breaking news
Sambaralu
-
ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారం
డల్లాస్, టెక్సాస్: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మినీ తెలుగు సంబరాలను నిర్వహిస్తోంది. ఈ మినీ తెలుగు సంబరాల్లో తొలి రోజు డల్లాస్లోని ఇర్వింగ్లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ లో నిర్వహించారు. ఈ మినీ సంబరాల్లో తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజా ఝవేరీ, సియా గౌతమ్ పాల్గొన్నారు. మిని సంబరాలు తొలి రోజు కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని నాట్స్ ప్రదానం చేసింది. తెలుగు సినీ కళాకారులు, గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలను చూపించి ప్రవాస తెలుగు వారిని అలరించారు. స్థానిక ప్రవాస బాల బాలికల నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బావర్చీ వారి ప్రత్యేక విందు ఏర్పాట్లు అందరి మన్ననలను పొందాయి. శనివారం ఉదయం 9 గంటలకు జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రాబోయే రెండేళ్లలో నాట్స్ చేపట్టబోయే పలు కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఏడో అమెరికా తెలుగు సంబరాలు 2023 జూన్ 30 నుంచి జూలై 2 వరకూ న్యూజెర్సీ లోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్ జరపాలని నిర్ణయించినట్టు బోర్డ్ చైర్ విమెన్ ఆరుణ గంటి ప్రకటించారు. ఏడో అమెరికా తెలుగు సంబరాలకు పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్గా వ్యవహరించనున్నారు. సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా ఎప్పటిలాగే తెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రవాస తోటి తెలుగువారికి అవసరమైనప్పుడల్లా సాయం అందిస్తామని నాట్స్ చైర్విమెన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ అభివృద్ధిలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవాలంటే అన్ని చాప్టర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ విమెన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్ అప్పసాని, డాక్టర్ మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపునూతి, పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహనకృష్ణ మన్నవ, శ్రీనివాస్ మంచికలపూడి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణ ఎలమంచిలి, డాక్టర్ ఆచంట, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, రాజేష్ కాండ్రు, రంజిత్ చాగంటి, మదన్ పాములపాటి, జ్యోతి వనం, మురళీకృష్ణ మేడిచెర్ల, కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ ఆరికట్ల, మూర్తి కొప్పాక, భాను ధూళిపాళ, తెదేపా నాయకులు ముళ్ళపూడిబాపిరాజు, అరిమిల్లి నాగరాజు, డల్లాస్ ప్రవాసులు డాక్టర్ ప్రసాద్ నల్లూరి, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, కేసీ చేకూరి, కొర్రపాటి శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఉప్పు వినోద్, సురేష్ మండువ, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులుపాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలు: వైఎస్సార్సీపీ శ్రేణుల గెలుపు సంబరాలు
-
టీపీఏడీ బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో 2016 బతుకమ్మ, దసరా సంబరాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 8న నిర్వహించే ఈ వేడుకలకు సుమారు 10 వేల మంది హాజరౌతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వెలుపల నిర్వహించే అత్యంత భారీ బతుకమ్మ వేడుకలు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రిస్కోలోని డా. పెప్పర్ ఎరినా వేదికగా జరిగే ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వస్తోందని టీపీడీఏ వెల్లడించింది. ఏటీఏ, టీఏటీఏ, ఎన్ఏటీఏ, టీఏఎన్ఏ, ఎన్ఏటీఎస్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీఏఎన్టీఈఎక్స్, ఐఏఎన్టీ, టీఈఏ, మనబడి లాంటి సంఘాలు ఈ వేడుకలకు పూర్తి మద్దతు తెలిపాయి. వేడుకలకు హాజరయ్యే భారీ సమూహానికి సౌకర్యంగా ఉండటం కోసం వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేసినట్లు టీపీడీఏ తెలిపింది. ఒకేసారి 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేయడం విశేషం. సంబరాలను వీక్షించడానికి భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం నుంచి బతుకమ్మ, జమ్మిపూజ, మ్యూజిక్ బొనాంజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాశీఖన్నా, రెజీనా, గీతా మాధురి, సాకేత్, ఇషా రబ్బా, షామిలి, నరేంద్ర లాంటి టాలీవుడ్ ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే రోజా, గరికపాటి రామ్మోహన్ రావ్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం వేడుకలకు హాజరౌతారని నిర్వాహకులు వెల్లడించారు.