breaking news
sara errani
-
సారా ఎరాని–వవసోరి జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
సింగిల్స్లో ఎంతటి మేటి క్రీడాకారులైనా... డబుల్స్ విభాగంలో రాణించాలంటే మాత్రం విశేష ప్రతిభ, చక్కటి సమన్వయం ఉండాలని సారా ఎరాని–ఆండ్రియా వవసోరి (ఇటలీ) నిరూపించారు. మ్యాచ్లను, టోర్నీని కొత్త ఫార్మాట్లో నిర్వహించినా... సింగిల్స్ స్టార్స్ను బరిలోకి దించినా... డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ‘మిక్స్డ్ డబుల్స్’ విభాగంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ‘సూపర్ టైబ్రేక్’లో పైచేయి సాధించిన సారా ఎరాని–వవసోరి ద్వయం ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్ను నిలబెట్టుకున్నారు. న్యూయార్క్: కొత్త ఫార్మాట్కు ఆహ్వానం పలికి... డబుల్స్ స్పెషలిస్ట్ అవకాశాలను దెబ్బ తీశారని నిర్వాహకులను విమర్శించినా... మరోవైపు తమ సహజ నైపుణ్య ప్రదర్శనతో సారా ఎరాని–ఆండ్రియా వవసోరి జోడీ అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ ఇటలీ జంట వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచింది. గురువారం ఉదయం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి 6–3, 5–7, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే)లపై గెలుపొందారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఎరాని–వవసోరి నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన ఎరాని–వవసోరిలకు 10 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ స్వియాటెక్–రూడ్లకు 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 50 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. రెండు రోజుల్లోనే ముగిసిన మిక్స్డ్ ఈవెంట్లో ఎరాని–వవసోరి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారమే జరిగిన సెమీఫైనల్స్లో ఎరాని–వవసోరి 4–2, 4–2తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా)లను ఓడించింది. మరో సెమీఫైనల్లో స్వియాటెక్–రూడ్ 3–5, 5–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)–జాక్ డ్రేపర్ (బ్రిటన్)లపై గెలిచారు. 2018, 2019లలో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ వరుసగా రెండేళ్లు ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్ నెగ్గగా... ఇప్పుడు ఎరాని–వవసోరి ఈ ఘనత సాధించారు. -
సెమీస్లో సారా ఎరాని–వావసోరి జోడీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో మంగళవారం మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ జోడీ సారా ఎరాని–ఆండ్రియా వావసోరి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ముందుగా తొలి రౌండ్లో ఎరాని–వావసోరి ద్వయం 4–2, 4–2తో రెండో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ వెంటనే జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎరాని–వావసోరి జోడీ 4–1, 5–4 (7/5)తో ముకోవా (చెక్ రిపబ్లిక్)–రుబ్లెవ్ (రష్యా) జంటను ఓడించి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను 4–1తో నెగ్గిన ఇటలీ జోడీ రెండో సెట్ను టైబ్రేక్లో దక్కించుకుంది. రెండో సెట్లో స్కోరు 4–4తో సమం కావడంతో టైబ్రేక్ను నిర్వహించారు. టైబ్రేక్లో ముందుగా ఏడు పాయింట్లు గెలిచిన ఎరాని–వావసోరి జంట విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్–రూడ్ జంట 4–1, 4–2తో కేటీ మెక్నాలీ (అమెరికా) –ముసెట్టి (ఇటలీ) జోడీపై గెలిచింది. అంతకుముందు తొలి రౌండ్లో స్వియాటెక్–రూడ్ 4–1, 4–2తోనే మాడిసన్ కీస్–ఫ్రాన్సిస్కో టియాఫో (అమెరికా)లపై... కేటీ మెక్లానీ–ముసెట్టి 5–3, 4–2తో ఒసాకా (జపాన్)–Vమోన్ఫిల్స్ (ఫ్రాన్స్) లపై గెలిచారు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ముకోవా–రుబ్లెవ్ 4–2, 5–4 (7/4)తో వీనస్ విలియమ్స్–రీలీ ఒపెల్కా (అమెరికా)లపై నెగ్గారు. -
ఇటలీ టెన్నీస్ ఓపెన్ సెరీనా సోంతం