-
పని చేయాల్సింది అధికారి ఇంట్లో కాదు.. బయట
హస్తినాపురం: పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిన సిబ్బంది అధికారుల ఇళ్లలో పనులు చేస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతోందని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. హయత్నగర్ సర్కిల్ కమలానగర్లో ఓ అధికారి ఇంట్లో పని చేస్తూ ‘సాక్షి’కెమెరాకు చిక్కాడు. బస్తీలు, కాలనీల్లో పని చేయించాల్సిన అధికారి తన ఇంట్లో ఇలా పని చేయించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కోర్టు ధిక్కరణ కేసు: కలెక్టర్కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన -
పారిశుద్ధ్య యోధులకు వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్లలో ఒకరైన పారిశుద్ధ్య కార్మికులకు త్వరలో ఉచితంగా వ్యాక్సిన్లు వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని ఇతర 141 పురపాలికల్లో పనిచేస్తున్న సుమారు 75 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల వివరాలను రాష్ట్ర పురపాలక శాఖ సేకరిస్తోంది. స్వీపర్లు, చెత్త కుండీలను ఖాళీ చేసే వారు, మురికి కాల్వలు శుభ్రం చేసేవారు, ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే వారు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ వర్కర్లు, వ్యర్థాలు తరలించే ట్రాక్టర్లు/డంపర్లు/ఇతర వాహనాల డ్రైవర్లు, స్వచ్ఛ ఆటోలు/రిక్షా కార్మికుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ‘గ్రేటర్’లోనే 30 వేల మంది.. జీహెచ్ఎంసీ పరిధిలో 30 వేల మంది, రాష్ట్రంలోని ఇతర 141 పురపాలికల్లో మరో 30 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సేవరేజీ బోర్డు (జల మండలి) పరిధిలో మరో 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కోవిన్ (CoWIN) మొబైల్ యాప్లో వీరి వివరాలను నమోదు చేసే ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది. సామాన్యులకు యాప్.. వ్యాక్సినేషన్ కోసం ఎవరైనా సరే కోవిన్ యాప్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా, సామాన్య ప్రజలకు ఇంకా ఈ యాప్ను కేంద్రం అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ యాప్ ద్వారా ఫ్రంట్లైన్ వారియర్ల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రమే కొంతమంది ప్రభుత్వ అధికారులకు యాక్సెస్ సదుపాయం కల్పించింది. పారిశుద్ధ్య కార్మికుల వివరాలను సేకరించేందుకు... జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని మరో 12 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పురపాలక శాఖ డైరెక్టరేట్లోని ఇద్దరు రీజనల్ డైరెక్టర్లకు కోవిన్ యాప్ యాక్సెస్ సదుపాయం కల్పించారు. పారిశుద్ధ్య కార్మికుల పేరు, వయసు, చిరునామాతో పాటు ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ వివరాలను సేకరిస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారు మళ్లీ 28 రోజులకు రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్లను సైతం తీసుకుంటున్నారు. శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న కార్మికుల వివరాలను సైతం సేకరిస్తున్నారు. వీరికి సైతం వ్యాక్సిన్.. ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్నులు వసూలు చేయడం, కోవిడ్ కాంటాక్టులను గుర్తించడం, బహిరంగ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేయడం వంటి విధుల్లో పాల్గొనే మున్సిపాలిటీల ఇంజనీర్లు, రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బంది, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆపరేటర్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు, దహనవాటికల్లో పనిచేసే మున్సిపల్ సిబ్బంది, సివిల్, ఎలక్ట్రికల్, ఇతర మెయింటెనెన్స్ పనుల్లో పనిచేసే జూనియర్ ఇంజనీర్లు, వాటర్ మీటర్ రీడర్లు, ప్లంబర్లు, వాటర్ సప్లై లైన్మెన్, పార్కుల నిర్వహణ సిబ్బందిని సైతం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి వారికి సైతం టీకాలు వేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం వీరి వివరాలను సైతం సేకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన వివరాలను సైతం పురపాలక శాఖ సేకరిస్తోంది. -
కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైప్ సపోర్ట్) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస్తాయి. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్మెడ్’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్ వెంటిలేటర్లను అమర్చుతున్నారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్తో పాటు డిఫ్రిబ్యులేటర్(గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్(రక్తంలో ఆక్సిజన్ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఇవన్నీ అమర్చి ఈ నెలలో వీటిని వినియోగించేందుకు సమాయత్తం చేస్తున్నారు. (కరోనాపై పోరు; మరో మైలురాయి) గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయనుంది. ఇందుకుగాను రూ.3.84 కోట్లను జిల్లాలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పనిచేస్తున్న 19,584 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం, టోపి, రెండు జతల బ్లాక్ గమ్ షూ, యూనిఫాం మీద వేసుకోవడానికి కోట్ పంపిణీ చేయనుంది. ఒక్కొక్క రక్షణ కిట్ కోసం గరిష్టంగా రూ. 3 వేల చొప్పున ఖర్చు చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. (వీరంతా సచివాలయానికి రావాల్సిందే) -
లాక్డౌన్ తప్పదు
-
సఫాయి అన్నా నీకు సలామ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశుధ్య సిబ్బందికి కోత విధించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వారికి అదనంగా నగదు ప్రోత్సాహకం కూడా అందజేస్తామన్నారు. అలాగే కరోనా నియంత్రణ పోరులో కీలకంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వారి మూలవేతనంలో 10 శాతాన్ని సీఎం ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఒకట్రెండు రోజుల్లో ఇస్తాం.. ‘వైద్యులు, పోలీసు సిబ్బందితో పాటు కొంతమంది కరోనా నియంత్రణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు భుజాన రసాయనాలు తగిలించుకుని స్ప్రే చేస్తూ నగరాలు, పట్టణాలను అద్దంలా పెడుతున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా 95,392 మంది ఉన్నారని గుర్తించాం. అందులో 43,661 మంది గ్రామపంచాయతీ కార్మికులు, 21,531 మంది మున్సిపాలిటీల సిబ్బంది, 2,510 మంది హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, 27,690 మంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. వీరికి ఈ నెల వేతనం ఇచ్చే విషయంలో కొంత పొరపాటు జరిగింది. 10శాతం వేతనం కట్ అయింది. ఆ వేతనాన్ని ఒకట్రెండు రోజుల్లో జమ చేస్తం. దీంతోపాటు ముఖ్యమంత్రి ప్రోత్సాహకం కింద జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి రూ.7,500 అదనంగా ఇస్తాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది రూ.5,000 ఇస్తాం. నేను గతంలో కూడా చెప్పాను. సఫాయి అన్నా నీకు సలామ్ అన్నా అని.. ఇప్పుడు కూడా చెబుతున్నా సఫాయి అన్నా నీకు సలామ్ అన్నా. తల్లిదండ్రుల తర్వాత మీరే గొప్ప వారు. కనిపించే దేవుళ్లు. మా సైనికులు మీరు. మేమిచ్చే డబ్బు తక్కువే. మిమ్మల్ని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. భారతదేశ ధాన్యాగారంగా రాష్ట్రం బెంగాల్ నుంచి గన్నీ బ్యాగుల దిగుమతి కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో మాట్లాడిన. అక్కడి కేబినెట్ కార్యదర్శి మన సీఎస్తో మాట్లాడినరు. మనం సేకరించిన ధాన్యంలో 50–60 శాతాన్ని గన్నీ బ్యాగుల్లోనే ఇవ్వాలని ఎఫ్సీఐ నిబంధన ఉంది. వీటిని బెంగాల్లో తయారు చేయించి పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మనకు ఏడు కోట్ల గన్నీ సంచులు కావాలని అడిగిన. సాధ్యం కాకుంటే ఎఫ్సీఐ వాళ్లు 100 శాతం ప్లాస్టిక్ బ్యాగులు తీసుకోవాల్సి ఉంటుంది. 40లక్షల ఎకరాల వరి పంట తెలంగాణలో తొలిసారిగా వస్తోంది. ఈ కరోనా లేకుంటే నేను డ్యాన్స్ చేసి సంబరపడేవాడిని. డబ్బులు లేకున్నా ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ.30వేల కోట్లు సమీకరించినం. 7వేల సెంటర్లు పెట్టినం. తెలంగాణ ఇప్పుడు భారతదేశ ధాన్యాగారం అయిపోయింది. ఇంకా రెండడుగులు ముందుకుపోతే దేవాదుల, సీతారామ, పాలమూరు, కాళేశ్వరం పూర్తి అయితే ఒక కోటీ 30లక్షల ఎకరాల దాకా వరి సాగుకు తెలంగాణ చేరుకుంటది. ఈ గన్నీ బ్యాగుల పంచాయతీ ఎందుకని మన దగ్గరే రెండు మూడు కంపెనీలు పెట్టించండని మంత్రికి చెప్పిన. వారికి రాయితీలు, భూములు ఇచ్చి ఒకటి రెండు జ్యూట్ మిల్స్ పెట్టించమన్న. రాజకీయాలకు నాలుగేళ్ల టైం ఉంది ఈ సమయంలో చిల్లరగాళ్లు చేసే ప్రచారాలను పట్టించుకోకుండా సమాజం జాగ్రత్తగా ముందుకెళ్లాలి. కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నయ్. వైద్యులకు రక్షణేదీ.. అని రాస్తున్నయ్. పీపీఈ కిట్లు లేవా? 40వేలున్నయ్ మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతం. ఎంతో చిత్తశుద్ధితో, ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వెకిలి వార్తలు రాస్తరా? ఈ సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి. వారికి శిక్ష తప్పదు. మీరు రాసేదాంట్లో వాస్తవం లేదు. మీకే ఉందా బాధ్యత.. మాకు లేదా? ఈ సమయంలో కూడా 5లక్షల కిట్లు, లక్షలాది మాస్కులకు ఆర్డర్ ఇచ్చినం. మా హెల్త్ మినిష్టర్ కానీ మేం కానీ పడుకుంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నం. వైద్యం ఒక్కటే కాదు కదా? రాష్ట్రంలో అన్నీ చూసుకోవాలి. ఈ సమయంలో భుజానికి భుజం తోడయి ముందుకెళ్లాలి. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా. వక్రబుద్ధి ఉన్నవాళ్లు సక్రమంగా మారాలి. తర్వాత మీ ఇష్టం. అది మీ ఖర్మ. మీకు కరోనా తగలాలని శాపం పెడుతున్నా. రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు టైం ఉంది. హైరానా ఎందుకు? ఇప్పటికైనా క్లీన్మైండ్ ఉండాలి. వీరికి సరైన సమయంలో సరైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లు ప్రజాద్రోహులు, దేశద్రోహులు. మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా ఆగాలి. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది. మామూలుగా చెప్పడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను చెపుతున్నవన్నీ కుత్సిత, చిల్లర బుద్ధితో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి మాత్రమే. దీన్ని మీడియా కూడా సహించవద్దు. దేశ ఐక్యత కోసం పనిచేసే వాళ్లు ఈ సమయంలో గొప్పవాళ్లు కానీ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవారు కాదు. ఆ త్యాగధనుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలి. మీడియాలో కూడా మంచి వార్తలు రాసేవాళ్లున్నరు. వాళ్లకు దండం పెడతం, రెండు కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటం. పెద్దలు, బుద్ధిజీవులు, కవులు మంచి సాహిత్యం వెలువరించాలి. ప్రస్తుతం మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే వైతాళికులు కావాలి. చిల్లర రాజకీయం, చిల్లర ప్రచారం, చిల్లర పేపర్లు కాదు. అల్పులు, గొప్పవాళ్లు ఇలాంటి సందర్భంలోనే బయట పడతారు. బీడీలు చుట్టే ఓ మహిళ, రేషన్ బియ్యాన్ని పంచిన మరో మహిళ.. ఇలాంటి వాళ్లకు పాద పూజ చేసి, రాష్ట్ర అవతరణ సమయంలో అవార్డులు కూడా ఇవ్వాలి. జిల్లాల్లో కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా కొంత నగదు ఇస్తాం. 24 గంటలు కష్టపడే వాళ్లకు కొంత నగదు ఇచ్చేందుకు కలెక్టర్లకు నిధులిస్తాం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement