ఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
కాన్కాస్ట్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
ఆమదాలవలస రూరల్ : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కాన్కాస్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.కృష్ణారావు, బి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలోని దూసి గ్రామంలో గల కాన్కాస్ట్ పరిశ్రమ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా శనివారం కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ 29 రోజులుగా కార్మికులు ధర్నాలు చేపడుతున్నా యాజమాన్యం పట్టించుకోపోవడం దారుణమన్నారు. యాజమాన్యం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, నిలుపుదల చేసిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని కోరారు. నూతన వేతన ఒప్పందం తక్షణమే అమలు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎస్.రాజు, కె.కమల్, టి.సత్యనారాయణ, సి.హెచ్.రమణబాబు, సి.హెచ్.కోటినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టిఆర్ఎస్ అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన
కరీంనగర్ : పోలీసుల చర్యకు నిరసనగా టిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కరీంనగర్ సైన్స్ వింగ్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జికి నిరసనగా కరీంనగర్ టిఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ అర్ధనగ్న ప్రదర్శన చేశారు.


