satavahana college
-
రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
విజయవాడలో బలవంతంగా శాతవాహన కాలేజీని కూల్చివేశారు: మల్లాది
-
KSR Live Show: నీచంగా దిగజారుతున్న టీడీపీ.. శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
-
విజయవాడ శాతవాహన కాలేజీని కూల్చివేసిన పచ్చమాఫియా
-
విజయవాడ: శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
సాక్షి, విజయవాడ: ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్తో వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు.. బోర్డులు ఏర్పాటు చేశారు.కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండిపడుతోంది.విద్యార్థుల పరిస్థితి ఏంటి?శాతవాహన కాలేజీ భవనాలు కూల్చివేతతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కళాశాల భవనాలు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శాతవాహన కాలేజీకికు దశాబ్ధాల చరిత్ర ఉందని.. కోర్టు ఆదేశాలను సాకుగా చూపి కళాశాల భవనాలు కూల్చేయడం దారుణమన్నారు.విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్టిఫికెట్లు, రికార్డులన్నీ శిథిలాల కిందే ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?. తక్షణమే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. విద్యార్ధులకు న్యాయం చేయాలి’’ అని రవిచంద్ర డిమాండ్ చేశారు. -
నెట్బాల్ స్టేట్ చాంప్ కృష్ణా
విజయవాడ స్పోర్ట్స్: స్థానిక శాతవాహన కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 3వ సీనియర్ ఏపీ స్టేట్ నెట్బాల్ చాంపియన్షిప్ విజేతగా మహిళా, పురుష రెండు విభాగాల్లోనూ కృష్ణా జిల్లా జట్లు విజేతగా నిలిచాయి. పురుషుల విభాగంలో కృష్ణా జిల్లా తరువాతి స్థానాలను వరుసగా ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లా జట్లు సాధించాయి. మహిళా విభాగంలో పశ్చిమగోదావరి ద్వితీయ స్థానం సాధించగా, నెల్లూరు, ప్రకాశం జట్లు సంయుక్తంగా తృతీయ స్థానాన్ని పొందాయి. పోటీల అనంతరం జరిగిన కార్యక్రమానికి శాతవాహన కళాశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి రవి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఉత్తరభారత దేశంలో నెట్బాల్ మంచి క్రేజి ఉన్న ఆటన్నారు. తమ కళాశాల చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ క్రమంలో నెట్బాల్ టోర్నీ ఎప్పుడు జరిగినా ప్రోత్సహిస్తున్నామన్నారు. శాతవాహన కళాశాల నెట్బాల్ జట్టు కేయూ యూనివర్సిటీ స్థాయిలో కూడా చక్కటి ప్రతిభకనపరుస్తుందన్నారు. కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా జిల్లాలో నెట్బాల్ను అభివృద్థి చేసిన ఘనత ఏపీ నెట్బాల్ సంఘ కార్యదర్శి బూదోటి శివరామ్కే దక్కుతుందన్నారు. ఎంతో మంది నెట్బాల్ క్రీడాకారులనుతయారు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో టోర్నీ నిర్వహించారన్నారు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నీల్లో పాల్గొనే జట్లకు శివరామ్ శిక్షణ ఇచ్చారన్నారు. ముగింపు కార్యక్రమంలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నాగేశ్వరశర్మ, కళాశాల పీడీ బీసీహెచ్ సంగీతరావు, ఏపీ నెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బూదోటి శివరామ్, కోశా«ధికారి ఎ.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విజయంపైనే గురి
విజయవాడ స్పోర్ట్స్ : శాతవాహన కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాల ఆర్చరీ పోటీలు (స్త్రీ, పురుష) శనివారం కళాశాలలో జరిగాయి. ఈ టోర్నీని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ టోర్నీ నుంచి కృష్ణా యూనివర్సిటీ ఆర్చరీ జట్లను ఎంపిక చేయనున్నారు. టోర్నీలో గుడివాడ ఎన్ఆర్ఆర్ కళాశాల, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, మాంటిస్సోరి మహిళా కళాశాల, పీబీ సిద్ధార్థ, కేవీఎస్ఆర్ సిద్ధార్థ కళాశాల, శాతవాహన కళాశాల జట్లు పాల్గొన్నాయి. 70 మీటర్ల రికర్వు పురుషుల విభాగంలో కె.పిచ్చయ్య (శాతవాహన కళాశాల), పి.గోపీచంద్ (ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల), ఎన్.పృథ్వీనాథ్ (గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 50 మీటర్ల కాంపౌండ్ విభాగం పురుషుల విభాగంలో నవీన్కుమార్, ఈజీఎన్ దీపు, ఓవీకే చైతన్య వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగేశ్వరశర్మ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి, కళాశాల పీడీ బీసీహెచ్ సంగీతరావు, కళాశాల మేనేజర్ కె.శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ కె.వాసుదేవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.