breaking news
sardar papanna
-
చరిత్ర సృష్టించిన సామాన్యుడు
రాజ్యాధికారం గురించి సామాన్యుడు ఆలోచించడానికి సాహసించని రోజులలో ఏకంగా గోల్కొండ రాజ్యాన్ని ఏలిన సామాన్యుడు పాపన్న. గౌడ కులంలో పుట్టి 12 మందితో సైన్యాన్ని ప్రారంభించి 12వేలకు సైనిక శక్తిని పెంచి పాలన చేపట్టాడని మన జానపద కథలు చెబుతున్నాయి. మొగల్ ఆస్థానంలో పనిచేసిన ఖాఫీ ఖాన్ రచించిన ‘ముంతఖబ్ – అల్ లుబాబ్’ పాపన్నను ప్రస్తావించింది. పాపన్న గురించి జేఏ బోయల్ ‘దిఇండియన్ యాంటీ క్వెరీ’ 1874 జనవరి సంచికలో ‘తెలుగు బల్లాడ్ పొయెట్రీ’ అనే శీర్షికతో పాపన్న గురించి రాశాడు. లండన్లోని ‘విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం’లో పాపన్న చిత్రపటం ఉంది. కొంపల్లి వెంకట్ గౌడ్... పాపన్నపై చేసిన పరిశోధన ప్రకారం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న పాపన్న చిత్రపటాన్ని ఆయన సమకాలిక చిత్రకారుడు జగదీష్ మిట్టల్ వేశాడు. పాపన్న అసలు పేరు నాశగోని పాపన్న గౌడ్. ప్రస్తుత సిద్దిపేట జిల్లా దూల్ మిట్టలో ఉన్న రాతి శాసనం ప్రకారం పాపన్న 1650 ఆగస్టు 18న సర్వమ్మకు జన్మించాడు. ఆయన పుట్టిన ఊరు ప్రస్తుత జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్. కులవృత్తి కల్లు గీతను విరమించి చిన్న సైన్యాన్ని ఏర్పరచుకొని మొదట తాటికొండ చుట్టు పక్కల గ్రామాలలో ధనవంతులను, భూస్వాములను కొల్లగొట్టాడు. ఆ తర్వాత తన చర్యలను హుస్నాబాద్, జనగాం, షాపురం చుట్టుపక్కలకు విస్త రించాడు. కౌలాస్ జమిందారు దగ్గర పనికి కుదిరి ఆ కోట చుట్టుపక్కలా ధనవంతులను దోచుకుని సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. సర్వాయిపేట కోటను నిర్మించి స్వతంత్రాన్ని ప్రకటించుకొని విజయయాత్ర ప్రారంభించాడు. హుస్నాబాద్, తాటికొండ, షాపురం వంటి చోట్లా కోటలు నిర్మించాడు. చివరికి 1709లో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడని అంటారు. అయితే చివరికి మొగల్ సైన్యం చేతికి చిక్కి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథలు చెబుతున్నాయి. – నర్సింగు కోటయ్య ‘ చరిత్ర అధ్యాపకులు, నల్లగొండ(నేడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి) -
ఐక్యతతోనే గౌడ కులస్తుల అభివృద్ధి: స్వామిగౌడ్
హైదరాబాద్: గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి పార్టీలకతీతంగా, సంఘటితంగా ముందుకు సాగాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన తెలంగాణ గౌడ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రభుత్వం పెట్టలేదని అనడం కంటే ప్రతి సొసైటీ ఒక విగ్రహం పెట్టేవిధంగా ప్రయత్నించాలని సూచించారు. సర్దార్ పాపన్న వంటి మహోన్నత వ్యక్తి పుట్టిన గౌడ కులంలో తాను పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే గౌడ కులస్తులు అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా తాటి, ఈత చెట్లను నాటించాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో.. హైదరాబాద్ అమీర్పేటలోని సితారా హోటల్లో అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ పేరం శివనాగేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌడ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా కేఈ వేణుమాధవ్, తెలంగాణ అధ్యక్షుడిగా ఎ.మాణిక్ప్రభుగౌడ్లతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీహీరో, నిర్మాత జైహింద్గౌడ్, ఉపేందర్గౌడ్, బీసీ మహిళా సంక్షేమ అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు.