breaking news
seetharam achuri
-
తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది : సీతారాం ఏచూరి
-
మహోజ్వల భారతి: నంబర్ 1 స్టూడెంట్
సీతారాం ఏచూరి కమ్యూనిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. నేడు ఆయన జన్మదినం. ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా ఢిల్లీ లోనే సాగింది. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ (ఆనర్స్) ఆర్థికశాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్యూలో పీహెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యుడిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఉన్నారు. చదవండి: (మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!) ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. 2015 మార్చి 3 న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం చాలా అరుదు. ఇది సహజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. సీతారాం తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు. ఏచూరి తల్లి కల్పకం, మోహన్ కందా సోదరి, ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు. గత ఏడాదే ఆమె కన్నుమూశారు. ఏచూరి భార్య సీమా చిస్తీ జర్నలిస్టు. ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు. -
పోరాటాలే శరణ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు వాస్తవరూపం ఇవ్వడానికి పోరాటాలు త ప్ప మరో మార్గం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ రెండో వార్షికోత్సవానికల్లా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీపీఎం.. ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీనిద్వారా దేశ ఎజెండాలోనే మార్పు వచ్చిందన్నారు. ఫ్యూడల్ పాలన వల్ల ఎదురైన సమస్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందన్న సంతోషం తప్ప ఏడాదిలో సాధించినదేదీ కనిపించట్లేదన్నారు. నియంతృత్వం దిశగా మోదీ సర్కార్.. ప్రధాని మోదీ విధానాలతో కేంద్రం నియంతృత్వం దిశగా సాగుతున్నట్లుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దిగజారుతూ కొత్త రకమైన ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీడబ్ల్యూజేఎఫ్, హేచ్యూజేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్ రాజకీయ ప్రచారానికే...
విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం రాజకీయ ప్రచారం కోసమేనని సీపీఎం నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికల్లో తాము ఇక ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడి సమావేశంలో మాట్లాడిన ఆయన అంశాల వారిగానే పార్లమెంటు లోపల, వెలుపల మద్దతు కూడగట్టుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించాడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కాగా, పనిచేసే చోటుతోపాటు బహిరంగ ప్రదేశాల్లో కూడా పురుషుడి ప్రవర్తన బాగుండాలని సూచించారు.