breaking news
sajeeva samaadi
-
ఉగాది రోజున ఓ వ్యక్తి సజీవ సమాధికి ప్రయత్నం
ప్రకాశం: ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని సమాధి నుంచి బయటకు తీసుకొచ్చిన ఘటన తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విఠలాపురంలో స్థానిక భూదేవి ఆలయం వద్ద కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి తాను సజీవ సమాధి అవుతున్నానని చెప్పి అందుకు ఏర్పాట్లు చేసుకుని గుంత తవ్వి అందులోకి దిగి పైన రేకు వేసేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఎందుకు ఇలా చేస్తున్నావని గ్రామస్తులు అడిగితే ఈ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని, కులమతాలు లేకుండా అందరూ ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటూ నేను దీక్ష తీసుకొని సజీవ సమాధి అవుతున్నానని చెప్పాడు. ఈలోపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని లోపలి నుంచి బయటికి తీసి ఇకపై ఇటువంటి పనులు మళ్లీ చేయవద్దంటూ హెచ్చరించారు. ఇదంతా ప్రచారం కోసం చేసిన ప్రయత్నమని ఎస్సై మల్లికార్జునరావు తెలిపారు. అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. -
బొగ్గుయార్డులో లారీ క్లీనర్ సజీవ సమాధి
గణపురం :మండలంలోని చెల్పూరు శివారులోని కేటీపీపీలోని బొగ్గుయార్డ్లో శనివారం జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ దర్శనాల సమ్మోదర్(23) సజీ వ సమాధి అయ్యాడు. భూపాలపల్లిలోని రాంనగర్లో నివాసముం టున్న సింగరేణి కార్మికుడు దర్శనాల వెంకటయ్య, విమల దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారి లో ఒక కుమారుడైన సమ్మోదర్ బొగ్గు లారీపై క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భూపాలపల్లి నుంచి లోడుతో కేటీపీపీకి వచ్చిన రెండు లారీలు యార్డ్లో బొగ్గును డంపు చేస్తున్న సమయంలో సమ్మోదర్పై బొగ్గుపడింది. ఈ విషయాన్ని రెండు లారీల డ్రైవర్లు గమనించలేదు. డంపు చేసిన తర్వాత క్లీనర్ కోసం వెతకగా కనిపించలేదు. అతడి కోసం అరగంట సేపు వెతికారు. తర్వా త అనుమానం వచ్చి అక్కడ డంపు చేసిన బొగ్గును ప్రొక్లయిన్తో తోడగా ముక్కలుముక్కలుగా సమ్మోదర్ మృ తదేహం బయటపడింది. తల కనిపిం చలేదు. ప్రమాదానికి కారణమైన లారీలు వేర్వేరు ట్రా¯న్పోర్టులకు సం బంధించినవి. బొగ్గు డంపు చేసే సమయంలో యార్డ్కు సంబంధించిన అధికారులు లేకపోవడంతో సంఘటన సమాచారం కచ్చితంగా తెలి యడం లేదు. పోలీసులు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎస్సై ప్రవీన్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య మంజుల, నాలుగు నెలల కూతురు పాప ఉన్నారు. మృతుడి కూతురు పరిస్థితి విషమం సంఘటన స్థలంలో సమ్మోదర్ మృతదేహంపై పడి భార్యతోపాటు తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగి లేలా విలపించారు. సుమారు నాలు గు నెలలు కూడా నిండని అతడి కూతురికి ఫిట్స్ వచ్చాయి. దీంతో గాబరా పడ్డా బంధువులు చేతిలో ఇనుప వస్తువు పెట్టి కాళ్లు చేతులు మర్దన చేశారు. భర్త మరణం, కూతురి పరిస్థితిని చూసి మంజుల బోరున విలపించింది. పాపను స్థానిక అస్పత్రికి తరలించారు.