breaking news
Sankranti traffic
-
సంక్రాంతి రద్దీ.. ఏపీ నుంచి వచ్చేవారికి బిగ్ అలర్ట్..
సాక్షి, నల్లగొండ జిల్లా: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు చేపట్టారు. ఎన్హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుగుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుమాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలునల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలుకోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.ఎన్హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ -
ఊరు పిలిచింది
సిటీబ్యూరో: సంక్రాంతి రద్దీ పోటెత్తింది. బస్సైనా..రైలైనా.. సీటున్నా.. లేకున్నా.. రిజర్వేషన్ ఉన్నా..జనరల్ బోగీ అయినా సరే తప్పదు అన్నట్లుగా నగరం నుంచి లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. బుధవారం నుంచి పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో భారీ ఎత్తున బయలుదేరారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు, ఎల్బీనగర్, ఉప్పల్, మెహిదీపట్నం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని కూడళ్లు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. సాధారణ రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3500 బస్సులకు తోడు మరో 500 బస్సులను బుధవారం అదనంగా ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బయలుదేరే వందకు పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్లు లభించని వాళ్లు జనరల్ బోగీలను ఆశ్రయించారు. యథావిధిగా చార్జీల దోపిడీ కొనసాగింది.


