breaking news
Rs.20 thousand
-
ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలి
గోరంట్ల : జిల్లాలో వర్షాబావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బూచేపల్లి గ్రామంలో ఆయనSగురువారం విలేకరులతో మాట్లాడారు. గత రెండేళ్లు ప్రకృతి వైఫరీత్యాలతో పాటు ప్రభుత్వం వైఫల్యాల కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్డాడుతోందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు ఎంతో ఆశతో అప్పులు చేసి పంటను సాగు చేశారన్నారు. అయితే ఆతర్వాత వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎండిపోయిందన్నారు. పంట పెట్టుబడులు సైతం దక్కే అవకాశం లే దని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. గ్రామాలలో ఏ రైతును కదిలించిన పంట నష్టంపై వాపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం రక్షక తడులను అందించినట్లు అంకెల గారడితో రైతులను మభ్యపెడుతోందని విమర్శించారు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతులతో రక్షక తడులను అందించినట్లు సంతకాలు, వివరాలను తీసుకోవడం జరుగుతోందన్నారు. గోరంట్ల మండలంలో 38311.18 ఎకరాల్లో పంట సాగు చేస్తే సుమారు 2 వేల ఎకరాలకు రక్షక తడులను అందించామని అధికారులు అంటున్న , క్షేత్రస్థాయిలో రైతులు అందలేదని అంటున్నారని ఆయన తెలిపారు. వేరుశనగ సాగు చేసిన రైతులు నష్టపోయి ఏడాదికేడాది వలసలు వెళ్తున్నారని, దీంతో ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి వేరుశనగ రైతుకు పూర్తిస్థాయిలో కనీసం ఎకరాకు రూ. 20 వేల చొప్పున నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తే రైతాంగం తరుపున ఉద్యమాలు చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
లంచం తీసుకుంటూ దొరికిపోయిన శీనప్ప
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రంగారెడ్డి జిల్లా గండేడు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శీనప్ప లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. పట్టా భూమి పేరు మార్పిడికి ఓ రైతు నుంచి రూ.20వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్తో సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. శీనప్పపై అధికారులు కేసు నమోదు చేశారు. -
'తులం బంగారానికి రూ. 20 వేలు ఇస్తాం'
-
'తులం బంగారానికి రూ. 20 వేలు ఇస్తాం'
మెదక్ జిల్లా జహీరాబాద్లోని ముత్తుట్ ఫైనాన్స్లో గత నెలలో చోరీకి గురైన బంగారం విషయంలో వినియోగదారులకు నగదు చెల్లించాలని ఆ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. నగదు కుదవ పెట్టిన వినియోగదారులకు తులం బంగారానికి రూ. 20 వేలు చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు ముత్తుట్ ఫైనాన్స్ అధికారులు వెల్లడించారు. ముత్తుట్ ఫైనాన్స్లో గతంలో 50 కేజీల బంగారం చోరీకి గురైంది. పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా 7 కేజీల బంగారాన్ని మాత్రమే రికవరీ చేశారు. అయితే తమ నగలను తమకు అప్పగించాలని వినియోగదారులు ఫైనాన్స్ కంపెనీని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో వినియోగదారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో కుదవ పెట్టిన బంగారానికి అంత రూపంలో నగదు చెల్లించాలని ముత్తుట్ ఫైనాన్స్ నిర్ణయించింది.