-
ఆ ఫోన్ను వెనక్కిచ్చేసి ఐఫోన్ కొంటున్నారు!
గెలాక్సీ నోట్7 పేలుళ్ల దెబ్బతో శాంసంగ్కు తీవ్ర ప్రతికూలతే ఏర్పడిందని పలు రిపోర్టులొచ్చాయి. అయితే గెలాక్సీ నోట్7 రీకాల్ తర్వాత మార్కెట్లలో శాంసంగ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో సగం మంది గెలాక్సీ నోట్7 యూజర్లు, తమ ఫోన్లను నగదుకు వెనక్కి ఇచ్చేసి, ఆ క్యాష్తో ఆపిల్ ఐఫోన్లను కొంటున్నారని తేలింది. 17 శాతం యూజర్లు మాత్రమే వేరే శాంసంగ్ డివైజ్ తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో శాంసంగ్కు తలెత్తిన గెలాక్సీ నోట్7 సంక్షోభం వల్ల ఆ కంపెనీ కొంతమంది విధేయులను కోల్పోవాల్సి వస్తుందని ఐడీసీ పేర్కొంది. మొత్తం 1,082 మంది ఆన్లైన్ కస్టమర్లతో ఐడీసీ ఈ సర్వే చేపట్టింది. వారిలో 507 మంది శాంసంగ్ స్మార్ట్ఫోన్ ఓనర్స్, 347 మంది గతంలో శాంసంగ్ యూజర్లు, 228 మంది శాంసంగ్ కాని యూజర్లు, 24 మంది ప్రస్తుత నోట్7 యూజర్లు ఉన్నారు. అయితే భవిష్యత్తులో వచ్చే శాంసంగ్ ఫోన్లు కొనుక్కునే వాటిపై ఈ గెలాక్సీ సంక్షోభం ఉండదని చాలామంది చెప్పినట్టు తెలిపింది. స్మార్ట్ఫోన్ కాని ఇతర శాంసంగ్ ఉత్పత్తులపైనే ఈ ప్రభావం చూపదని పేర్కొన్నారు. రీకాల్ ప్రాసెస్లో కంపెనీ కస్టమర్లతో చాలా విధేయతతో ప్రవర్తిస్తుందని ఈ సర్వేలో తెలిసింది. ఆశ్చర్యకరంగా మరో విషయమేమిటంటే 13 శాతం మందికి అసలు శాంసంగ్ రీకాల్ ప్రక్రియనే తెలియదని తేలింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనతో శాంసంగ్ కంపెనీ ఆ ఫోన్లను రీకాల్ చేస్తూ.. వాటి స్థానంలో కస్టమర్లకు క్యాష్ లేదా గెలాక్సీ ఎస్7/ఎస్ 7 ఎడ్జ్లను ఆఫర్ చేస్తోంది. ఆ ఫోన్ల రీకాల్ చేపట్టి, ఉత్పత్తులనూ నిలిపివేసింది. ఎట్టిపరిస్థితుల్లో తమ ఫోన్లను వాడొద్దని ఆ కంపెనీనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ నోట్ 7 యూజర్లకు గుడ్ న్యూస్!
దక్షిణ కోరియా స్మార్ట్ ఫోన్ మేకింగ్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ కు గెలాక్సీ నోట్ 7 మంటలు ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టింది. తమ ఫోన్లను(గెలాక్సీ నోట్ 7) విమానాల్లో మాత్రం అసలు వాడవద్దని, స్విచ్ఛాఫ్ చేయడం ఉత్తమమని ఇటీవల ప్రకటించిన ఆ కంపెనీ తాజాగా మరో పద్ధతిని పాటిస్తోంది. విమానాలలో అమెరికాకు వెళ్తున్న, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల వద్ద గెలాక్సీ నోట్ 7 ఉంటే వాటిని రీప్లేస్ చేసేందుకు ఎయిర్ పోర్టుల్లో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది. పేలుతున్న ఆ మోడట్ మోబైల్స్ కు బదులుగా వేరే స్టార్ట్ ఫోన్స్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికాలో విమాన ప్రయాణాల్లో ఈ మోడల్ పై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలో కొన్ని ప్రముఖ విమానాశ్రయాల్లో మాత్రమే తమ సెంటర్స్ ఏర్పాటు చేశామని, అయితే ఆ ఎయిర్ పోర్టుల జాబితాను ప్రస్తుతం వెల్లడించలేకపోతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 రీస్లేస్ సెంటర్ ఏర్పాటు చేశారని అక్కడి మీడియా ప్రతినిధి సెర్గియో క్వింటానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణకోరియా మీడియాల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని అత్యంత రద్దీ ఉండే ఎయిర్ పోర్టుల్లో కూడా శాంసంత్ కొన్ని స్టార్ట్ ఫోన్ రీప్లేస్ సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఒకవేళ యూజర్లు తమ మనీ రీఫండ్ చేయమని అడిగినా, కొత్త స్మార్ట్ ఫోన్ కొనుకోలు చేసినా వాటికి సంబంధి కంపెనీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయదని శాంసంగ్ ప్రతినిధి తెలిపారు. Samsung has a team of representatives at SFO to help customers with the Note7 phone. It's banned from US flights. pic.twitter.com/2IiEcg6hsU — Sergio Quintana (@svqjournalist) 17 October 2016 -
మా ఫోన్లు వాడకండి.. స్విచాఫ్ చేసేయండి
ఎవరైనా సరే సాధారణంగా తమ ఫోన్లు అద్భుతంగా పనిచేస్తాయని, వాటినే వాడాలని వినియోగదారులను ఊదరగొడుతుంటారు. కానీ, శాంసంగ్ కంపెనీ మాత్రం తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవరూ వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసేయాలని చెబుతోంది. ''వినియోగదారులు ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా, మార్చుకున్నది ఉన్నా కూడా దాన్ని వెంటనే స్విచాఫ్ చేసేయండి. ఆ ఫోన్ వాడకండి'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి. కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన శాంసంగ్ తలపట్టుకుంది. వెంటనే ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటినీ కోరింది. అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ పరిశోధనలలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయడం ఇది రెండోసారి. యాపిల్ ఐఫోన్కు దీటుగా ఉండేలా ఈ ఫోన్ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసింది. దానికి ప్రీబుకింగ్స్ భారీగా ఉండటంతో తొలుత సరఫరా చేయలేనంత పరిస్థితి ఏర్పడింఇ. కానీ, అది మార్కెట్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే సోషల్ మీడియాలో ఇందులోని సమస్యల గురించి బాగా ప్రచారం జరిగింది. బ్యాటరీలలో సమస్యలు ఉన్నాయని దాదాపు 25 లక్షల ఫోన్లను వెనక్కి తీసుకుని, వాటి బ్యాటరీలు మార్చి మళ్లీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా సమస్య అలాగే ఉండటంతో ఇక ప్రస్తుతానికి ఆ ఫోన్ వాడకం ఆపేయమనడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా పోయింది. -
అమితాబ్ కు శాంసంగ్ షాక్!
ముంబై: బ్యాటరీ పేలుళ్లతో వినియోగదారులను భయపెడుతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఎదురవుతున్న ఇబ్బందులను ‘బిగ్ బి’ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఫోన్ పూర్తిగా చార్జింగ్ ఎక్కడం లేదని ఆయన తెలిపారు. ‘నేను శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ వాడుతున్నాను. ఎప్పుడు చార్జింగ్ పెట్టినా 60 శాతంకు మించి ఎక్కడం లేదు. 100 శాతం చార్జింగ్ ఎప్పుడు అవుతుంది? శాంసంగ్ వెంటనే స్పందించాల’ని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. దీనిపై అభిమానుల నుంచి వెంటనే స్పందన వచ్చింది. గెలాక్సీ నోట్ 7 పేలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఆ ఫోన్ మార్చాలని వికాస్ సింగ్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. బ్యాటరీలో సమస్య తలెత్తడంతో 25 లక్షల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది. అమితాబ్ ట్వీట్ పై శాంసంగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆయనకు కొత్త ఫోన్ ఇస్తుందో, బ్యాటరీ మారుస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, భారత విమానాల్లో ఉపయోగించే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విధించిన నియంత్రణలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ రోజే ఎత్తివేసింది. T 2395 -I have Samsung Note 7. Battery charge restricted to 60%. When will it allow me to go 100 ? Mr Samsung please respond ! zara jaldi ! pic.twitter.com/VVkzPqXh1j — Amitabh Bachchan (@SrBachchan) 30 September 2016 -
స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?
స్మార్ట్ఫోన్ దిగ్గజాలకు ఏడు నెంబర్ ఏడిపిస్తోందా? అసలు అచ్చికి రావడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది.ఇటీవలే శాంసంగ్ తాజా స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్7 పేలుడు ఘటనలు మార్కెట్లో తీవ్ర సంచలనం రేపగా.. ఇప్పడు అదే బాటలో మరో దిగ్గజం ఆపిల్కు షాక్ తగిలిందట. ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ పేలిపోయిందని వార్తలు బయటికి పొక్కాయి. ఎప్పుడూ ఒకరినొకరు కాఫీ చేసుకుంటూ స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని ఏలే ఈ రెండు దిగ్గజాలు ఏడు నెంబర్తో తాజా ఫ్లాగ్షిప్లను విడుదల చేశాయి. కానీ ఈ రెండింటికి ఏడు నెంబర్ షాకిస్తూ పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్7 పేలుళ్ల సమస్య శాంసంగ్కు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 బ్యాటరీ లోపంతో పేలిపోగా, ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ మోడల్ సరియైన కారణాలు వెల్లడికాలేదు. ఈ ఫోన్ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుని దగ్గరికి పేలిపోయిన ఫోన్ డెలివరీ అయింది. ఆర్డర్ను అందుకుని బాక్స్ తెరిచిచూడగానే పేలిపోయిన ఫోన్ను గుర్తించినట్టు వినియోగదారుడు పేర్కొన్నాడు.ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యే మధ్యలో ఈ పేలుడు సంభవించి ఉంటుందని ఫోన్ యజమాని చెబుతున్నాడు. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటికీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.కానీ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడు రీప్లేస్మెంట్ కోసం ఆపిల్ సంస్థను ఆశ్రయించాడు. ప్రస్తుతం పేలిపోయిన ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement