breaking news
Sathyasai Baba
-
మతమేదైనా సత్యం, శాంతినే బోధిస్తాయి
జయపురం: హిందూ, క్రిస్టియన్, సిక్కు, ముస్లిం ఇలా ఏ మతమైనా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే బోధిస్తాయని సత్యసాయి సేవాసమితి వారు చెప్పారు. సత్య సాయి సేవాసమితి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాల వికాస కేంద్రం విద్యార్థులతో వాక్ ఫర్ వాల్యూస్ అనే అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారత మాత, గాంధీ, వివేకానందుడు, బుద్ధుడు, నెహ్రూ, మోడీ వేషధారణలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ జయపురం మహాత్మా గాంధీ రోడ్లోని సత్యసాయి సేవా సమితి మందిరం నుంచి ప్రధాన మార్గం మీదుగా పోలీస్స్టేషన్ వరకూ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ‘ప్లీజ్ ప్రామిస్ అజ్ ఫర్ బెటర్ వరల్డ్’ అనే సందేశాన్ని పోలీసు అధికారులకు సమర్పించారు. సంఘీభావం సర్వ మానవ సమానత్వం, అన్ని మతాలు ఒకటేనన్న సందేశం, వసుధైక కుటుం బంపై విద్యార్థులు అవగాహన కలిగించారు. ర్యాలీలో సత్యసాయి సేవా సమతి కోఆర్డినేటర్ ఎస్.ప్రకాశ్రావు, జిల్లా కోఆర్డినేటర్ మార్కం డేయ షరాఫ్, బాల వికాస్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ ఎస్.స్వర్ణలత, బాల వికాస్ ఉపాధ్యాయరాలు ఎస్.గౌరి, బాల వికాస్ కేంద్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 88వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శనివారం ఘనంగా జరిగాయి. పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సాయిబాబా సమాధిని సందర్శించుకున్నారు. జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సత్యసాయిబాబా పేరిట రూ.5 స్టాంప్ను విడుదల చేశారు. రూ.80కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కృపారాణి పరిశీలించారు. బాబా జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో రామ్నగర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ సత్యసాయి బాలవికాస్ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.