-
అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఉడాన్ యోజన(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానయాన కంపెనీలకు కొన్ని రాయితీలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీ గడువు ముగిసిన తర్వాత కొన్ని సర్వీసులు ఆగిపోయాయనే వాదనలు ఉన్నాయి. కొన్ని అంతకు ముందు నిలిచిపోయినట్లు తెలిసింది. అయితే తాజాగా కేంద్రం రూట్లను తగ్గించి విమానాలు నడుపుతున్నారని పలువురు భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా పార్టీల నేతలు వాటిపై ఎలాంటి ప్రశ్నలు అడగడంలేదు. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యసింథియా స్పందించారు. ఇప్పటికే కోటి 30 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ల కన్సెషన్ గడువు ముగిసింది. దాంతో కేవలం 7 శాతం (54 రూట్లు) మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి’ అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఉడాన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా 76 ఎయిర్పోర్టులు ఉడాన్ యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) వల్ల ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కొత్తగా 9 ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్పోర్ట్లు కేవలం ఉడాన్ యోజన కిందే ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను చెల్లించాలని ప్రతిపాదించాం. దాంతో ఈ పథకం ద్వారా మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకున్నాం. ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే మూడేళ్ల తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానాల్లో కొత్త రూట్లను గుర్తిస్తున్నాం. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్న కొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’అని మంత్రి వివరించారు. దేశంలో ఇటీవల నెలకొన్న ప్రత్యేకపరిస్థితుల వల్ల గరిష్ఠంగా ఒకరోజు 4 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్కు ముందు 2019 లెక్కల ప్రకారం దేశీయంగా నడిచే విమానాల్లో వారానికి దాదాపు 90 వేల మంది ప్రయాణించారని సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఏపీలో గతంలో మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత 40 ఉడాన్ రూట్లను గుర్తించారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్దల్పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా ఆమోదం తెలిపారు. -
గుంటూరులో దారుణ హత్య
గుంటూరు: గుంటూరు ఆటోనగర్లో సోమవారం ఉదయం సాయిరెడ్డి అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడి రోడ్డుపక్కన పడిఉన్న సాయిరెడ్డిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సాయిరెడ్డిని జీజీహెచ్లో చేర్పించారు. అయితే తీవ్రంగా కాలినగాయాలతో అక్కడ చికిత్సపొందుతూ సాయిరెడ్డి మృతిచెందాడు. ఘాతుకానికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య
ఆదిలాబాద్ రూరల్, న్యూస్లైన్ : ఆర్టీసీ ఉద్యోగుల జంట మండలంలోని మావల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆదిలాబాద్లో కలకలం రేపింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ ఏఎస్సై పొచ్చన్న, ప్రత్యక్ష సాక్షి శ్రీకాంత్ కథనం ప్రకారం.. బోథ్ మండలం కౌట(బి) గ్రామానికి చెందిన రావుల తిరుపతిరెడ్డి కూతురు సుధారాణికి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఊరుర్ గ్రామానికి చెందిన సాయరెడ్డితో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సాయరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ డిపో-2లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుధారాణి కొంతకాలంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తోంది. పట్టణంలోనే నివాసం ఉంటోంది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన దార్ష రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్ ఆర్టీసీ అద్దె బస్సుపై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య నుంచి విడాకులు పొందడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్(38), సుధారాణి(26)ల మధ్య ఏర్పడిన పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. బుధవారం వారిద్దరూ కలిసి సీతాగొంది జాతీయ రహదారిపై ఉన్న దాబాలో భోజనం చేశారు. అక్కడి నుంచి సుధాకర్ స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి మోటారు సైకిల్పై మావల చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన తర్వాత శ్రీకాంత్ తమ ఆత్మహత్యను అడ్డుకుంటాడనే ఉద్దేశంతో వారు అతడిని చెరువు ఇవతలి వైపు తోసేశారు. ఆ తర్వాత సుధాకర్, సుధారాణి కలిసి చెరువులో దూకారు. శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీయించారు. వివాహేతర సంబంధం బయటకు పొక్కడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు. సుధారాణి మృతదేహాన్ని తండ్రి తిరుపతిరెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. ఏదేమైనా ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య అటు కుటుంబాలతోపాటు డిపోలో విషాదాన్ని మిగిల్చింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Advertisement