breaking news
self rivew
-
ఆత్మసాక్షాత్కారం అంటే..?
ఆత్మసాక్షాత్కారం మానవుని జన్మహక్కు అంటారు శ్రీ మాతాజీ. మనలోని కుండలినీ శక్తియే మన తల్లి. ఆమె మన అన్ని జన్మలలోను మనతోనే ఉంటూ, జాగృతి చెందే సదవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాల, జాతుల వారు, ఎవరైనా సహజయోగ సాధన చేసుకోవచ్చును. ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందవచ్చును. దీనికి కావలసింది ఆత్మసాక్షాత్కారం పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలలోను, జ్ఞానమూర్తులు, అవతార పురుషులు సహజ యోగం గురించే బోధించారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని చెప్పారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?పూర్వంలోలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఏ అడవులకో, హిమాలయాలకో వెళ్ళనవసరం లేకుండానే తమ, తమ సంసారిక బాధ్యతలు, సాంఘిక పరమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మసాక్షాత్కారం పొందే ప్రక్రియను మాతాజీ కనుగొన్నారు.ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే శుద్ధ ఇచ్ఛాశక్తి మనకు కలిగినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమై కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి, శిరస్సునందు గల సహస్రార చక్రాన్ని ఛేదించి, పరమ చైతన్య శక్తితో అనుసంధానం జరగటం వలన అనంతమైన దైవశక్తులన్నీ అనుభవంలోకి వచ్చి, తద్వారా మనకున్న అజ్ఞానం తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా... బ్రహ్మజ్ఞానిగా మార టమే ఆత్మసాక్షాత్కార పరమార్ధం.ఆత్మసాక్షాత్కారం అనేది ఒక అంధ విశ్వాసం, మూఢ నమ్మకమూ కానే కాదు. అనుభవ స్థిరమైనది, స్వయం అనుభూతి కలిగినటువంటిది. మాతాజీ ఫోటో ముందు కూర్చుని, నిస్సంకోచంగా హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా ఈ అనుభూతి సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆలోచనలు నిలిచి΄ోతాయి. ఈ స్థితిని ‘నిర్విచారస్థితి’ అంటారు. ఈ స్థితిలో మన అరచేతులలో గానీ, మాడు పైనగాని, చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. ఇది మీలోనే సంభవించు ‘ఆత్మసాక్షాత్కార’ అనుభవం, అనుభూతి.శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన గీతోపదేశంలో ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నాడు. భగవంతుని యందు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్న వారి యోగ క్షేమాలు తానే వహిస్తానని, యోగం ద్వారా భగవంతుని చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందని బోధించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇటువంటి యోగం అంటే ఆ సర్వవ్యాప్త భగవంతుని శక్తితో కలయిక ఈ సహజ యోగం ద్వారా సిద్ధిస్తుంది. శ్రీ లలితా సహస్రనామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందగోరటమే. సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సబంధించిన లేక భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల, శారీరకంగానూ, మానసికంగానూ సమతుల్యత లోపించటం వలన సదా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురవుతూ ఉంటాం. అయితే సహజయోగలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచడం వల్ల మనం సమతుల్యతలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని పొందటాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పవచ్చును.– డాక్టర్ పి. రాకేష్ (శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా) (చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!) -
ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు
– రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు కర్నూలు(అర్బన్): రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు హెచ్చరించారు. సోమవారం ఉదయం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలకు కార్పొరేషన్లు, బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బీసీ కులాలపై చిన్న చూపు చూస్తోందన్నారు. అగ్రకులాలకు చెందిన కార్పొరేషన్లకు వేల కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్న ప్రభుత్వం బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లతో సరిపెడుతోందన్నారు. కాపుల సంక్షేమం పట్ల పూర్తి స్థాయిలో స్పందిస్తున్న ప్రభుత్వానికి రజకుల సంక్షేమం పట్టడం లేదన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ఆలస్యం జరిగితే.. కనీసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కూడా కల్పించాలన్నారు. నవంబర్ 27న రజక ఆత్మ గౌరవ సభ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకుపోయేందుకు నవంబర్ 27న విజయవాడలో ఐదు లక్షల మంది రజకులతో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు అంజిబాబు తెలిపారు. సభకు ముఖ్యమంత్రితో పాటు అందరు ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. హాజరు కాని నాయకులకు భవిష్యత్తులో రజకులు ఓట్లు వేయబోరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రజకులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, తమను గుర్తించిన పార్టీలకే మద్దతు ఇస్తామన్నారు. 10న రజక జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక ఈ నెల 10న స్థానిక బీసీ భవన్లో ఉదయం 10 గంటలకు రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రజకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆదోనిలో ధోబీఘాట్లకు కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షుడు సీపీ వెంకటేష్, వాడాల నాగరాజు, అఖిల భారత ధోబీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా నాయకులు చంద్రశేఖర్, వి.శ్రీనివాసులు, గణేష్, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.